భారతదేశంలో టాటా మోటార్స్ నిలిపివేసిన కార్ మోడల్లు ఏవేవో తెలుసా
టాటా మోటార్స్ భారత మార్కెట్లో సఫారి, జెస్ట్ మరియు బోల్ట్ మోడళ్లను నిలిపివేసింది. రష్లేన్ నుండి వచ్చిన నివేదికల ప్రకారం, తప్పనిసరిగా భద్రతా లక్షణాలు లేకుండా ఉన్న మూడు మోడళ్ల వేరియంట్ల ఉత్పత్తులను నిలిపివేయబడ్డాయి.

భద్రతా నిబంధనలకు అనుగుణంగా లేని సఫారి, జెస్ట్ మరియు బోల్ట్ మోడళ్ల యొక్క కొన్ని రకాల ఉత్పత్తిని టాటా మోటర్స్ నిలిపివేసినట్లు నివేదికలు సూచిస్తున్నాయి.

అయితే ఇప్పటివరకు ఉన్న స్టాక్లు అయిపోయే అంతవరకు ఈ వేరియంట్లను విక్రయించబడుతాయి అని తెలిపింది.

టాటా సఫారిలో నిలిపివేయబడిన వేరియంట్లు బేస్ LX మరియు టాప్ VX 4x4. అదేవిధంగా, టాటా బోల్ట్ మరియు జెస్ట్లలోని వేరియంట్లు XE మరియు XM (పెట్రోల్ మరియు డీజిల్) లను నిలిపివేసాయి.

మూడు మోడళ్లలో మిగిలిన వేరియంట్లు అమ్మకాలు కొనసాగుతాయి, ఎందుకంటే వాటిలో అన్నింటిని ఎయిర్బ్యాగ్స్ మరియు ABS తో ప్రభుత్వం చేత తప్పనిసరిగా చేసారు.

ఈ మిగిలిన వేరియంట్లలో భద్రతా నిబంధనలకు అనుగుణంగా రివర్స్ పార్కింగ్ సెన్సార్లను కలిపి ఒక చిన్న భద్రతా నవీకరణను కూడా చేసారు.

భారతీయ మార్కెట్లో మూడు మోడల్స్ అమ్మకాలు చాలా తక్కువగా డిమాండ్తో ఉన్నాయి అయినాకానీ , ఇండియన్ మార్కెట్లో విక్రయాలను చేయాలనీ టాటా మోటార్స్ నిర్ణయించింది.

రాబోయే ఎమిషన్ నిబంధనల వలన ముందుగానే డీజిల్ ఇంజిన్ల ఉత్పత్తిని నిలిపివేయవచ్చని టాటా మోటార్స్ నివేదించింది.

రాబోయే ఎమిషన్ మరియు క్రాష్ టెస్ట్ రెగ్యులేషన్ అమలుకు ముందు, టాటా మోటర్స్ లలో ఈ నిబంధలను ఎదుర్కొనే నమూనాలను ప్రకటించలేదు.

అయినప్పటికీ ఈ బ్రాండ్ దాని పాత మోడళ్లను నిలిపివేసే అవకాశం ఉంది, దాని శ్రేణిలో నూతన నమూనాలకు తీసుకురానుంది.టాటా జెస్ట్ మరియు బోల్ట్ మోడళ్లు ఏప్రిల్ 2020 వరకు గడువు కొనసాగుతాయి.

అయితే, అక్టోబరు 2019 నాటికి క్రాష్ పరీక్ష ఫలితాలు అనుకూలంగా వుంటుందని భావిస్తున్నారు,అంతేకాకుండా టాటా సఫారి రాబోయే క్రాష్ పరీక్ష నిబంధనలకు అనుగుణంగా ఉండకపోవచ్చు.


Click it and Unblock the Notifications








