డ్రైవర్ లెస్ కార్లను భారతదేశంలో అనుమతించడానికి నిరాకరిస్తున్నకేంద్రమంత్రి నితిన్ గడ్కరీ!

భారతదేశం నిరంతరం అభివృద్ధి సాధిస్తూనే ఉంది. ఇందులో భాగంగా మారుతున్న కాలనికి అనుగుణంగా ప్రస్తుత సమాజంలో వాహన వినియోగ దారులు ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని ఆస్వాధిస్తున్నారు. ఈ కారణంగా డీజిల్ నుంచింపెట్రోల్ వాహనాలు, పెట్రోల్ వాహనాలనుంచి ఎలక్ట్రిక్ వాహనాలదాకా అనేకరకాల వాహనాలు వెలువడ్డాయి. ఇప్పుడు కొత్తగా డ్రైవర్ లేని వాహనాలు మార్కెట్లోకి వస్తున్నాయి.

డ్రైవర్ లెస్ కార్లను భారతదేశంలో అనుమతించడానికి నిరాకరిస్తున్నకేంద్రమంత్రి నితిన్ గడ్కరీ!

ప్రపంచంలో బాగా అభివృద్ధి చెందిన దేశాలు ఇప్పటికే సరికొత్తవాహనాలను వినియోగిస్తున్నారు. వీరు ఇప్పుడు డ్రైవర్ లేని వాహనాలను కూడా విరివిగా ఉపయోగిస్తున్నారు. ఈ డ్రైవర్ లేని వాహనాలను అమెరికా, సింగపూర్ వంటి బాగా అభివృద్ధి చెందిన దేశాలలో ఇప్పటికే వినియోగంలో ఉన్నాయి.

డ్రైవర్ లెస్ కార్లను భారతదేశంలో అనుమతించడానికి నిరాకరిస్తున్నకేంద్రమంత్రి నితిన్ గడ్కరీ!

ఇండియాలో దాదాపు 22 లక్షల డ్రైవర్ల కొరత ఉంది. అయినప్పటికీ మనదేశంలో డ్రైవర్ లేని వాహనాలను ఉపయోగించడం లేదు. కేంద్ర మంత్రి అయినా నితీష్ గడ్కరి మనదేశంలో డ్రైవర్ లేని వాహనాలు వినియోగించడానికి మాత్రం ఒప్పుకోవడం లేదు.

డ్రైవర్ లెస్ కార్లను భారతదేశంలో అనుమతించడానికి నిరాకరిస్తున్నకేంద్రమంత్రి నితిన్ గడ్కరీ!

కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితీష్ గడ్కరి ఒక సమావేశంలో మాట్లాడుతూ భారతదేశంలో ఎంత డ్రైవర్ల కొరత ఉన్నాగాని డ్రైవర్ లేని వాహనాలను వినియోగించడానికి ఒప్పుకోవడం లేదు. ఇప్పటికే తనని చాలామంది చాల సార్లు డ్రైవర్ లేని కార్ల గురించి అడిగారని సమావేశంలో చెప్పారు. నేను మంత్రిగా ఉన్నన్ని రోజులు డ్రైవర్ లేని వాహనాలను నేను ఆహ్వానించను, ఆ విషయం గురించి మరచిపోండి అని స్పష్టం చేసారు.

డ్రైవర్ లెస్ కార్లను భారతదేశంలో అనుమతించడానికి నిరాకరిస్తున్నకేంద్రమంత్రి నితిన్ గడ్కరీ!

వాహన స్క్రాపేజ్ విధానం చివరి దశలో ఉందని మంత్రి అన్నారు. మేము దానిని తీసుకువస్తే దాదాపు 100 శాతం మా ఖర్చు తగ్గుతుంది ఎందుకంటే ముడి పదార్థాలు మన దేశంలో చౌకగా దొరుకుతాయి. ఆటోమొబైల్ తయారీకి సంబంధించి భారతదేశం ప్రపంచంలోనే నంబర్ వన్ తయారీ కేంద్రంగా ఉంటుంది. ఎలక్ట్రానిక్ వెహికల్స్ కచ్చితంగా 5 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థకు దోహదం చేస్తుంది. ఇప్పుడు మనదేశంలో ఆటో మొబైల్ పరిశ్రమ దాదాపు రూ. 4.5 లక్షల కోట్ల పరిశ్రమ అని మంత్రి తెలిపారు.

డ్రైవర్ లెస్ కార్లను భారతదేశంలో అనుమతించడానికి నిరాకరిస్తున్నకేంద్రమంత్రి నితిన్ గడ్కరీ!

మే 2016 లో ప్రభుత్వం 28 మిలియన్ దశాబ్దాల నాటి వాహనాలను రహదారిపైకి తీసుకెళ్లాలని ప్రతిపాదించిన ముసాయిదా వాలంటరీ వెహికల్ ఫ్లీట్ ఆధునికీకరణ కార్యక్రమంను రూపొందించింది. కేంద్రం నుండి పాక్షిక సహకారంతో రాష్ట్రాలు ఎక్కువగా పాల్గొనడానికి ఈ పథకాన్ని పునః రూపకల్పన చేయాలని కార్యదర్శుల కమిటీ మంత్రిత్వ శాఖకు సిఫారసు చేసింది. ఉద్గార నిబంధనలను కఠినంగా అమలు చేయడంతో పాటు వాహనాల జీవితాన్ని పరిమితం చేయడానికి క్రమాంక చేయబడిన మరియు దశలవారీగా నియంత్రణ విధానాన్ని ఈ పథకం సూచించవచ్చని సూచించింది.

More from DriveSpark

Article Published On: Saturday, December 21, 2019, 18:37 [IST]
English summary
Nitin Gadkari Says No Driverless Cars in India Till he is Transport Minister-Read in Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+