భారత్లో ఇప్పుడు డీజిల్, పెట్రోల్ కంటే కాస్ట్లీ, ఎక్కడో తెలుసా..!
భారతదేశం అంతటా పెట్రోల్ మరియు డీజిల్ ధరలు గత రెండు వారాలుగా రోజు రోజుకి పెరుగుదల కనపరుస్తున్నాయి. రోజువారీ ధరల స్థిరమైన పెరుగుదల మధ్య, ఢిల్లీలో డీజిల్ ధరలు మొదటిసారిగా పెట్రోల్ కంటే ఖరీదైనవిగా మారాయి.

దేశ రాజధాని నగరం ఢిల్లీలో (జూన్ 24, 2020) లీటరు డీజిల్ ధర ఇప్పుడు రూ. 79.88. మునుపటి రోజుతో పోల్చితే డీజిల్ ధర నేడు 0.48 రూపాయల చిన్న పెరుగుదల కనిపించింది. డీజిల్ ధరల పెరుగుదలతో ఇప్పుడు పెట్రోల్ ధర కొంత తగ్గిపోయింది. డీజిల్ ఇప్పుడు ఢిల్లీలో పెట్రోల్ ధర రూ. 79.76 రూపాయలు.

భారతదేశం అంతటా ఇంధన ధరలు రోజువారీగా మారుతూ ఉంటాయి. పెట్రోల్ మరియు డీజిల్ రెండింటి ధరలు జూన్ 7, 2020 నుండి స్థిరంగా పెరుగుతున్నాయి. ఇటీవల కాలంలో ఇంధన పెరుగుదలలు మనం గమనించినట్లయితే గత రెండేళ్ళలో ఇంత ఎక్కువ పెరుగుదల కనిపించలేదు.

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించబడింది. ఈ నేపథ్యంలో ఇంధన అమ్మకాలు భారతదేశంలో భారీగా పడిపోయాయి. ఇటీవల లాక్ డౌన్ కి కొన్ని సడలింపులు కల్పించడంతో మే మధ్యకాలం నుండి ఇంధనం యొక్క డిమాండ్ బాగా పెరిగింది.

దీనికి సంబంధించిన మునుపటి నివేదికల ప్రకారం, కరోనా లాక్ డౌన్ కాలంలో పెట్రోల్ మరియు డీజిల్ డిమాండ్ వరుసగా 61 శాతం మరియు 56.7 శాతం పడిపోయింది. జెట్ ఇంధనం డిమాండ్ దాదాపు 91% పైగా క్షీణించింది. ఈ విధంగా పడిపోవడానికి ప్రధాన కారణం దేశీయ మరియు అంతర్జాతీయ విమాన కార్యకలాపాలు కూడా మూసివేయబడటమే.

ఢిల్లీతో పాటు బెంగుళూరులో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు లీటరుకు రూ .82.35 మరియు లీటరు 75.96 గా ఉన్నాయి. భారతదేశంలోని అనేక ఇతర నగరాలు కూడా రోజువారీ ఇంధనంలో ఇదే విధమైన ధరల పెరుగుదలను ఎదుర్కొంటున్నాయి.

డ్రైవ్స్పార్క్ అభిప్రాయం :
దేశవ్యాప్తంగా కరోనా లాక్ డౌన్ వ్యవధిలో రెండున్నర నెలల కాలంలో భారతదేశంలో అమ్మకాలు మరియు ఇంధన డిమాండ్ భారీ తేడాతో నష్టపోయింది. ఇప్పుడు కార్యకలాపాలు మరియు వ్యాపారాలు తిరిగి తెరవబడటం మరియు ఎక్కువ మంది వాహనదారులు రోడ్లపైకి రావడంతో పెట్రోల్ మరియు డీజిల్ డిమాండ్ మళ్ళీ సాధారణ స్థాయికి చేసురుకుంది. ఈ నేపథ్యంలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.


Click it and Unblock the Notifications








