కరోనాకి భయపడని ఫెరారీ సంస్థ.. ఎందుకంటే..?
నేడు ప్రపంచం మొత్తాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వల్ల ప్రజలు మాత్రమే కాదు పరిశ్రమలు కూడా తమ కార్యకలాపాలను నిలిపివేసింది. ఈ విధంగా నిలిపివేయడం వల్ల చాలా నష్టాలను ఎదుర్కోవలసి వచ్చింది. ప్రపంచం మొత్తం ఇంతటి దుర్భర స్థితిలో ఉన్నప్పటికీ ఇటలీలో ఉన్న మారనెల్లో ఫ్యాక్టరీ మాత్రం యథావిధిగా పని చేస్తుందని ఫెరారి యాజమాన్యం తెలిపారు.

కరోనా ప్రభావం ఎంత ఉన్నప్పటికీ ఇటాలియన్ సంస్థ అయిన ఫెరారీ మాత్రం యధావిధిగా విధులను నిర్వహిస్తుందని ధ్రువీకరించారు. దీని గురించి అధికారుల తెలిపిన వివరాల ప్రకారం చైనాలో పుట్టిన ఈ భయంకర వైరస్ ప్రపంచం మొత్తం వ్యాపించి మార్చి 9 నాటికి దాదాపు 7,375 మందికి కరోనా సోకినట్లు నిర్థారించారు.

కరోనా వైరస్ ఇంత వేగంగా వ్యాపిస్తున్నప్పటికీ ఈ కరోనా వ్యాప్తిని నియంత్రించడానికి, ఇటాలియన్ ప్రభుత్వం లోంబార్డి ప్రాంతం మరియు 14 ప్రావిన్సులపై కఠినమైన చర్యలను ప్రవేశపెట్టింది. ఇది సుమారు 16 మిలియన్ల మంది ప్రజలను ప్రభావితం చేసింది . ఈ ప్రాంతంలో ఫెరారీ యొక్క మారనెల్లో బేస్ కూడా ఉంది.

ఫెరారీ యొక్క నిరంతర కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా సరైన జాగ్రత్తలు తీసుకుంటోంది. అంతే కాకుండా ఫెరారీ కంపెనీ ఉద్యోగులను వారి కార్యకలాపాలను సాధ్యమైనంత ఉత్తమ స్థితిలో నిర్వహించడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకోవడం వల్ల ఈ కంపెనీ ఎప్పటిలాగే తమ కార్య కలాపాలను కొనసాగించడానికి అనుకూలంగా ఉంది.

ఫెరారీ సంస్థ కావలసిన మరియు అవసరమైనన్ని భద్రతా చర్యలను స్వీకరించడానికి సిద్ధంగా ఉంది. ఫెరారీలోని ఉద్యోగుల ఆరోగ్యం మరియు శ్రేయస్సు యొక్క పరిరక్షణకు సంపూర్ణ బాధ్యత వహిస్తోంది.

ఫెరారీ యొక్క కమర్షియల్ చీప్ ఎన్రికో గల్లియెరా మాట్లాడుతూ, మనకు అవసరమైన అన్ని ప్రోటోకాల్స్ మరియు జాగ్రత్తలు తీసుకోవడానికి సంస్థ చాలా అవసరమైన చర్యలు తీసుకుంది. వాహనాల యొక్క ఉత్పత్తి మాత్రమే కాదు ఉద్యోగుల భద్రత కూడా లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు.

కరోనా వ్యాపించకుండా సరైన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఉద్యోగులకు ఎలాంటి హాని ఉండదు తద్వారా కంపెనీలో ఉత్పత్తులు ఎప్పటిలాగే కొనసాగే అవకాశం ఉంటుంది. కాబట్టి కంపెనీ యాజమాన్యం ఉద్యోగుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అవసరమైన చర్యలు తీసుకొంటుంది.


Click it and Unblock the Notifications








