Just In
- 1 hr ago హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- 2 hrs ago JNCAP క్రాష్ టెస్ట్లో అదరగొట్టిన స్విఫ్ట్.. స్కోర్ ఎంతో తెలుసా?
- 2 hrs ago కొత్త మారుతి స్విఫ్ట్ బుకింగ్ ప్రైస్ ఎంతో తెలుసా? ఇక్కడ చూడండి!
- 4 hrs ago కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
Don't Miss
- News అహర్నిశలు ప్రజల మధ్యనే చంద్రబాబు.. చిరంజీవి; పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే
- Finance API: ఫార్మా కంపెనీలకు శుభవార్త.. ఇక లాభాలే..!
- Movies వాడుంటే రాత్రికి పండగే.. అలా పడుకుంటా! పచ్చిగా బిగ్ బాస్ బ్యూటీ ఓపెన్
- Sports ముంబై ఇండియన్స్కు బిగ్ షాక్: ఆ ఇద్దరికీ కోత
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
ఢిల్లీలో సమ్మె ప్రారంభించిన క్యాబ్ డ్రైవర్లు , ఎందుకో తెలుసా !
దేశ రాజధాని నగరం ఢిల్లీలో ఓలా మరియు ఉబర్ క్యాబ్ల డ్రైవర్లు వెహికల్ లోన్ యొక్క ఇఎమ్ఐ చెల్లింపు వ్యవధిని పొడిగించాలని మరియు క్యాబ్ చార్జస్ పెంచాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సమ్మె చేశారు. తమ డిమాండ్లను ఢిల్లీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని క్యాబ్ డ్రైవర్లు వాపోతున్నారు.
ఢిల్లీలో దాదాపు 2 లక్షలకు పైగా క్యాబ్ డ్రైవర్లు ఉన్నారు. కోవిడ్-19 సంక్షోభం నేపథ్యంలో క్యాబ్ డ్రైవర్లకు పరిహారం చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ ఇప్పటివరకు ఎటువంటి పరిహారం ఇవ్వలేదని క్యాబ్ డ్రైవర్లు ఫిర్యాదు చేశారు.
ఢిల్లీ క్యాబ్ డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కమల్జిత్ సింగ్ గిల్ మాట్లాడుతూ, కరోనా లాక్ డౌన్ డ్రైవర్లలో ఆర్థిక సంక్షోభానికి కారణమైందని, డ్రైవర్లు తమ ఇఎంఐలను చెల్లించలేకపోతున్నారని చెప్పారు.
MOST READ:భారత్లో కొత్త టాటా నెక్సాన్ ఎక్స్ఎమ్(ఎస్) వేరియంట్ లాంచ్ : ధర & ఇతర వివరాలు
లోన్ తిరిగి చెల్లించే చివరి రోజు ముగిసింది, దీని వల్ల వెహికల్ లోన్లను తిరిగి చెల్లించమని బ్యాంకులు ఇప్పటికే ఒత్తిడి చేస్తున్నాయి. క్యాబ్ డ్రైవర్లకు ఇఎంఐ చెల్లించకపోతే బ్యాంకులు తమ కార్లను జప్తు చేస్తాయని వారు పేర్కొన్నారు.
క్యాబ్ల సర్వీస్ రేట్లు పెంచాలని వారు డిమాండ్ చేశారు. క్యాబ్ కంపెనీలకు బదులుగా ప్రభుత్వం క్యాబ్ లేదా టాక్సీ ఛార్జీలను నిర్ణయించాలని గిల్ చెప్పారు. ఓలా మరియు ఉబర్ సమ్మెపై ఇంకా వ్యాఖ్యానించలేదు.
MOST READ:మతిపోగుడుతున్న మాడిఫైడ్ మహీంద్రా ఇన్వాడర్
ఢిల్లీలో క్యాబ్ డ్రైవర్లు సమ్మె చేయడం వల్ల ప్రయాణికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఢిల్లీలోని మెట్రో సర్వీసులు ఇంకా పునరుద్ధరించబడలేదు మరియు సామాజిక దూరం కారణంగా బస్సులు సగం సామర్థ్యంతో నడుస్తున్నాయి.
ఇటువంటి పరిస్థితిలో క్యాబ్ డ్రైవర్లు సమ్మె కొనసాగిస్తే, కార్యాలయాలకు మరియు ముఖ్యమైన ఉద్యోగాలకు వెళ్ళే వ్యక్తులు చాలా ఇబ్బందులను ఎదుర్కోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది.