త్రీ వీలర్ ప్యాసింజర్ విభాగంలోకి ప్రవేశించిన పియాజియో - అపె సిటీ ప్లస్ లాంచ్.
కమర్షిల్ ప్యాసింజర్ వాహన విభాగంలో విస్తరించే దిశగా, పియాజియో భారతదేశంలో కొత్త అపె సిటీ ప్లస్ ను ప్రారంభించింది. ఈ త్రీ వీలర్ పియాజియో యొక్క మిడ్-బాడీ త్రీ-వీలర్ సెగ్మెంట్లో ప్రవేశిస్తోంది.

ఈ లాంచ్ తో తన మార్కెట్ను మెరుగుపరచడమే పియాజియో లక్ష్యంగా పెట్టుకొంది. అపె సిటీ ప్లస్ ను, ఇటలీ మరియు భారతదేశం లో పియాజియో యొక్క పరిశోధన వద్ద అభివృద్ధి చేయబడింది.

ఈ మూడు చక్రాల వాహనం నాలుగు ఇంధన వేరియంట్లతో వస్తుంది అవి పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ, సీఎన్ జీ లుగా ఉంటాయని చెప్పారు.

ఇది బెస్ట్ ఇన్ క్లాస్ స్పేస్, పవర్ మరియు టార్క్ అందిస్తుంది. ఈ త్రీ వీలర్ లో స్టెప్ లెస్ ఎంట్రీ, మరియు అదనపు లగేజీ పెట్టుకోవడానికి కొంత స్థలం ఉంటుంది మరియు డ్రైవర్ మరింత సౌకర్యవంతమైన డ్రైవింగ్ చేసుకొనే విధంగా తాయారుచేసారు.

మార్కెట్ లో ఇతర ఉత్పత్తులతో పోలిస్తే దీని డిజైన్ కాస్తంత విభిన్నంగా ఉంటుంది మరియు ఇది మరింత పెద్ద బేస్తో కస్టమర్ని ఆకర్షిస్తుందని పియాజియో భావిస్తుంది.

కొత్త అపె సిటీ ప్లస్ అటొ రిక్షా197మి.మీ గ్రౌండ్ క్లియరెన్స్,1920మి.మీ వీల్ బేస్ కొలతతో ఉన్నాయి మరియు2,880మి.మీ మొత్తం పొడవు,1,435మి.మీ వెడల్పు మరియు1,970మి.మీ ఎత్తు ఉంది.

ఇందులో కొత్త త్రీ-వాల్వ్ 230సిసి పెట్రోల్ ఇంజన్ ను కలిగి ఉంది, ఇది 10బిహెచ్పి పవర్ మరియు 17.51ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

ఎల్పిజి వెర్షన్ 11బిహెచ్పి మరియు 20.37ఎన్ఎమ్ టార్క్ వద్ద కొంత ఎక్కువ శక్తిని అందిస్తుంది. అపె సిటీ ప్లస్ డీజల్ వేరియంట్ 8బిహెచ్పి పవర్ మరియు 21ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేయును. అన్ని వేరియెంట్లు 4-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్ మిషన్ తో వస్తాయి.

సస్పెన్షన్ మరియు హైడ్రాలిక్ టెలిస్కోపిక్ ఫోర్క్స్ ద్వారా హ్యాండిల్ చేయబడుతుంది, డ్రమ్ బ్రేకులు కూడా ఉన్నాయి. కొత్త అపె సిటీ ప్లస్ మార్కెట్లో అందుబాటులో ఉన్న ఇతర ఉత్పత్తులతో పోలిస్తే తక్కువ ధరతో ఉంటుంది. పెట్రోల్ వేరియంట్ 8 ఉచిత సర్వీసులతో 36 నెలలో 1 లక్ష కిలోమీటర్ల వారంటీతో వస్తుంది.డీజల్ వేరియంట్ 5 ఉచిత సర్వీసులతో 42 నెలలో 1.2 లక్షల కిలోమీటర్ల వారంటీతో వస్తుంది. పెట్రోల్ వెర్షన్ రూ. 1.71 లక్షలు, సీఎన్ జీ వేరియంట్ కు రూ. 1.92 లక్షలు(ఎక్స్ షోరూమ్,ఢిల్లీ) ధరలతో ఉంది.


Click it and Unblock the Notifications








