Just In
- 10 hrs ago ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- 11 hrs ago క్రాష్ టెస్ట్లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- 15 hrs ago వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- 16 hrs ago ఈ కార్లు కొనుగోలు చేసేవారికి శుభవార్త!.. మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్స్
Don't Miss
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Movies Krishna Bhagavan: రవితేజ, వైవీఎస్ చౌదరి అలా గోడ దూకి వచ్చేవాళ్లు.. నన్ను అలా అనుకొని!
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
బిఎస్ 4 వెహికల్ సేల్స్ ఎక్స్టెన్షన్ : జరుగుతుందా, లేదా.. ?
ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఫాడా) మరియు సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ తయారీదారులు (సియామ్) బిఎస్ 4 వాహనాల అమ్మకాలను పొడిగించాలని కోరుతూ భారత సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. బిఎస్ 4 వాహనాల అమ్మకాల గడువు ప్రస్తుతం మార్చి 31 కి ముగియనుంది. కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిన కరోనా వైరస్ వల్ల ఈ గడువును పొడిగించాలని ఆశిస్తున్నారు.
సాధారణంగా బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా వాహనాలు అప్డేట్ చేయడానికి నిర్దేశించిన గడువు 2020 ఏప్రిల్ 1. అంటే ఈ గడువు తరువాత బిఎస్ 4 వాహనాలను రిజిస్ట్రేషన్ చేయలేము. దీని కారణంగా ఆటో తయారీదారులు తగిన ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. అందువల్ల ముందుగానే బిఎస్-6 వాహనాలను ముందుగానే మార్కెట్లోకి ప్రవేశపెట్టారు.
కరోనా వైరస్ ప్రభావం వల్ల బిఎస్-4 వాహనాలను బిఎస్-6 వాహనాలుగా మార్చడం కష్టంతో కూడుకున్న పని. కానీ ఈ వైరస్ ప్రభావం వల్ల బిఎస్-4 వాహనాలను తొందరగా విక్రయించలేకపోతున్నారు. ఈ కారణంగా డీలర్లు ఆందోళన చెందుతున్నారు.
దీనికి ప్రతిస్పందనగా మార్చి 31 వరకు కాకుండా ఇంకా కొంత ఈకువ సమయాన్ని, బిఎస్ 4 వాహనాల అమ్మకాలు మరియు రిజిస్ట్రేషన్ కొనసాగించడానికి అనుమతి కోరుతూ సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ తయారీదారులు (సియామ్) పిటిషన్ దాఖలు చేశారు. బిఎస్ 4 నమోదు కోసం కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు దరఖాస్తులను నిరాకరిస్తున్నాయని పిటిషన్లో పేర్కొంది.
ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (ఫాడా) నుండి వచ్చిన పిటిషన్ ప్రకారం బిఎస్ 4 గడువును మే 31 వరకు పొడిగించాలని విజ్ఞప్తి చేస్తుంది. ఆటోమోటివ్ మందగించడం మరియు ఇటీవల కొరోనావైరస్ వ్యాప్తి చెందడం వల్ల డీలర్లు తక్కువ అమ్మకాలను మాత్రమే చేపడుతున్నారు.
ప్రస్తుత పరిస్థితిలో కరోనా వైరస్ అకస్మాత్తుగా వ్యాపించడం వల్ల దేశంలో ఆటో పరిశ్రమకు కొంత తీవ్ర ఇబ్బంది కలిగించింది. ఇది ఆటో పరిశ్రమ బిఎస్ 6 కు మారడాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి ఆపరేషన్లను నిలిపివేయాలని భారత ప్రభుత్వం ఆటో షోరూమ్లు, తయారీ కర్మాగారాలను కోరింది.
ప్రస్తుత అమ్మకాలను గమనించినట్లయితే చాల తగ్గుదల కనిపిస్తుంది. ఈ వాహనాలను విక్రయించడానికి ఇంకా కొంత సమయం కావలసి వస్తున్నది. ఈ కారణంగా కొత్త వాహనాల కోసం వేచి ఉండాల్సిన సమయం ఇంకా కొంత ఎక్కువగా ఉండే అవకాశం కూడా ఉంది.
ప్రస్తుతం ఆటో మొబైల్ కి సంబంధించిన వార్తల ప్రకారం వోక్స్ వ్యాగన్ గ్రూప్ తన యూరోపియన్ కార్యకలాపాలను తదుపరి నోటీసు విడుదలయ్యే వరకు నిలిపివేసింది. జర్మనీ, స్పెయిన్, పోర్చుగల్ మరియు స్లోవేకియాలో ఉత్పత్తి సౌకర్యాలు ఈ వారం నిలిపివేయబడతాయి.
డ్రైవ్స్పార్క్ తెలుగు అభిప్రాయం.. !
ప్రపంచవ్యాప్తంగా విజృంభించిన కరోనా వైరస్ కేవలం ప్రజలను మాత్రమే కాకుండా వ్యాపారాలను కూడా ప్రభావితం చేసింది. ఈ కారణంగా వాహనాలు ఎక్కువగా అమ్ముడు కాలేదు కాబట్టి ఇంకా కొంత గడువును పొడిగించాలని డీలర్లు కోరారు. ఏది ఏమైనా భారతదేశంలో బిఎస్ 4 వాహనాల రిజిస్ట్రేషన్ గడువు కేవలం రెండు వరాలు మాత్రమే ఉంది. కానీ ఈ గడువును ఇంకొంత వరకు పెంచాలని ఆటో మొబైల్ సంస్థల వారు పిటీషన్లు దాఖలు చేసారు. ఈ పిటిషన్ ప్రభుత్వం అంగీకరిస్తుందా లేదా అని ఎదురు చూడాలి.