విమానాల బుకింగ్స్ ఆపివేయాలని ఆదేశించిన డిజిసిఎ, ఎందుకో తెలుసా..?

భారతదేశంలో కరోనా వైరస్ ఎక్కువగా విస్తరిస్తున్న కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించబడింది. దేశం మొత్తం లాక్ డౌన్ లో ఉన్నప్పుడు వాహన సర్వీసులన్నీ రద్దు చేయబడ్డాయి. ఇందులో భాగంగానే విమాన సర్వీసులు కూడా రద్దు చేయబడ్డాయి. కానీ లాక్ డౌన్ రెండవదశ ప్రారంభానికి ముందే కొన్ని సర్వీసులు బుకింగ్స్ ప్రారంభించాయి. కానీ లాక్ డౌన్ రెండవ దశ కొనసాగుతున్న తరుణంలో ఆ బుకింగ్స్ కూడా ఆపివేయాలని డిజిసిఎ ప్రకటించింది.

విమానాల బుకింగ్స్ ఆపివేయాలని ఆదేశించిన డిజిసిఎ, ఎందుకో తెలుసా..?

విమానాల బుకింగ్‌ను వెంటనే ఆపాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) అన్ని విమానయాన సంస్థలను ఆదేశించింది. పౌర విమానయాన శాఖ మంత్రి "హర్దీప్ సింగ్ పూరి" ఆదేశాల మేరకు నోటిఫికేషన్ జారీ చేసిన డిజిసిఎ, మే 3 వరకు విమానాల టికెట్ బుకింగ్ నిలిపివేయాలని ప్రకటించింది.

విమానాల బుకింగ్స్ ఆపివేయాలని ఆదేశించిన డిజిసిఎ, ఎందుకో తెలుసా..?

పౌర విమానయాన శాఖ ఆదేశాన్ని ధిక్కరించి విమానయాన సంస్థలు ఆదివారం నుంచి బుకింగ్ ప్రారంభించాయి. ప్రయాణీకుల ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని పౌర విమానయాన విభాగం విమానయాన సంస్థల నుండి వివరణ కోరింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు 2020 మే 3 వరకు అన్ని బుకింగ్‌లను నిలిపివేసినట్లు పౌర విమానయాన మంత్రి తెలిపారు.

విమానాల బుకింగ్స్ ఆపివేయాలని ఆదేశించిన డిజిసిఎ, ఎందుకో తెలుసా..?

లాక్ డౌన్ వల్ల రద్దు చేయబడిన టికెట్ డబ్బును తిరిగి చెల్లించకుండా, ఇండియన్ ఎయిర్లైన్స్ కంపెనీ తదుపరి విమానానికి క్రెడిట్ వోచర్లు జారీ చేసిందని వినియోగదారులు సోషల్ నెట్‌వర్క్ సైట్లలో ఫిర్యాదు చేశారు.

విమానాల బుకింగ్స్ ఆపివేయాలని ఆదేశించిన డిజిసిఎ, ఎందుకో తెలుసా..?

మార్చి 25 నుండి మే 3 వరకు టిక్కెట్లను బుక్ చేసుకోవాలని సివిల్ ఏవియేషన్ విభాగం వినియోగదారులకు సూచించింది. అయితే, పూర్తి మొత్తంలో డబ్బు తిరిగి ఇవ్వబడుతుందా లేదా అని పౌర విమానయాన శాఖ చెప్పలేదు.

విమానాల బుకింగ్స్ ఆపివేయాలని ఆదేశించిన డిజిసిఎ, ఎందుకో తెలుసా..?

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి మార్చి 25 నుండి ఏప్రిల్ 14 వరకు లాక్డౌన్ ప్రకటించారు. కానీ కరోనా రోజురోజుకి పెరుగుతున్న కారణంగా లాక్ డౌన్ యొక్క రెండవ దశ ప్రారంభమైంది. ఈ రెండవ దశ ను ఏప్రిల్ 15 నుండి మే 3 వరకు పొడిగించారు. ఈ కాలంలో అన్ని ప్రయాణీకుల విమాన సర్వీసులు రద్దు చేయబడ్డాయి.

విమానాల బుకింగ్స్ ఆపివేయాలని ఆదేశించిన డిజిసిఎ, ఎందుకో తెలుసా..?

బుకింగ్‌లను నిలిపివేసినందుకు తమకు సివిల్ ఏవియేషన్ విభాగం నుంచి నోటీసు రాలేదని విస్టారా, ఎయిర్‌ఏషియా ఇండియా తెలిపింది. స్పైస్ జెట్, ఇండిగో మరియు గోఎయిర్ ఇంకా బుకింగ్ గురించి ఇంకా ఎటువంటి సమాచారం తెలుపలేదు.

More from DriveSpark

Article Published On: Tuesday, April 21, 2020, 9:52 [IST]
English summary
Airlines cannot take bookings says DGCA details. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+