2020లో అన్నీ కష్టాలు, నష్టాలే.. మరి 2021లో అవి తొలగిపోయేనా..?

మరికొన్ని గంటల్లో 2020 సంవత్సరం ముగియబోతోంది. ఈ సంవత్సరం చాలా మందికి చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. కరోనా మహమ్మారి ధాటికి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు, వ్యాపారాలు దెబ్బతిన్నాయ్, పరిశ్రమలు మూతపడ్డాయ్, ఉద్యోగస్తులు రోడ్డున పడ్డారు. ఇలా ఎన్నో సమస్యలు, మరెన్నో సవాళ్లు!

2020లో అన్నీ కష్టాలు, నష్టాలే.. మరి 2021లో అవి తొలగిపోయేనా..?

ఈ 2020 సంవత్సరంలో భారత ఆటోమోటివ్ పరిశ్రమ కూడా అనేక సవాళ్లను ఎదుర్కుంది. ఈ ఏడాది ఆరంభంలో ప్రారంభమైన ఆటో ఎక్స్‌పోతో ఎన్నో ఆశలు మరియు ఆశయాలతో ఆటోమొబైల్ రంగం కొత్త సంవత్సరాన్ని ప్రారంభించింది. అయితే, ఆ వెంటనే కోవిడ్ వైరస్ వ్యాప్తి చెందటం, లాక్‌డౌన్ విధించడం వలన తీవ్ర నష్టాలను ఎదుర్కొంది.

2020లో అన్నీ కష్టాలు, నష్టాలే.. మరి 2021లో అవి తొలగిపోయేనా..?

లాక్‌డౌన్ నేపథ్యంలో, దేశీయ ఆటోమొబైల్ పరిశ్రమలో ఏప్రిల్ 2020 నెలలో 0 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. అప్పటి నుండి 2020 ద్వితీయార్థం వరకూ ఆటోమొబైల్ కంపెనీలు నష్టాల బాటను పట్టాయి. గత 2020 సంవత్సరంలో ఆటోమొబైల్ పరిశ్రమలోని హైలైట్స్ ఇలా ఉన్నాయి:

2020లో అన్నీ కష్టాలు, నష్టాలే.. మరి 2021లో అవి తొలగిపోయేనా..?

ఆటో ఎక్స్‌పో 2020 - అంగరంగ వైభవంగా ప్రారంభం

ఇదివరకు చెప్పుకున్నట్లుగానే, ఫిబ్రవరి నెలలో ఢిల్లీలో జరిగిన ఆటో ఎక్స్‌పోతో 2020 సంవత్సరంలో ఆటో పరిశ్రమ ఎంతో ఉత్సాహంగా ప్రారంభమైంది. ఆటో ఎక్స్‌పోలో అనేక కొత్త బ్రాండ్‌లు తమ సరికొత్త ఉత్పత్తులను ప్రదర్శించాయి. వీటిలో చాలా వరకూ మోడళ్లు ఈ ఏడాదే విడుదల కావల్సి ఉన్నప్పటికీ, మహమ్మారి కారణంగా వాయిదా పడ్డాయి.

2020లో అన్నీ కష్టాలు, నష్టాలే.. మరి 2021లో అవి తొలగిపోయేనా..?

మారుతి సుజుకి, హోండా, బిఎమ్‌డబ్ల్యూ, టొయోటా వంటి ప్రముఖ దేశీయ మరియు విదేశీయ బ్రాండ్‌లు తమ ఉత్పత్తులను మరియు కాన్సెప్ట్ వాహనాలను ప్రదర్శించాయి. ఎలక్ట్రిక్ వాహన విభాగంలో కూడా అనేక కొత్త మోడళ్లను కంపెనీలు ప్రదర్శించాయి. అయితే, వీటిలో ఏవీ మార్కెట్‌ను చేరుకోలేకపోయాయి.

2020లో అన్నీ కష్టాలు, నష్టాలే.. మరి 2021లో అవి తొలగిపోయేనా..?

బిఎస్6 ఉద్గార నిబంధనలకు మారడం

దేశంలో పెరిగిపోతున్న కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం కాలుష్య నిబంధనలను కఠినతరం చేసింది. ఫలితంగా, ఏప్రిల్ 1వ తేదీ నుండి బిఎస్6 కాలుష్య నిబంధనలు అమల్లోకి వచ్చాయి. భారతదేశంలోని అన్ని వాహన తయారీదారులు తమ మొత్తం పోర్ట్‌ఫోలియోను తాజా ఉద్గార నిబంధనలకు అనుగుణంగా అప్‌డేట్ చేయటం మొదలుపెట్టారు.

