Just In
- 1 hr ago వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- 2 hrs ago ఈ కార్లు కొనుగోలు చేసేవారికి శుభవార్త!.. మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్స్
- 3 hrs ago మండే వేసవిలో ట్రాఫిక్ పోలీసులకు చల్లచల్లని ఏసీ హెల్మెట్లు.. ఎక్కడో తెలుసా.??
- 5 hrs ago ఎన్నో అంచనాల మధ్య లాంచ్ అయిన క్లచ్లెస్ బైక్ TVS Jive.. ఎందుకు ఫెయిల్ అయింది.??
Don't Miss
- News ఎన్నికల ముందు గుడ్ న్యూస్..ఫుల్ జోష్లో వైసీపీ
- Finance Banking News: ప్రభుత్వ బ్యాంకులకు ఆ అధికారం లేదు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు..
- Sports IPL: నైట్ అంతా సిట్టింగ్ వేస్తే ఎలా గెలుస్తారు?- రైనా
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
- Movies Mahi Shivan: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సీరియల్ నటి మహేశ్వరి.. ఎవరు పుట్టారో తెలుసా?
ట్రక్కులలో స్లీపింగ్ బెర్త్ లు పెట్టించాలంటున్న సిపిఐ ఎంపి బినాయ్ విశ్వం, ఎందుకంటే.. ?
భారతదేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. సంవత్సరానికి దాదాపు కొన్ని వేల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటికి పూర్తికా అరికట్టడానికి వీలు లేకపోయినా కొంత వరకు అయినా నివారించడానికి ప్రభుత్వం తనవంతు కృషి చేయాలని సిపిఐ ఎంపి బినాయ్ విశ్వం, కేంద్ర రహదారి రవాణా మంత్రి నితిన్ గడ్కరీని కోరారు.
సాధారణంగా వాహనదారులు ప్రయాణించేటప్పుడు ప్రమాదాలు అనుకోకుండా జరుగుతూ ఉంటాయి. ఇటీవల కాలంలో తమిళనాడు తిరుపూర్లో జరిగిన రోడ్డు ప్రమాదం నేపథ్యంలో బెంగళూరు, ఎర్నాకుళం నుంచి ప్రయాణిస్తున్న బస్సు రవాణా ట్రక్కును ఢీ కొట్టడంతో 19 మంది ప్రయాణికులు మరణించారన్న విషయం అందరికి తెలిసిందే.
భారతదేశంలో సుదూర ప్రాంతాలకు రవాణా చేయడానికి ట్రక్కులను ఉపయోగిస్తారు. ట్రక్కులు చాలా దూరం ప్రయాణిస్తాయి. కాబట్టి ట్రక్కులకు ఒకే డ్రైవర్ ఉండటం వల్ల కొన్ని అనియంత్రిత కారణాల వల్ల ప్రమాదం జరుగుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని సిపిఐ ఎంపి బినాయ్ విశ్వం ఈ విధంగా చెప్పారు.
సుదూర ప్రాంతాలకు ప్రయాణించే ట్రక్కులలో కనీసం ఇద్దరు డ్రైవర్లు ఉండేట్లు చూడాలి. అంటే కాకుండా డ్రైవర్లకు నిద్రపోవడానికి ట్రక్కులలో తప్పని సరిగా సదుపాయం కల్పించాలి. దానికి తగిని ఏర్పాట్లు కూడా ట్రక్కులలో కల్పించాలి అన్నారు.
పాలక్కాడ్ ఆర్టీఓ నివేదిక ప్రకారం విశ్వం గడ్కరీకి రాసిన లేఖలో, లారీ డ్రైవర్ వల్ల ఈ ప్రమాదం జరిగిందని, అతను డ్రైవింగ్ చేస్తున్నప్పుడు నిద్రలోకి జారుకున్నందున ప్రమాదం జరిగిందని స్పష్టం చేసారు.
మోటార్ వాహన చట్టం నిబంధనల ప్రకారం కేంద్ర ప్రభుత్వం 2018 సవరణకు ముందు, ఇలాంటి ప్రమాదాలను నివారించడానికి రవాణా వాహనాలకు కనీసం ఇద్దరు డ్రైవర్లు అవసరం అవుతుందని నిర్దారించారు. కానీ తరువాత కాలంలో దూర ప్రయాణాలకు కూడా ఒక్క డ్రైవర్ మాత్రమే చేపట్టాలని నిర్ణయించారు. ఈ విధంగా చేయడం వల్ల ఒక డ్రైవర్ బాగా అలసిపోయినప్పుడు ప్రమాదాలు ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంటుంది.
మోటార్ వాహన చట్టంలో సరైన మార్పులు చెయాలేకపోతే అమాయక ప్రజలు ఎందరో ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని బినాయ్ విశ్వం తెలియజేసారు. రవాణా చట్టాలను కఠినంగా అమలు చేయడం వల్ల భవిష్యత్తులో ఇటువంటి విషాదాల అవకాశాలు తగ్గుతాయి" అని ఆయన చెప్పారు. తప్పని సరిగా ట్రక్కులలో నిద్రపోవడానికి అవసరమైన సదుపాయాలు కూడా కల్పించాలని కేంద్ర రవాణా మంత్రిని కోరారు.