Just In
- 13 hrs ago వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- 14 hrs ago వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- 15 hrs ago 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- 16 hrs ago 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
Don't Miss
- News ముగిసిన నామినేషన్ల పర్వం: బండి సంజయ్ సహా చివరి రోజు నామినేషన్లు వేసింది వీరే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Movies బాయ్ ఫ్రెండ్తో శృతి హాసన్ బ్రేకప్? ఆ విషయంలో సమంతను ఫాలో అయిన బ్యూటీ!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
విమానాల బుకింగ్స్ ఆపివేయాలని ఆదేశించిన డిజిసిఎ, ఎందుకో తెలుసా..?
భారతదేశంలో కరోనా వైరస్ ఎక్కువగా విస్తరిస్తున్న కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించబడింది. దేశం మొత్తం లాక్ డౌన్ లో ఉన్నప్పుడు వాహన సర్వీసులన్నీ రద్దు చేయబడ్డాయి. ఇందులో భాగంగానే విమాన సర్వీసులు కూడా రద్దు చేయబడ్డాయి. కానీ లాక్ డౌన్ రెండవదశ ప్రారంభానికి ముందే కొన్ని సర్వీసులు బుకింగ్స్ ప్రారంభించాయి. కానీ లాక్ డౌన్ రెండవ దశ కొనసాగుతున్న తరుణంలో ఆ బుకింగ్స్ కూడా ఆపివేయాలని డిజిసిఎ ప్రకటించింది.
విమానాల బుకింగ్ను వెంటనే ఆపాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) అన్ని విమానయాన సంస్థలను ఆదేశించింది. పౌర విమానయాన శాఖ మంత్రి "హర్దీప్ సింగ్ పూరి" ఆదేశాల మేరకు నోటిఫికేషన్ జారీ చేసిన డిజిసిఎ, మే 3 వరకు విమానాల టికెట్ బుకింగ్ నిలిపివేయాలని ప్రకటించింది.
పౌర విమానయాన శాఖ ఆదేశాన్ని ధిక్కరించి విమానయాన సంస్థలు ఆదివారం నుంచి బుకింగ్ ప్రారంభించాయి. ప్రయాణీకుల ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని పౌర విమానయాన విభాగం విమానయాన సంస్థల నుండి వివరణ కోరింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు 2020 మే 3 వరకు అన్ని బుకింగ్లను నిలిపివేసినట్లు పౌర విమానయాన మంత్రి తెలిపారు.
MOST READ: లాక్డౌన్ నిబంధనలను సడలించిన కేరళ ప్రభుత్వం, ఇక్కడ కొత్త రూల్స్ ఎలా ఉన్నాయంటే..?
లాక్ డౌన్ వల్ల రద్దు చేయబడిన టికెట్ డబ్బును తిరిగి చెల్లించకుండా, ఇండియన్ ఎయిర్లైన్స్ కంపెనీ తదుపరి విమానానికి క్రెడిట్ వోచర్లు జారీ చేసిందని వినియోగదారులు సోషల్ నెట్వర్క్ సైట్లలో ఫిర్యాదు చేశారు.
మార్చి 25 నుండి మే 3 వరకు టిక్కెట్లను బుక్ చేసుకోవాలని సివిల్ ఏవియేషన్ విభాగం వినియోగదారులకు సూచించింది. అయితే, పూర్తి మొత్తంలో డబ్బు తిరిగి ఇవ్వబడుతుందా లేదా అని పౌర విమానయాన శాఖ చెప్పలేదు.
MOST READ: ఎ-క్లాస్ లిమోసిన్ కార్ వివరాలను వెల్లడించిన మెర్సిడెస్ బెంజ్
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి మార్చి 25 నుండి ఏప్రిల్ 14 వరకు లాక్డౌన్ ప్రకటించారు. కానీ కరోనా రోజురోజుకి పెరుగుతున్న కారణంగా లాక్ డౌన్ యొక్క రెండవ దశ ప్రారంభమైంది. ఈ రెండవ దశ ను ఏప్రిల్ 15 నుండి మే 3 వరకు పొడిగించారు. ఈ కాలంలో అన్ని ప్రయాణీకుల విమాన సర్వీసులు రద్దు చేయబడ్డాయి.
బుకింగ్లను నిలిపివేసినందుకు తమకు సివిల్ ఏవియేషన్ విభాగం నుంచి నోటీసు రాలేదని విస్టారా, ఎయిర్ఏషియా ఇండియా తెలిపింది. స్పైస్ జెట్, ఇండిగో మరియు గోఎయిర్ ఇంకా బుకింగ్ గురించి ఇంకా ఎటువంటి సమాచారం తెలుపలేదు.
MOST READ:ఇండియాలో భారీగా తగ్గిపోయిన ఇంధన అమ్మకాలు, కారణం ఇదే