Just In
- 27 min ago 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- 48 min ago ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
- 2 hrs ago నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- 3 hrs ago సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
Don't Miss
- News తెలంగాణ జెన్కో, ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
- Sports Tilak Varma:అతని కోసమే ఆ సంబరాలు! వీడియో
- Movies The Goat Life Collections ఆడుజీవితం భారీ ఓపెనింగ్స్.. పృథ్వీరాజ్ సుకుమారన్కు ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
- Technology 6.67 అంగుళాల డిస్ప్లే, ట్రిపుల్ కెమెరాతో వివో కొత్త ఫోన్... లాంచ్, స్పెసిఫికేషన్ల వివరాలు..!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
జనవరి నుండి భారీగా పెరగుతున్న టాటా కార్ల ధరలు
టాటా తమ అన్ని ప్యాసింజర్ కార్ల ధరలను జనవరి 2020 నుండి పెంచుతున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 2020 నుండి అమల్లోకి రానున్న బిఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా తమ అన్ని ప్యాసింజర్ కార్లను అప్గ్రేడ్ చేస్తోంది, ఇందులో ప్రక్రియలో భాగంగా అయ్యే ఖర్చులకు అనుగుణంగా ధరలు తప్పనిసరని ఓ ప్రకటనలో పేర్కొంది.
టాటా మోటార్స్ ప్యాసింజర్ కార్ల లైనప్లో టాటా టియాగో నుండి టాటా హెక్సా వరకు రకరకాల మోడళ్లను విక్రయిస్తోంది. మార్కెట్లో టాటా కార్ల ధరల శ్రేణి రూ. 4.39 లక్షల నుండి రూ. 16.85 లక్షల వరకు, ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉన్నాయి.
టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ ప్రెసిడెంట్ మయాంక్ ప్రతీక్ తాజాగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, "అన్ని కార్లలో బిఎస్-6 ఇంజన్లను అప్గ్రేడ్ చేస్తున్న నేపథ్యంలోనే ధరలను పెంచుతున్నట్లు తెలిపారు. అయితే ధరల పెంపు ఎంత మేరకు ఉంటుందన్న ప్రశ్నకు సమాధానమివ్వలేదు.
సాధారణంగా ప్యాసింజర్ కార్ల ధర పెంపు రూ. 10,000 నుండి రూ. 15,000 మధ్య ఉంటాయి మరియు కార్ల ధరలను బట్టి ఒక్కోసారి రూ. 50,000 వరకు పెరిగే అవకాశం ఉంది. బిఎస్-6 అప్గ్రేడ్ కారణంగా కార్ల ధరలు మాత్రమే కాదు టూ వీలర్ల ధరలు కూడా పెరుగుతున్నాయి.
బిఎస్-6 ప్రమాణాల అమలుతో ధర పెరగడానికి ప్రధానం కార్లు/బైకుల్లో ఉపయోగించే ఇంజన్ను డిజైన్ను అంతర్గతంగా మార్చాల్సి ఉంటుంది. కార్లు మరియు బైకుల నుండి వెలువడే కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు ఈ బిఎస్-6 ప్రమాణాలను అమల్లోకి తెచ్చారు.
నిజానికి ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ వాడితే ఇంజన్ లోపల ఇంధన నష్టం జరగదు (పొగలో పెట్రోల్/డీజల్ వెళ్లిపోవడం). కాబట్టి బిఎస్-6 ప్రమాణాలను పాటించాలంటే దాదాపు అన్ని ఇంజన్లను రీడిజైన్ చేయడంతో పాటు అతి తక్కువ ఇంజన్ కెపాసిటీ ఉన్న బైకుల్లో ఫ్యూయల్ ఇంజెక్షన్(FI) అందివాల్సి వస్తోంది. దీంతోనే బిఎస్-6 మోడళ్ల ధరలు పెరుగుతున్నాయి.
Most Read: యమహా ఎన్మ్యాక్స్ 155 రివీల్.. ఇండియాలో విడుదల ఎప్పుడంటే?
టాటా లైనప్లో ఉన్న టియాగో హ్యాచ్బ్యాక్, టిగోర్ కాంపాక్ట్ సెడాన్, నెక్సాన్ కాంపాక్ట్ ఎస్యూవీ, హ్యారీయర్ 5-సీటర్ ఎస్యూవీ, హెక్సా 7-సీటర్ మోడళ్లు ఉన్నాయి. వీటికి కొనసాగింపుగా టాటా ఆల్ట్రోజ్ ప్రీమియం సెడాన్ మరియు టాటా గ్రావిటాస్ 7-సీటర్ ఎస్యూవీలు అతి త్వరలో మార్కెట్లో విడుదల కానున్నాయి.
Most Read: హోండా యాక్టివా కొంటున్నారా..? అదిరిపోయే ఆఫర్లు మీ కోసం...
ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు, టాటా కార్ల మీద 7 శాతం వరకు ధరలు పెరిగే అవకాశం ఉంది. టాటా మాత్రమే కాదు భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తమ అన్ని కార్ల మీద జనవరి 01, 2020 నుండి ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది.