Just In
- 12 hrs ago వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- 15 hrs ago ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- 17 hrs ago కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- 20 hrs ago 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
Don't Miss
- Sports ఆ రూల్ మా కొంపముంచింది- రుతురాజ్
- News మే 1 నుంచి ఈ రాశులకు అఖండ ధనయోగం
- Movies Guppedantha Manasu April 20th: మహేంద్ర, అనుపమల కొడుకే మను.. దత్తత కన్ఫార్మ్.. జరక్కపోతే సూసైడే!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
టయోటా నుంచి బుకింగ్ కి సిద్దమవుతున్న మరో రెండు కార్లు!
ఇండియాలో ఎక్కువగా కార్లు అమ్ముడవుతున్న సంస్థలలో ఒకటి టయోటా. ఇప్పుడు టయోటా ఇన్నోవా క్రిస్టా బిఎస్ 6 మరియు టయోటా ఫార్చ్యూనర్ బిఎస్ 6 మోడల్స్ జనవరి 6 నుండి బుకింగ్ కోసం అధికారికంగా తెరవబడతాయని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. కానీ అవి ఈ నెల రెండవ వారంలో వచ్చే అవకాశం ఉంది. అయితే డీలర్లు మాత్రం ఇప్పుడే అనధికారికంగా రూ.50 వేల బుకింగ్లను అంగీకరిస్తున్నారు.
టయోటాలో అనధికారిక బుకింగ్లు ప్రారంభమైనట్లు పూణేకు చెందిన డీలర్ ధృవీకరించారు. దేశవ్యాప్తంగా బిఎస్ 6 కి కంప్లైంట్ ఫ్యూయల్ లభించే వరకు టయోటా వేచి ఉండాలని కంపెనీ కోరుకుంటున్నందున ఫిబ్రవరి చివరి లేదా మార్చి ఆరంభానికి డెలివరీలు ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది. కాబట్టి వినియోగదారులు అప్పటిదాకా వేచి చూడాల్సిందే.
డీలర్లు తమ బిఎస్ 4 యొక్క స్టాక్లన్నింటినీ అయిపోయాయని, మరియు ఫార్చ్యూనర్ మరియు ఇన్నోవా మోడళ్లు ఇప్పుడు అత్యధికంగా అమ్ముడయ్యే వాహనాలు అని అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు యారిస్ బిఎస్ 6 మోడల్ కోసం కూడా డీలర్లు అధికారికంగా బుకింగ్లను అంగీకరిస్తున్నారు.
ఇన్నోవా క్రిస్టా మరియు ఫార్చ్యూనర్ భారత మార్కెట్లో టయోటా యొక్క అత్యధికంగా అమ్ముడైన మోడల్స్. వీటి ధర కొంత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ వాహనాలలో మరింత అధునాతన సెలెక్టివ్ కాటలిటిక్ రిడక్షన్ టెక్నాలజీ మరియు కొత్త డీజిల్ పార్టిక్యులేట్ ఫిల్టర్ కారణంగా ధరలు సుమారు రూ.1.5 లక్షలు పెరగనున్నాయి.
ఇన్నోవా క్రిస్టా మరియు ఫార్చ్యూనర్ సంస్థ యొక్క భారతీయ పోర్ట్ఫోలియోలో స్థానికంగా తయారు చేయబడిన డీజిల్ వాహనాలు. ఇవి ఏప్రిల్ 2020 నుండి మార్కెట్లోకి రాబోతున్నాయి. ఇప్పుడు సంస్థ యొక్క ఎటియోస్ శ్రేణి కార్లు దశలవారీగా తొలగించబడుతున్నాయి. ఇప్పుడు మనకు యారిస్ మరియు గ్లాంజా మోడళ్లు పెట్రోల్ ఇంజన్లతో మాత్రమే లభిస్తాయి.
టయోటా సంబంధిత వార్తల ప్రకారం సంస్థ యొక్క అత్యధికంగా అమ్ముడైన కారు టయోటా గ్లాంజా అని చెప్పవచ్చు. 2019 జూన్ మరియు మధ్య కంపెనీ మొత్తం 13,824 యూనిట్లను విక్రయించిందని తెలుస్తుంది. ఈ వాహనం కంప్లైంట్ 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్తో లభిస్తుంది.
టయోటా ఇన్నోవా మరియు ఫార్చ్యూనర్ కోసం ప్రారంభమయ్యే అధికారిక మరియు అనధికారిక బుకింగ్ల గురించి ఆలోచనలు:
టయోటా ఇన్నోవా మరియు టయోటా ఫార్చ్యూనర్ రెండూ కూడా మార్కెట్లో విజయవంతమయ్యాయి. నగరాల్లో మరియు హైవే రోడ్లపై నడపడానికి ఇన్నోవా మరియు ఫార్చ్యూనర్ రెండు కూడా చాలా అనుగుణంగా ఉంటాయి. కాబట్టి ఇవి మార్కెట్లో చాలా తొందరగా అమ్ముడవుతున్నాయి.
Read More:ఈ వోక్స్వ్యాగన్ బీటిల్ నిజానికి మారుతి స్విఫ్ట్.... మీరే చూడండి?
ఈ విధంగా ఎక్కువగా అమ్ముడవుతున్న రెండు ఎస్యూవీల కోసం అనధికారిక బుకింగ్లను త్వరలో తెరవడం జరుగుతుంది. బుకింగ్ వాల్యూ అనేది ఎప్పటిలాగే ఉంటాయని డీలర్లు ఖచ్చితంగా చెప్పలేరు. కానీ వీటి బుకింగ్ వాల్యూ అధికారికంగా బుకింగ్ ప్రారంభించిన తర్వాతా వెల్లడించే అవకాశం ఉంది. ఏది ఏమైనా వీటికోసం వినియోగదారు ఇంకొంత సమయం ఎదురు చూడాల్సిందే!
Read More:ఇండియాలో ప్రారంభించబోయే బెనెల్లి 302 ఎస్, టిఎన్టి 300 ని భర్తీ చేయనుందా....?