కరోనా నివారణలో ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా హర్యానా, ఇంతకీ ఏం చేసిందో తెలుసా..?
ప్రపంచదేశాలలో ఎంతోమంది ప్రజల ప్రాణాలను బలిగొంది. ప్రస్తుతం ఈ కరోనా మహమ్మారి నివారణకు సరైన వ్యాక్సిన్ లేదు. ఈ కారణంగా రోజుకి వేల సంఖ్యలో ప్రజలు కరోనా వల్ల ప్రాణాలను కోల్పోతున్నారు. అన్ని దేశాల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా నివారను వివిధ చర్యలు తీసుకుంటున్నాయి. కరోనా వైరస్ నివారణ కోసం అన్ని దేశాలలో కూడా లాక్ డౌన్ అమలు చేయబడింది. ఈ కరంగా ప్రజలు ఇంటి నుంచి బయటకు రాకూడదని ఆంక్షలు విధించారు.

కరోనా వైరస్ ఎక్కువగా వ్యాపించడం వల్ల భారతదేశంలో కూడా లాక్ డౌన్ అమలు చేయబడింది. ప్రస్తుతం భారతదేశంలో లాక్ డౌన్ రెండవ దశలో ఉంది. కరోనా ప్రభావం వల్ల భారతదేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. దీనికి ప్రధాన కారణం వ్యాపార రంగాలన్నీ ఆగిపోవడం. అన్ని వ్యాపారాలు తాత్కాలికంగా ఆపివేయడం వల్ల దేశ ఆర్ధిక వ్యవస్థ నీదు చాలా వరకు దిగజారిపోయింది.

కరోనా వైరస్ నుండి ప్రజలను రక్షించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని చాలావరకు కఠినమైన చర్యలు తీసుకుంటున్నాయి. దాదాపు అన్ని రాష్ట్రప్రభుత్వాలు అన్ని రకాల ప్రయత్నాలు చేపట్టారు. హర్యానా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇతర రాష్ట్ర ప్రభుత్వాల కంటే కొంత భిన్నంగా చర్యలను తీసుకుంటోంది.

కరోనా వైరస్ అనుమానితుల నుండి నమూనాలను సేకరించడానికి రాష్ట్ర రవాణా సంస్థ బస్సులను ఉపయోగిస్తోంది. హర్యానా ప్రభుత్వం ఇంతకుముందు తన బస్సులను ప్రత్యేక చికిత్స కోసం బస్సులను తాత్కాలిక వార్డులుగా మార్చింది.

ఇప్పుడు అదే బస్సులను ఉపయోగించి నమూనాలను సేకరించదానికి ఉపయోగిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా కొన్ని బస్సులను కూడా కేటాయించారు. ఈ ప్రత్యేకమైన ప్రాజెక్టును గురుగ్రామ్లో ప్రారంభించారు. గతంలో అదే నగరంలో ఐసోలేషన్ వార్డ్ సౌకర్యం కూడా ప్రవేశపెట్టబడింది.

నమూనాలను సేకరిస్తున్న బస్సులను నగరంలోని మూడు ప్రధాన ప్రాంతాల్లో ఉంచనున్నారు. అవి లీజర్ వ్యాలీ గ్రౌండ్, డౌ దేవి లాల్ స్టేడియం మరియు చిటల్ మాతా టెంపుల్ అనే మూడు ప్రసిద్ధ ప్రాంతాల సమీపంలో ఈ బస్సులు నడుస్తాయి. ఈ విధానం ద్వారా నమూనాలను చాలా త్వరగా పరీక్షించనున్నట్లు అధికారులు తెలిపారు. సేకరించిన నమూనాల ఫలితాలను వేగంగా అందజేయడానికి అధికారులు ప్రణాళికలు తయారుచేసుకున్నారు.

బస్సులను ఐసోలేషన్ వార్డులుగా మార్చడం మరియు నమూనాలను సేకరించడానికి భారతదేశంలో ఇదే మొదటిసారి. ఈ కారణంతో అన్ని రాష్ట్రాలు హర్యానా వైపు చూస్తున్నాయి. కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ల సంఖ్య పెరుగుతున్నందున దేశవ్యాప్తంగా ఆసుపత్రుల కొరత చాలా వరకు పెరుగుతోంది.

హర్యానా ప్రభుత్వం తీసుకున్న చర్యను ప్రజలందరూ ప్రశంసించారు. ఈ బస్సులు ప్రజలు నివసించే ప్రాంతానికి దూరంగా ఉన్నందున సంక్రమణ ప్రమాదం తక్కువగా ఉంటుందని చెబుతారు.

ఈ బస్సులు యాంటిసెప్టిక్స్తో స్విచ్ ఆన్ చేయబడతాయి. ఇది వైరస్ వ్యక్తి నుండి వ్యక్తికి వ్యాపించకుండా చేస్తుంది. నమూనా సేకరించే సిబ్బందిని క్రిమిసంహారక చేయడానికి కూడా తగిన చర్యలు తీసుకుంటారు. ఏది ఏమైనా ఈ విధానం చాలా ఉపయోగకరంగా ఉండటమే కాకుండా ఒకవ్యక్తి నుంచి మరోవ్యక్తికి రాకుండా ఉండేలాగా కూడా చేస్తుంది.


Click it and Unblock the Notifications








