ట్రక్ డ్రైవర్లకు గుడ్ న్యూస్ చెప్పిన NHAI, అదేంటో ఇప్పుడే చూడండి
కరోనా వైరస్ విస్తరిస్తున్న కారణంగా కరోనా మహమ్మారిని నివారించడానికి భారత ప్రభుత్వం 2020 మార్చి 24 నుంచి 21 రోజుల పాటు లాక్ డౌన్ ప్రకటించింది. దేశం మొత్తం లాక్ డౌన్ లో ఉండటం వల్ల దాదాపు అన్ని కార్యకలాపాలు నిలిపివేయబడ్డాయి. కానీ ఈ వైరస్ వ్యాప్తి మరింత ఎక్కువగా ఉండటం వల్ల లాక్ డౌన్ ని 2020 మే 03 వ తేదీ దాకా పొడిగిస్తూ భారత ప్రధాని బహిరంగ ప్రకటన చేశారు.

దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉన్నందున, చాలా రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్ర సరిహద్దులను మూసివేసాయి. ఎవరినీ తమ రాష్ట్రాలలోకి ప్రవేశించడానికి అనుమతించలేదు. ట్రక్ డ్రైవర్లు మరియు సహాయకులకు ఇది పెద్ద సమస్యగా మారింది. ఈ కారణంగా ట్రక్ డ్రైవర్లు ఎక్కడికక్కడ రహదారులపై ఒంటరిగా ఉండిపోతున్నారు.

టైమ్స్ ఆఫ్ ఇండియా యొక్క నివేదిక ప్రకారం ఇప్పుడు ఒంటరిగా ఉన్న ట్రక్ డ్రైవర్లు మరియు సహాయకుల కోసం నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా కొన్ని ఏర్పాట్లు చేస్తోందని చెబుతున్నారు.

దీనికి సంబంధించి నివేదిక ప్రకారం నేషనల్ హైవే నెట్వర్క్లో విస్తరించి ఉన్న 1,7000 ఇంధన స్టేషన్లలో ట్రక్ డ్రైవర్లకు ఆహారం కోసం ఏర్పాట్లు చేస్తోంది. 1,700 ఇంధన కేంద్రాలతో పాటు, ఎన్హెచ్ఏఐ ఇలాంటి ఏర్పాట్లు చేయడానికి మరో 148 ప్రదేశాలను కూడా ఏర్పాటు చేస్తోంది.

భారత్ పెట్రోలియం, హిందూస్తాన్ పెట్రోలియం మరియు ఇండియన్ ఆయిల్ నడుపుతున్న ఇంధన కేంద్రాల జాబితాను రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ విడుదల చేసింది, ఇక్కడ ఈ ఏర్పాట్లు చేయబడతాయి. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు హైవేలపై ఉన్న డాబాలు మరియు రిపేర్ దుకాణాల జాబితాను కూడా అందిస్తున్నాయి. వీటిని ట్రక్ డ్రైవర్లు మరియు వారి సహాయకులు ఉపయోగించవచ్చు.

లాక్ డౌన్ వల్ల ఎక్కడికక్కడ చిక్కుకుపోయిన ట్రక్ డ్రైవర్లకు ఆహారాన్ని అందించడానికి ఏర్పాటు చేసిన సౌకర్యాల జాబితాను మంత్రిత్వ శాఖ వెబ్సైట్లో విడుదల చేశారు. జాబితాలో ప్రతి ప్రదేశంలో ఖచ్చితమైన అడ్రస్ మరియు మొబైల్ నెంబర్ వంటి కూడా ఇందులో ఉన్నాయి.

ట్రక్ డ్రైవర్లు స్వయంగా మంత్రిత్వ శాఖల వెబ్సైట్ను తనిఖీ చేయకపోగా, రవాణా ఏజెన్సీల కోసం ఈ జాబితా అందుబాటులో ఉంటుంది, వారు డ్రైవర్లు మరియు సహాయకులను సమీప ప్రదేశానికి మార్గనిర్దేశం చేయడానికి అనుకూలంగా ఉంటుంది.

మునుపటి నివేదికల ప్రకారం నివేదికల ప్రకారం ట్రక్కులు తీసుకువెళుతున్న 3.5 లక్షల అంతర్-రాష్ట్ర వస్తువులు రహదారులపై చిక్కుకుపోయాయి. ఈ ట్రక్కులలో దాదాపు రూ. 35,000 కోట్ల విలువైన వస్తువులు ఉన్నాయని అంచనా వేయబడింది.

డ్రైవ్స్పార్క్ తెలుగు అభిప్రాయం..!
భారత దేశంలోని వివిధ ప్రాంతాల హైవేలపై చిక్కుకున్న ట్రక్ డ్రైవర్ల కోసం ఎన్హెచ్ఏఐ గొప్ప నిర్ణయం తీసుకుంది. అతి తక్కువ ధరలకు ఆహార పదార్థాల ఏర్పాటు చేయడం అనేది అభినందనీయం. ఈ సంక్షోభ పరిస్థితిలో ట్రక్ డ్రైవర్లు మరియు సహాయకులు రాష్ట్ర సరిహద్దుల్లో చిక్కుకున్న అనేక సమస్యలలో కనీసం ఆహార సమస్యనైనా పరిష్కరిస్తుంది.


Click it and Unblock the Notifications








