స్కోడా కోడియాక్ ఎస్యూవి పై భారీ డిస్కౌంట్ త్వరపడండి
ఆటోమోటివ్ పరిశ్రమ అమ్మకాలు నష్టాలలో ఉంది, అనేక ఆటో తయారీదారులు గత ఆరు నెలల కాలంలో అమ్మకాల్లో నష్టాలను బాటలో పయనించాయి, దీనికి ముఖ్య కారణంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొన్న కొత్త భద్రత నిబంధనల్ని చెప్పవచ్చు. అయితే ఇప్పటికే ఉన్న కార్లు మరియు ముడి పదార్థాల స్టాక్స్ క్లియర్ చేయడానికి, దేశీయ తయారీదారులు భారీ డిస్కౌంట్లు అందించటం ప్రారంభించారు. ఈ మార్గంలోకి స్కోడా కూడా వచ్చింది. వివరాలలోకి వెళితే..

భారతదేశంలో స్కోడా కోడియాక్ 2017 లో ప్రవేశించింది, వీటిలో ఎల్ మరియు కె వేరియెంట్ ల్లో లభ్యం అవుతుంది. ఈ ఎస్యూవిలు ఎల్ వేరియంట్ రూ.35.36 లక్షలు మరియు కె వేరియంట్ రూ.36.79 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా)గా ఉన్నాయి.

వీటి యొక్క ఇంజన్ విషయానికి వస్తే రెండు కార్లలో 2.0-లీటర్ టిడిఐ డీజల్ ఇంజన్ కలదు, ఇది 148బిహెచ్పి పవర్ మరియు 340 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ కు ఏడు-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ను జత చేయబడింది.

ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతాల్లోని స్కొడా వాహనాల డీలర్లు స్కోడా కోడియాక్ పై రూ.2.75 లక్షల వరకు డిస్కౌంట్లు ఆఫర్ ఇస్తున్నారు. స్కోడా కొనుగోలుదారులు ఇది ఒక మంచి అవకాశం అని చెప్పవచ్చు.

సెవెన్ సీటర్ కొడియాక్ ను అక్టోబర్ 2017 ప్రవేశపెట్టారు మరియుదీనిపై లాఉర్యిన్ మరియు క్లెమెంట్ వేరియంట్ ను వినియోగదారులకు నవంబర్ 2018 లో కొత్త వేరియంట్ గా తీసుకొచ్చారు. భారత మార్కెట్లో అరంగేట్రం చేసిన కోడియాక్ కు మిడ్ ఫేలిఫ్ట్ ను తీసుకు రావడానికి స్కోడా పని చేయనుందని తెలిసింది.

ప్రస్తుతం ఉన్నఈ ఎస్యూవి ప్రపంచ మార్కెట్లలో సుమారు మూడు సంవత్సరాల తరువాత స్కోడా వాహనానికి ఎంతో అవసరమైన అప్డేట్ ని ఇవ్వనుంది. కొత్తగా మెరుగుపరచబడ్డ వెర్షన్ ఖచ్చితంగా మరింత ఎక్కువ కస్టమర్లను ఆకర్షించనుంది.

రాబోయే స్కోడా కోడియాక్ ఫెలిఫ్ట్ కొత్త అప్డేట్లను కలిగి ఉండవచ్చు. ఒకసారి డిజైర్ పూర్తి అయిన తరువాత ఇందులో హెడ్ ల్యాంప్ క్లస్టర్లు, మరియు ఒక కొత్త గ్రిల్ కూడా ఆశించవచ్చు. ఇంటీరియర్స్ స్వల్ప మార్పులలో బహుశా ఒక కొత్త ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్ ను కలిగి ఉండవచ్చు.

అలాగే డ్రైవర్ అసిస్ట్ ఫీచర్లు, సేఫ్టీ మరియు సెక్యూరిటీ ఫీచర్లతో ఒక కొత్త స్కోడా కోడియాక్ అప్ గ్రేడ్ చేయబడే వచ్చు. తేలికపాటి హైబ్రిడ్ వేరియంట్ కూడా వర్క్స్ లో ఉండొచ్చు. అప్డేట్ చేయబడ్డ ఇంజిన్, వేహికల్ ని కొనుగోలుదారులకు మరింత ఆకర్షిస్తుంది అని చెప్పవచ్చు.

స్కొడా 2020 ఆటో ఎక్స్ పో వద్ద కరోక్ ను వెల్లడించవచ్చు అని కొన్ని వార్తల ద్వారా తెలిసింది. అంతేకాకుండా, భారత మార్కెట్ కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన MQB A0 IN ప్లాట్ ఫారమ్ పై నిర్మించిన ఇండియా-స్పెక్ కామిక్ కూడా ఈ సంవత్సరంలో తరువాత అమ్మకానికి వెళ్ళే ముందు ప్రదర్శించే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








