Just In
- 27 min ago క్రాష్ టెస్ట్లో హోండా అమేజ్కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- 14 hrs ago ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- 15 hrs ago క్రాష్ టెస్ట్లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- 18 hrs ago వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
Don't Miss
- News ఎన్నికల ప్రచారానికి నేటితో తెర: ఈ రాష్ట్రాల్లో ఎల్లుండి పోలింగ్
- Sports ఆ రూల్ వల్లే గెలిచాం- KL రాహుల్
- Movies కట్టె పుల్లకు చీరకట్టినా.. మగాళ్ల ప్రవర్తనపై బిగ్బాస్ బ్యూటీ హిమజ హాట్ కామెంట్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
బిఎస్ 4 వాహన అమ్మకాలకు శాపంగా మారిన కరోనా వైరస్
నేడు ప్రపంచదేశాలను వణికిస్తున్న భయంకరమైన వైరస్ కరోనా. ఈ భయానకమైన వైరస్ ఇప్పుడు ప్రపంచంలో అన్ని దేశాలలో వ్యాప్తి చెందుతోంది. ఈ వైరస్ ప్రభావం వల్ల ఇటలీ వంటి దేశాలలో మృత్యువు విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్ నుండి ప్రజలను కాపాడటానికి కేంద్ర ప్రభుత్వాలు చాలా కఠినమైన చర్యలు తీసుకుంటున్నాయి.
కరోనా ప్రభావం వల్ల చాలా మంది ప్రజలు చనిపోవడం జరిగింది. ఈ ప్రభావం కేవలం ప్రజల మీద మాత్రమే కాదు, ఆటో మొబైల్ పరిశ్రమలపై కూడా పడింది. ఈ కరోనా వైరస్ నివారించడానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ దేశ వ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్ డౌన్ చేయడం జరిగింది.
భారతదేశంలో చాల ఆటో పరిశ్రమలు తమ ఉత్పత్తులను నిలిపివేశాయి. ఇప్పటికే మారుతి సుజుకి, మహీంద్రా, టాటా మోటార్స్, కియా మోటార్స్, బజాజ్ ఆటో, హీరో మోటోకార్ప్ వంటి బ్రాండ్లు నిరవధికంగా మూసివేసాయి.
ఈ కరోనా వైరస్ వల్ల ఇప్పుడు ఆటో పరిశ్రమకు వచ్చిన ప్రధాన సమస్య బిఎస్ 4 వాహనాల అమ్మకం. సాధారణంగా భారత ప్రభుత్వం అన్ని కంపెనీల వాహనాలను బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా తయారు చేయడానికి మార్చి 31 గడువు నిర్ణయించింది.
కానీ కరోనా వైరస్ ప్రభావం వల్ల సంస్థలన్నీ మూతపడ్డాయి. ఈ కారణంగా ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ నుండి వచ్చిన నివేదికల ప్రకారం దాదాపు 6,400 కోట్ల రూపాయల విలువైన బిఎస్ 4 వాహనాలు ఇప్పటికి అమ్ముడుపోలేదు. దీనికి ప్రధాన కారణం కరోనా వైరస్.
బిఎస్ 6 అమలు గడువును 31 మే 2020 వరకు పొడిగించాలని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (ఫాడా) సుప్రీంకోర్టును కోరినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. సుప్రీంకోర్టు ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.
కరోనావైరస్ వ్యాప్తి ప్రపంచవ్యాప్తంగా ఆటోమోటివ్ బ్రాండ్లను చాలా ప్రభావితం చేసింది. భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ప్రధాన కార్ బ్రాండ్ కార్యకలాపాలను నిలిపివేసింది. చాలా మంది తయారీదారులు వైద్య సిబ్బందికి మరియు వైద్యులకు సహాయాన్ని అందించే మార్గాల్లో పనిచేస్తున్నట్లు తెలిపారు.
మహీంద్రా, రెనాల్ట్ వంటి సంస్థలు ఆరోగ్య అధికారులకు మద్దతుగా వెంటిలేటర్లు మరియు ఇతర వైద్య పరికరాలను తయారు చేసే మార్గాలపై పరిశోధనలు చేస్తున్నట్లు చెబుతున్నారు.
కోవిడ్ -19 అధికంగా వ్యాప్తి చెందటం వల్ల అమ్మకాలు మందగించాయి. ఈ సమయంలో కొత్త వాహనాల కొనుగోలు కోసం చాలా మంది కస్టమర్లు తమ ప్రణాళికలను వాయిదా వేస్తున్నారు. ఆటోమోటివ్ బ్రాండ్లు ఏప్రిల్ గడువుకు ముందే బిఎస్ 4 మోడళ్లపై భారీ తగ్గింపులు మరియు ఆఫర్లను అందిస్తున్నాయి.
డ్రైవ్స్పార్క్ తెలుగు అభిప్రాయం.. !
భారతదేశంలో కరోనా వ్యాప్తి ఆటో పరిశ్రమ పట్ల శాపంగా మారింది. ఈ కారణంగా కస్టమర్లు కొత్త వాహనాలను కొనుగోలు చేయలేకపోతున్నారు. కాబట్టి తక్కువ వాహనాల అమ్మకం కారణంగా ఆటోమొబైల్ బ్రాండ్లపై పెద్ద ఆర్థిక భారం పడింది. ఏది ఏమైనా బిఎస్ 4 వాహనాల యొక్క అమ్మకాలకు కరోనా పెద్ద శాపంగా మారింది అని చెప్పవచ్చు.