Just In
- 4 hrs ago ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- 6 hrs ago క్రాష్ టెస్ట్లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- 9 hrs ago వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- 10 hrs ago ఈ కార్లు కొనుగోలు చేసేవారికి శుభవార్త!.. మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్స్
Don't Miss
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- News బాలకృష్ణకు షాక్: హిందూపురంలో నామినేషన్ వేసిన స్వామి పరిపూర్ణానంద
- Sports CSK vs LSG: శతక్కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. చితక్కొట్టిన శివమ్ దూబే!
- Movies Krishna Bhagavan: రవితేజ, వైవీఎస్ చౌదరి అలా గోడ దూకి వచ్చేవాళ్లు.. నన్ను అలా అనుకొని!
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
కరోనా వైరస్ కాదు, కరోనా కారు చూసారా.. !
చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఈ మహమ్మారి ప్రపంచదేశాలన్నిటిలోనూ విస్తరించి ప్రజలను ముప్పుతిప్పలు పెడుతోంది. భారతదేశంలో కూడా ఈ వైరస్ వ్యాప్తి చాలా ఎక్కవగా ఉంది. ఈ కారణంగా భారత ప్రభుత్వం 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించింది. భారతదేశంలో కరోనా నివారణకు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నప్పటికీ దీనిని పూర్తిగా నివారించలేకపోతున్నారు.
కరోనా వైరస్ పై అవగాహనా కల్పించడానికి తమిళ నాడు, కర్ణాటక వంటి రాష్ట్రాలలో వినూత్నమైన కార్యక్రమాలు కూడా చేపట్టారు. ఇప్పుడు తెలంగాణలో మరో వినూత్నమైన చర్య చేపట్టారు. కరోనా అవగాహన కోసం తెలంగాణాలో జరిగిన సంఘటనను గురించి పూర్తిగా తెలుసుకుందాం..!
భారతదేశంలో రోజు రోజుకి మరింత ఎక్కువగా విస్తరిస్తున్న కరోనా మహమ్మారి గురించి అవగాహన కల్పించడం కోసం బహదూర్పురలోని సుధా కార్స్ మ్యూజియంకు చెందిన కన్యాబొయినా సుధాకర్ ఒక ‘కరోనా కారు' రూపొందించారు. "కోవిడ్ -19 యొక్క వ్యాప్తిపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని ఈ కారుని తరాలు చేసారు.
ఈ కారు కరోనా వైరస్ ఆకారాన్ని పోలి ఉంటుంది. ఇది ప్రజలకు సామాజిక దూరం గురించి అవగాహన పెంచుకునేలా ప్రజాదరణ పొందింది అని సుధాకర్ చెప్పారు.
MOST READ: బిఎస్ 6 ఎక్స్ప్లస్ 200 బైక్ స్పెసిఫికేషన్స్ విడుదల చేసిన హీరో మోటోకార్ప్
చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ ఈ కరోనా కారును బుధవారం ఆవిష్కరించనున్నారు. పోలీసులతో సహా ప్రభుత్వ సంస్థలు ఆసక్తి చూపిస్తే, కారును ఉపయోగించాలని తాను కోరుకుంటున్నాను, తద్వారా సందేశం ప్రజలకు తెలియజేయబడుతుందని తెలిపాడు.
ఈ కరోనా కారును 100 సిసి ఇంజిన్తో రూపొందించారు. ఇది సిక్స్ వీలర్, ఇది ఒకే సీటు, ఫైబర్ బాడీని కలిగి ఉంది. ఇది గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. నేను దీన్ని తయారు చేయడానికి 10 రోజులు పట్టింది అని సుధాకర్ చెప్పారు.
MOST READ: మ్యాక్సీ స్కూటర్ను ఆవిష్కరించిన హోండా
సుధాకర్ ఇప్పటివరకు తయారు చేసిన అనేక సారూప్య మోడళ్లను సుధా కార్స్ మ్యూజియంలో ప్రదర్శించారు. ఈ కార్లలో హ్యాండ్బ్యాగ్ కార్, షూ కార్, హెల్మెట్ కార్, కెమెరా కార్, టాయిలెట్ కార్, కండోమ్ కార్, బర్గర్ కార్ మరియు అనేక ఇతర మోడళ్లు ఉన్నాయి. అతను అనేక సైకిళ్లతో పాటు ప్రపంచంలోని అతి చిన్న డబుల్ డెక్కర్ను కూడా రూపొందించాడు.
విభిన్న కారణాల కోసం వేర్వేరు సందర్భాల్లో సొంత మార్గంలో సమాజానికి ఒక అవగాహన కల్పించడానికి నేను కార్లను తయారు చేసానని చెప్పారు. కరోనా మరింత వేగంగా వ్యాపిస్తున్న ఈ సమయంలో, ఇంటి వద్దే ఉండి సురక్షితంగా ఉండమని ప్రజలకు చెప్పడం చాలా ముఖ్యం మరియు కరోనావైరస్ కారుతో ఒక సందేశాన్ని అందించడానికి కూడా చాలా అనుకూలంగా ఉంటుందని కూడా ఆయన చెప్పారు.