Just In
- 10 hrs ago
కారులో ఉన్న పాడిల్ షిఫ్ట్ ఫీచర్ యొక్క ప్రయోజనాలు
- 21 hrs ago
భారత్లో ఫేమ్ స్కీమ్స్ కింద స్థాపించబడిన EV ఛార్జింగ్ స్టేషన్లు
- 22 hrs ago
టాటా టిగోర్ ఈవి ఫేస్లిఫ్ట్ వివరాలు వెల్లడి; ఎక్స్ ప్రెస్-టి పేరుతో త్వరలోనే లాంచ్!
- 24 hrs ago
హైదరాబాద్లో విడుదల కానున్న బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ - డీటేల్స్
Don't Miss
- Movies
Rang De Total Collections: నితిన్కు రెండో షాక్.. 24.50 కోట్ల టార్గెట్.. చివరకు వచ్చింది ఎంతంటే!
- Sports
మంచి గిఫ్ట్తో బెన్స్టోక్స్కు రాజస్థాన్ రాయల్స్ వీడ్కోలు..!
- News
కరోనా టీకానే వివేక్ను బలి తీసుకుంది.. నటుడు మన్సూర్ అలీ ఖాన్ ఆరోపణలు
- Finance
జీరో బ్యాలెన్స్ ఖాతాల్లో ట్రాన్సాక్షన్స్ ఛార్జీలపై ఎస్బీఐ వడ్డీ రేటు, ఫ్రీ ట్రాన్సాక్షన్స్
- Lifestyle
ఈ వారం 18వ తేదీ నుండి ఏప్రిల్ 24వ తేదీ వరకు మీ రాశిఫలాలు...
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నవంబర్ 2020లో ఆ రెండు విభాగాలు మాత్రమే వృద్ధి చెందాయి
నవంబర్ 2020 నెలలో జరిగిన అన్ని విభాగాల వాహన రిజిస్ట్రేషన్ డేటాను ఎఫ్ఏడిఏ (ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్) విడుదల చేసింది. ఎఫ్ఏడిఏ విడుదల చేసిన డేటా ప్రకారం, గడచిన నెలలో ప్యాసింజర్ వాహన విభాగం (ఫోర్-వీలర్) మరియు ట్రాక్టర్ వాహన విభాగం మాత్రమే వృద్ధిని నమోదు చేశాయి.

ప్యాసింజర్ వెహికల్స్ (పివి) విభాగాన్ని గమనిస్తే, ఈ విభాగం వార్షికంగా 4.17 శాతం వృద్ధిని నమోదు చేసింది. ప్యాసింజర్ వాహన విభాగంలో గడచిన నవంబర్ 2020 నెలలో మొత్తం 2,91,001 యూనిట్లు రిజిస్టర్ అయ్యాయని ఎఫ్ఏడిఏ తెలిపింది. గడచిన సంవత్సరం ఇదే సమయంలో (నవంబర్ 2019లో) వీటి సంఖ్య 2,79,365 యూనిట్లుగా ఉంది.

నవంబర్ 2020 నెలలో, ద్విచక్ర వాహన (టూ వీలర్) విభాగంలో 14,13,378 వాహనాల రిజిస్ట్రేషన్లు నమోదు కాగా, నవంబర్ 2019 నెలలో వీటి సంఖ్య 17,98,201 యూనిట్లుగా నమోదై 21.40 శాతం పడిపోయినట్లు ఎఫ్ఏడిఏ తెలిపింది. కాగా, ద్విచక్ర వాహనాల ఇన్వెంటరీ కాలం ఇంకా 45 - 50 రోజులు ఉందని, అయితే ప్యాసింజర్ వాహన విభాగం మాత్రం 21 రోజుల వ్యవధిని మాత్రమే కలిగి ఉందని ఎఫ్ఏడిఏ వివరించింది.
MOST READ: ఈ జీప్ వ్రాంగ్లర్ రూబికాన్ ధర కేవలం 50 డాలర్లు మాత్రమే!

