Just In
- 4 hrs ago 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- 5 hrs ago ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
- 6 hrs ago నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- 7 hrs ago సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
Don't Miss
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Sports RR vs DC: సహనం కోల్పోయిన రిషభ్ పంత్వీడియో
- News barrelakka: వివాహ బంధంలోకి అడుగుపెట్టిన బర్రెలక్క
- Movies కరీనా కపూర్ పోలిటికల్ ఎంట్రీ!.. ఏ పార్టీలో చేరి.. ఎక్కడ నుంచి పోటీ అంటే?
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
హ్యుందాయ్ కంపెనీ ఫస్ట్ మినీ ఎలక్ట్రిక్ బస్
దేశీయ మార్కెట్లో ప్రసిద్ధి చెందిన వాహన తయారీదారు హ్యుందాయ్ మోటార్స్ భారత మార్కెట్లో ఇప్పటికే చాల వాహనాలను విడుదలచేసింది. హ్యుందాయ్ బ్రాండ్ వాహనాలు ఎక్కువ ప్రజాదరనను కూడా పొందాయి. ఇటీవల కాలంలో కంపెనీ ఎలక్ట్రిక్ మినీ బస్సును విడుదల చేసింది. హ్యుందాయ్ కంపెనీ విడుదల చేసిన ఈ కొత్త ఎలక్ట్రిక్ బస్ గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.. రండి.
హ్యుందాయ్ మోటార్ తన మొదటి ఎలక్ట్రిక్ మినీ బస్సుకు కంట్రీ ఎలక్ట్రిక్ అని పేరు పెట్టింది. డీజిల్ ఇంజిన్ బస్సుల కంటే ఆర్థికంగా, పర్యావరణానికి అనుకూలంగా ఉండే ఈ మినీ బస్సును ఇటీవల సంస్థ విడుదల చేసింది.
హ్యుందాయ్ కంట్రీ ఎలక్ట్రిక్ బస్సులో 15 నుండి 33 సీట్లు ఉన్నాయి. ఈ మినీ బస్సు పొడవు 7,710 మిమీ వరకు ఉంటుంది. ఈ మినీ ఎలక్ట్రిక్ బస్సులో128 kWh లిథియం-అయాన్ బ్యాటరీ అమర్చారు. ఈ బ్యాటరీ ఈ మినీ ఎలక్ట్రిక్ బస్సుకు శక్తినిస్తుంది.
MOST READ:ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల చేసిన కెటిఎమ్
ఈ బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ అయితే, కంట్రీ ఎలక్ట్రిక్ మినీ బస్సు దాదాపు 250 కిలోమీటర్ల వరకు నడుస్తుందని కంపెనీ తెలిపింది. ఈ బ్యాటరీని ప్రామాణిక కాంబో 1 డిసి సిస్టమ్ కలిగి ఉండటం వల్ల కేవలం 72 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ చేసుకునే అవకాశం ఉంటుంది.
హ్యుందాయ్ కంట్రీ ఎలక్ట్రిక్ బస్సులోని బ్యాటరీని హోమ్ అవుట్లెట్లలోని 220-వోల్ట్స్ నుండి ఛార్జ్ చేయవచ్చు. కానీ ఈ విధంగా ఛార్జ్ చేయడానికి 17 గంటలు పడుతుంది. 220 వోల్ట్స్ హోమ్ ఛార్జర్తో ఈ బస్సుకు హ్యుందాయ్ ప్రత్యామ్నాయాన్ని అందిస్తుంది.
MOST READ:విధి నిర్వహణలో ఉన్న పోలీసును తన్నిన మాజీ MP, ఎవరో తెలుసా ?
హ్యుందాయ్ ప్రస్తుతం ఈ బస్సును దక్షిణ కొరియా మార్కెట్లో మాత్రమే విడుదల చేసింది. కొత్త ఎలక్ట్రిక్ మినీ బస్సు డీజిల్ బస్సుల కంటే 30% వేగంగా ఉందని హ్యుందాయ్ ప్రకటించింది.
ఈ బస్సులో ఎసి, ఎయిర్ ఓవర్ హైడ్రాలిక్స్ బ్రేక్ సిస్టమ్స్ ఉన్నాయి. హ్యుందాయ్ ఈ బస్సును అధునాతన పద్ధతిలో నిర్మించింది. అంతే కాకుండా కంపెనీ ఈ బస్సు యొక్క డోర్స్ దగ్గర రకరకాల సెన్సార్లను ఏర్పాటు చేసింది.
MOST READ:డీలర్షిప్ చేరుకున్న కొత్త ట్రయంఫ్ టైగర్ 900 బైక్
ప్రయాణీకులు దిగినప్పుడు లేదా బస్సు ఎక్కేటప్పుడు ఈ సెన్సార్లు డోర్స్ మూసుకోవు. బదులుగా వారు ప్రయాణీకులను సులభంగా ఎక్కడానికి మరియు దిగడానికి అనుమతించబడుతుంది. ప్రయాణీకులు డోర్స్ మధ్యకు వస్తే సెన్సార్లు వెంటనే డోర్స్ ఓపెన్ చేసే విధంగా చేస్తాయి. సోదాహరణంగా ఎలక్ట్రిక్ బస్సుల వల్ల వాయు కాలుష్యం జరగదు. అంతే కాకుండా ప్రపంచం అభివృద్ధి వైపు పరుగులుపెడుతున్న తరుణంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం తప్పనిసరి కూడా..!