Just In
- 1 hr ago సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- 4 hrs ago 'కావ్య మారన్' ఖరీదైన కార్లు ఇవే! ఇక్కడ చూడండి
- 4 hrs ago ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఈ పొరపాట్లు చేశారో.. ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- 5 hrs ago బిలినీయర్ మనసుదోచిన ఆటో ఇదే!.. ధర తెలిస్తే మీరు కొనేస్తారు
Don't Miss
- News ఉరేయాలన్న బొత్స తండ్రి సమానుడా ? వైఎస్ నూ వదల్లేదుగా- జగన్ కు షర్మిల కౌంటర్..!
- Sports ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను- కమిన్స్ Video
- Travel ఐఆర్సిటీసి వారి హైదరాబాద్ టు అహ్మదాబాద్ 8 రోజుల ట్రైన్ టూర్ ప్యాకేజీ...
- Finance Gold Bonds: గోల్డ్ బాండ్స్ ప్రీమెచూర్ ధర ప్రకటించిన ఆర్బీఐ.. పూర్తి వివరాలివే..
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
- Movies నాతో ఆ పని చేస్తావా? ఒక రాత్రికి ఎంత తీసుకుంటావ్.. జబర్ధస్త్ బ్యూటీ ఏమన్నదో చూశారంటే!
లాక్డౌన్ ఎఫెక్ట్ : ఎక్కడికక్కడ నిలిచిపోయిన ట్రక్కులవల్ల ఎంత నష్టమో తెలుసా.. ?
భారతదేశంలో కరోనా వైరస్ రోజు రోజుకి ఎక్కువగా విస్తరిస్తోంది. ఈ వైరస్ వ్యాప్తిని తగ్గించడానికి భారత ప్రభుత్వం 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించింది. ఈ ప్రకటన వల్ల దేశ వ్యాప్తంగా వాహన సేవలన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈ క్రమంలో ట్రక్కులు మరియు సరకులు రవాణా చేసే వాహనాలు కూడా రాష్ట్ర సరిహద్దులోని నిలిచిపోవలసి వచ్చింది.
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ చేయడం వల్ల మొత్తం 21 రోజుల పాటు అన్ని రాష్ట్ర సరిహద్దులు మూసివేయబడ్డాయి. ట్రక్కు డ్రైవర్లు మరియు వస్తువుల రవాణా వాహనాలకు లాక్ డౌన్ పెద్ద సమస్యగా మారింది. కాబట్టి ఈ వాహనాలన్నీ రహదారులపైనే చిక్కుకుపోయాయి.
ఆటో నివేదిక ప్రకారం సుమారు 3.5 లక్షల వస్తువులు మోసుకెళ్ళే ఇంటర్-స్టేట్ ట్రక్కులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈ ట్రక్కులు తీసుకెళ్లే వస్తువులలో కార్లు, బైక్లు, రిఫ్రిజిరేటర్లు, ఎసిలు మరియు ఇతర ఎలక్ట్రికల్ వస్తువులు ఉన్నాయి. అంతే కాకుండా ఇతర పాడైపోయే వస్తువులయిన ఆహారం, పౌల్ట్రీ వస్తువులు కూడా ఇందులో ఉన్నాయి. ఈ ట్రక్కులు తీసుకెళ్లే వస్తువుల ధర దాదాపు రూ. 35,000 కోట్లకు పైగా ఉంటాయి.
MOST READ: ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్గా నవీన్ పట్నాయక్ నిర్ణయం, అదేంటో తెలుసా.. ?
ఈ లాక్ డౌన్ కారణంగా ఇంత మొత్తంలో సరుకు రవాణా నిలిచిపోవడమే కాకుండా డ్రైవర్లు కూడా తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. డ్రైవర్లకు ఆహారం, నీరు వంటి కనీస సౌకర్యాలు కూడా లేకుండా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అంతే కాకుండా ట్రక్ డ్రైవర్లు తమ ట్రక్కుల్లోని పాడైపోయే వస్తువుల గురించి కూడా ఆందోళన చెందుతున్నారు.
ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ప్రెసిడెంట్ "కుల్తారన్ సింగ్ అట్వాల్" మాట్లాడుతూ ట్రక్కర్లు మరియు వేలాది కోట్ల విలువైన వస్తువులు రోడ్లపైనే ఉండిపోవడం చాలా బాధాకరమైన విషయం అన్నారు. ఈ విధంగా ఇబ్బందులు పడుతున్న వారికి సహాయం చేయడానికి వెంటనే ఏదో ఒకటి చేయాలి. ఆహారం, మెడిసిన్స్ మరియు ఇతర నిత్యావసర వస్తువులను తీసుకెళ్లే ట్రక్కుల ప్రయాణానికి అనుమతి ఇవ్వాలని అట్వాల్ పేర్కొన్నారు.
MOST READ: కారు కొనడానికి ముందు ఏం చేయాలో తెలుసా.. !
ఇప్పటికే చాలా ట్రక్కులు చెక్పోస్టుల వద్ద చిక్కుకుపోయాయి. చాలా మంది డ్రైవర్లు తమ ట్రక్కులను వదిలి ఇంటికి తిరిగి వెళ్లారని నివేదికలు సూచిస్తున్నాయి.
ట్రక్కర్లు ఇప్పుడు బెయిలౌట్ ప్యాకేజీలు మరియు ఇతర రకాల మద్దతును ప్రభుత్వం నుండి కోరుతున్నారు. రహదారి మరియు వస్తువుల పన్ను చెల్లింపులకు ఆరు నెలల టైమ్ తో పాటు, ఆరు నెలల EMI విరామం మరియు అదే సమయంలో జాతీయ అనుమతుల పొడిగింపును కూడా వారు కోరుతున్నారు.
MOST READ: ఏడు రోజులుగా కారులోనే నిద్రించిన డాక్టర్, ఎందుకో తెలుసా.. ?
డ్రైవ్స్పార్క్ తెలుగు అభిప్రాయం.. !
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ వ్యవధి పొడిగించబడుతుందని చెప్పడంతో, ప్రాథమిక అవసరాలు కూడా లేకుండా, రాష్ట్ర సరిహద్దుల వద్ద చిక్కుకున్న ట్రక్ డ్రైవర్ల దుస్థితి చాలా కష్టంగా మారింది. వీరి దుస్థితిని ప్రభుత్వం పరిశీలిస్తుందని, సహాయక చర్యలు కూడా త్వరలో ప్రకటించాలని ఆశిస్తున్నారు.