మూడు చక్రాల (త్రీ-వీలర్) వాహన విభాగంలో కూడా రిజిస్ట్రేషన్లు భారీగా క్షీణించాయి. వార్షికంగా చూసుకుంటే నవంబర్ 2019లో మొత్తం 69,056 యూనిట్ల త్రీ వీలర్ రిజిస్ట్రేషన్లు నమోదు కాగా, ఈ ఏడాది నవంబర్ (2020)లో కేవలం 24,185 యూనిట్ల త్రీ వీలర్స్ మాత్రమే రిజిస్టర్ అయ్యాయి. మొత్తంగా చూసుకుంటే, ఈ విభాగం 64.98 శాతం క్షీణతను నమోదు చేసింది.

అదేవిధంగా, వాణిజ్య వాహన (సివి) విభాగంలో కూడా రిజిస్ట్రేషన్లు తక్కువగా ఉన్నాయి. నవంబర్ 2020లో మొత్తం 50,113 యూనిట్ల కమర్షియల్ వెహికల్స్ రిజిస్ట్రేషన్లను కాగా, గడచిన సంవత్సరం ఇదే సమయంలో (నవంబర్ 2019లో) వీటి సంఖ్య 72,863 యూనిట్లగా ఉంది. అప్పటితో పోల్చుకుంటే ఈ విభాగం వార్షికంగా 31.22 శాతం క్షీణతను నమోదు చేసింది.
MOST READ: భారతదేశ మసాలా కింగ్ ధరంపాల్ గులాటి కార్లు.. మీరు చూసారా !

ఈ ఏడాది నవంబర్ 2020 నెలలో వృద్ధిని నమోదు చేసిన విభాగంలో ట్రాక్టర్ విభాగం కూడా ఒకటి. భారతదేశంలో గడచిన నవంబర్ 2020 నెలలో ట్రాక్టర్ రిజిస్ట్రేషన్లు వార్షికంగా 8.47 శాతం వృద్ధిని నమోదు చేశాయి. గత నెలలో మొత్తం 49,313 యూనిట్ల ట్రాక్టర్లు రిజిస్టర్ కాగా, నవంబర్ 2019లో వీటి సంఖ్య 45,460 యూనిట్లుగా నమోదైంది.

ఎఫ్ఏడిఏ ఈ గణంకాలతో పాటుగా 2020లో 42 రోజుల పండుగ సీజన్ సమయంలో ప్రతి విభాగానికి చెందిన రిజిస్ట్రేషన్ నంబర్లను కూడా విడుదల చేసింది. ఈ గణాంకాల ప్రకారం కూడా ప్యాసింజర్ వాహనాలు మరియు ట్రాక్టర్లు మాత్రమే వృద్ధిని నమోదు చేశాయి. మిగిలిన వాహన విభాగలు క్షీణించాయి. పండుగ సీజన్ 2020లో మొత్తం వాహన రిజిస్ట్రేషన్లు (అన్ని విభాగాలలో కలిపి) 25.15 లక్షలుగా ఉన్నాయి. గత ఏడాది ఇదే 42 రోజుల కాలంతో పోలిస్తే ఇవి 4.47 శాతం క్షీణించాయి.
MOST READ: టోల్ ప్లాజాల వద్ద ఇకపై క్యాష్ ట్రాన్సాక్షన్లు ఉండవ్.. 100 శాతం నగదు రహితం!

ఎఫ్ఏడిఏ వాహన రిజిస్ట్రేషన్ గణాంకాలపై డ్రైవ్స్పార్క్ అభిప్రాయం.
ఈ పండుగ సీజన్లో భారతదేశంలో ప్యాసింజర్ వాహనాలు (నాలుగు చక్రాల వాహనాలు) మరియు ట్రాక్టర్ వాహనాల అమ్మకాలు మరియు రిజిస్ట్రేషన్లు మాత్రమే జోరుగా సాగాయని ఈ గణాంకాలను బట్టి తెలుస్తోంది.