ఢిల్లీలో వెహికల్స్ రూట్ మార్చిన పోలీసులు.. ఎందుకో తెలుసా ?

భారత కొన్నిరోజులుగా రైతుల ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ ఢిల్లీ మరియు నోయిడా సరిహద్దుల వద్ద వరుసగా 10 రోజులుగా రైతులు నేషనల్ హైవే రోడ్ నెంబర్ 44 ను పూర్తిగా నిరోధించారు. ఈ రోడ్ పూర్తిగా నిరోధించడం వల్ల ట్రాఫిక్ జామ్ చాలా తీవ్రంగా ఉంది. ఈ కారణంగా సాధారణ వాహనాల కదలికలు పూర్తిగా నిలిపివేయబడ్డాయి.

ఢిల్లీలో వెహికల్స్ రూట్ మార్చిన పోలీసులు.. ఎందుకో తెలుసా ?

కొన్ని వాహనాలు అవి ఉన్న చోట ఉండిపోయే పరిస్థితి నెలకొంది. అధిక ట్రాఫిక్ కారణంగా జాతీయ రహదారి 44 తో ఢిల్లీ కనెక్టివిటీ హర్యానా మరియు ఉత్తర ప్రదేశ్ నుండి వాహనాల రాక పూర్తిగా నిలిపివేయబడింది.

ఢిల్లీలో వెహికల్స్ రూట్ మార్చిన పోలీసులు.. ఎందుకో తెలుసా ?

ప్రయాణికులకు సమాచారం ఇవ్వడానికి ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ట్విట్టర్‌ను ఆశ్రయిస్తున్నారు. సింధు, లాంపూర్, ఆచండి, సఫియాబాద్, పియావో మణియారి, సబోలి నుండి సరిహద్దులను మూసివేసినట్లు ఢిల్లీ పోలీసులు శనివారం ట్వీట్ చేశారు. జాతీయ రహదారి 44 ను రెండు వైపుల నుండి మూసివేసినట్లు పోలీసులు తెలిపారు.

ఢిల్లీలో వెహికల్స్ రూట్ మార్చిన పోలీసులు.. ఎందుకో తెలుసా ?

అయితే ఢిల్లీకి వచ్చే ప్రయాణికులను ప్రత్యామ్నాయ మార్గాల్లో తీసుకెళ్లాలని పోలీసులు ఆదేశించారు.ఢిల్లీ నుండి భోప్రా, అప్సర బోర్డర్, నేషనల్ హైవే 8 నుండి పెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్ వే వెళ్లే మార్గాలు తెరిచి ఉన్నాయని పోలీసులు ట్వీట్ చేశారు. ముకర్బా, జిటికె రోడ్ నుండి ట్రాఫిక్ మళ్లించినట్లు పోలీసులు తెలిపారు.

ఢిల్లీలో వెహికల్స్ రూట్ మార్చిన పోలీసులు.. ఎందుకో తెలుసా ?

ముకర్బా, జిటికె, ఔటర్ రింగ్ రోడ్, ఎన్‌హెచ్ 44 లలో ప్రయాణికులు ప్రయాణించడాన్ని పోలీసులు నిషేధించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, తిక్రీ మరియు జరోడా సరిహద్దు ట్రాఫిక్‌కు మూసివేయబడింది.అయితే బదుసరై సరిహద్దులో కార్లు మరియు ద్విచక్ర వాహనాలు వంటి తేలికపాటి మోటారు వాహనాలకు మాత్రమే రహదారి ఓపెన్ లో ఉంది.

ఢిల్లీలో వెహికల్స్ రూట్ మార్చిన పోలీసులు.. ఎందుకో తెలుసా ?

ఏదేమైనా, హర్యానా వైపు వెళ్లవలసిన అవసరం ఉంటే, వారు ధన్సా, దౌరాలా, కపషేరా, రాజోఖారి జాతీయ రహదారి-8, బిజ్వాసన్ / బజ్గేరా, పాలమ్ విహార్ మరియు దుండహేరా సరిహద్దు గుండా మాత్రమే వెళ్ళవచ్చు.

ఢిల్లీలో వెహికల్స్ రూట్ మార్చిన పోలీసులు.. ఎందుకో తెలుసా ?

చిల్లా బోర్డర్ సమీపంలోని నోయిడా లింక్ రోడ్‌లో కూడా వాహనాల కదలిక ఆగిపోయింది. గౌతమ్ బుద్ధ నగర్ గేటు దగ్గర రైతుల నిరసనకు భారీ ఎత్తున నిరసన జరుగుతోంది. ప్రజలు నోయిడా లింక్ రోడ్‌ను నివారించాలని, ఢిల్లీకి రావడానికి డిఎన్‌డిని ఉపయోగించాలని సూచించారు.

ఢిల్లీలో వెహికల్స్ రూట్ మార్చిన పోలీసులు.. ఎందుకో తెలుసా ?

ట్రాఫిక్ కారణంగా ఘాజిపూర్ సరిహద్దు సమీపంలో జాతీయ రహదారి-24 లో ట్రాఫిక్ మూసివేయబడినందున, ఘజియాబాద్ నుండి ఢిల్లీకి వచ్చే ప్రయాణీకులకు అప్సర లేదా భోప్రా సరిహద్దు లేదా ఢిల్లీ-నోయిడా డైరెక్ట్ ఎక్స్‌ప్రెస్ వే ఉపయోగించాలని పోలీసులు సూచించారు. రైతుల నిరసనలు రోజు రోజుకి ఉధృతమవుతున్నాయి. ఈ కారణంగా ప్రధాన రహదారులు మూసివేయడం వల్ల ఈ ప్రత్యామ్నాయ మార్గాలలో ప్రయాణించాలి.

NOTE : ఫోటోలు కేవలం రిఫరెన్స్ కోసం మాత్రమే

More from DriveSpark

Article Published On: Monday, December 7, 2020, 11:09 [IST]
English summary
Delhi Border Under Continuous Jam For 10th Day Know The Alternative Route. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+