ఒక్కసారిగా 1000 కి పైగా ఫోర్స్ అంబులెన్సులు ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

భారతదేశంలో కమర్షియల్ వాహనాలకు ప్రసిద్ధి చెందిన ఫోర్స్ మోటార్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 1000 ట్రావెలర్ అంబులెన్స్‌లను పంపిణీ చేసినట్లు బుధవారం ప్రకటించింది.

ఒక్కసారిగా 1000 కి పైగా ఫోర్స్ అంబులెన్సులు ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ నాటి అంబులెన్స్ సర్వీసులు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఆధునిక వసతులతో కూడిన 108, 104 వాహనాల్ని గురువారం అందుబాటులో రానున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. మొత్తం అంబులెన్సులు రేపట్నించి ప్రారంభం కానున్నాయి.

ఒక్కసారిగా 1000 కి పైగా ఫోర్స్ అంబులెన్సులు ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభింస్తున్న ఈ అంబులెన్స్‌లు జాతీయ అంబులెన్స్ కోడ్‌కు అనుగుణంగా వస్తాయని పూణేకు చెందిన ఆటో మేజర్ ప్రకటించింది.

ఒక్కసారిగా 1000 కి పైగా ఫోర్స్ అంబులెన్సులు ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

ఆటోమేకర్ పేర్కొన్నట్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సరఫరా చేసిన ఫోర్స్ కంపెనీ అందిస్తున్న ట్రావెలర్ అంబులెన్స్‌లలో 130 అధునాతన లైఫ్ సపోర్ట్ అంబులెన్సులు, 282 బేసిక్ లైఫ్ సపోర్ట్ అంబులెన్సులు మరియు 656 మొబైల్ మెడికల్ యూనిట్లు ఉన్నాయి.

ఒక్కసారిగా 1000 కి పైగా ఫోర్స్ అంబులెన్సులు ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

ఫోర్స్ కంపెనీ యొక్క మొబైల్ మెడికల్ యూనిట్లలో కోవిడ్ స్క్రీనింగ్ సదుపాయాలు ప్రత్యేకంగా అందించబడతాయి. ఈ మెడికల్ యూనిట్లలో ఉపయోగించే వాహనాలు 104 డయల్ చేయడం ద్వారా పౌరులకు దీనిని యాక్సెస్ చేయవచ్చని వాహన తయారీదారు తెలిపారు.

ఒక్కసారిగా 1000 కి పైగా ఫోర్స్ అంబులెన్సులు ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

దీనిపై ఫోర్స్ మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రసాన్ ఫిరోడియా మాట్లాడుతూ కొనసాగుతున్న కరోనా మహమ్మారి నివారణలో భాగంగా త్వరతిగతిన సేవలను అందించడానికి ఈ అంబులెన్సులు ఎక్కువగా ఉపయోగపడతాయి. ప్రజల ఆరోగ్య దృష్ట్యా ఈ అంబులెన్సులు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం కొనుగోలు చేయడం జరిగింది.

ఒక్కసారిగా 1000 కి పైగా ఫోర్స్ అంబులెన్సులు ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ లో కూడా రోజు రోజుకి కరోనా కేసులు ఎక్కువవుతున్న కారణంగా ప్రభుత్వం ప్రజలకు అత్యవర సేవలను అందించడానికి ఈ అంబులెన్సులు ప్రవేశపెడుతున్నారు.

ఒక్కసారిగా 1000 కి పైగా ఫోర్స్ అంబులెన్సులు ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

ప్రతి అంబులెన్సును ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ తో అనుసంధానం చేయడం ద్వారా ఫోన్ చేసిన వారిని వెంటనే ట్రాక్ చేసే వీలుంటుంది. ప్రతి అంబులెన్సులో ఒక కెమెరా, మొబైల్ డేటా టెర్మినల్, మొబైల్ ఫోన్ వంటివి ఇందులో ఉంటాయి. రెండువైపులా మాట్లాడుకునే విధంగా ఆటోమెటిక్ వెహికల్ లొకేషన్ టాండ్ వ్యవస్థను కూడా ఇందులో ఏర్పాటు చేశారు.

More from DriveSpark

Article Published On: Wednesday, July 1, 2020, 19:21 [IST]
English summary
Force Motors delivers over 1000 Traveller Ambulances to Andhra Pradesh Government. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+