2020లో అన్నీ కష్టాలు, నష్టాలే.. మరి 2021లో అవి తొలగిపోయేనా..?

మూలిగే నక్క మీద తాటి పండు పడిందన్న చందంగా, బిఎస్6 అప్‌డేట్ కారణంగా, కొత్త మోడళ్ల ధరలన్నీ అనూహ్యంగా పెరిగిపోయాయి. కొన్ని కంపెనీలైతే తమ ఉత్పత్తులను మార్కెట్ నుండి తొలగించివేశాయి. డీజిల్ ఇంజన్లతో నడిచే వాహనాలు అటకెక్కాయి. మారుతి సుజుకి, స్కోడా, ఫోక్స్‌వ్యాగన్, రెనో, నిస్సాన్ వంటి కంపెనీలు డీజిల్ కార్ల తయారీని నిలిపివేశాయి.

2020లో అన్నీ కష్టాలు, నష్టాలే.. మరి 2021లో అవి తొలగిపోయేనా..?

కోవిడ్-19 లాక్‌డౌన్ - ఫైటింగ్ స్పిరిట్

గడచిన మార్చి 2020 మధ్య నుండి మొదలుకొని మే 2020 వరకు దేశంలో పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ను చూసింది. ఈ సమయంలో నిత్యావసర దుకాణాలు మినహా మిగిలిన అన్ని వ్యాపారాలు మూతపడ్డాయి. ప్రజలందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. అయితే, ఈ సమయంలో కోవిడ్‌తో ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి తమవంతు సాయం అందించేందుకు ఆటో పరిశ్రమ కదలి వచ్చింది.

2020లో అన్నీ కష్టాలు, నష్టాలే.. మరి 2021లో అవి తొలగిపోయేనా..?

మహమ్మారిపై పోరులో భాగంగా తమ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు ఆటోమొబైల్ కంపెనీలు భారీ మొత్తాలలో విరాళాలను అందించారు. కొన్ని వాహన తయారీదారులు పిపిఇ కిట్లు, ఫేస్ మాస్క్‌లు, ఫేస్ షీల్డ్స్ మరియు వెంటిలేటర్లు వంటి పరికరాల అందించేందుకు ముందుకు వచ్చారు. ఈ విపత్కర కాలంలో ఆటోమొబైల్ పరిశ్రమలు చేసిన సాయం నిజంగా ప్రశంశనీయం.

2020లో అన్నీ కష్టాలు, నష్టాలే.. మరి 2021లో అవి తొలగిపోయేనా..?

ఏప్రిల్‌లో సున్నా అమ్మకాలు

మార్చ్ 2020 నెలాఖరు సమయంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించడంతో ఆటో అమ్మకాలు పూర్తిగా నిలిచిపోయాయి. చరిత్రలో ఇదివరకెన్నడూ లేని విధంగా ఏప్రిల్ 2020 నెలలో సున్నా అమ్మకాలు నమోదయ్యాయి. ఈ సమయంలో వాహనాల తయారీ, సర్వీస్, రీపేర్స్ వంటి సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈనెల నుండే కంపెనీలు నష్టాల బాట పట్టడం ప్రారంభించాయి.

2020లో అన్నీ కష్టాలు, నష్టాలే.. మరి 2021లో అవి తొలగిపోయేనా..?

పండుగ సీజన్ రికవరీ - పరిశ్రమకు పునరుజ్జీవం

అయితే, ఈ ఏడాది ద్వితీయార్ధంలో లాక్‌డౌన్ మినహాయింపుల నేపథ్యంలో, ఆటోమొబైల్ కంపెనీలు తిరిగి లాక్‌డౌన్ ముందు నాటి పరిస్థితులను చేరుకునేందుకు ఎంతగానో కృషి చేశాయి. మరోవైపు కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో, ప్రజలు కూడా వ్యక్తిగత రవాణా వైపు ఆసక్తి చూపడంతో దేశంలో వాహనాల విక్రయం జోరందుకుంది.

2020లో అన్నీ కష్టాలు, నష్టాలే.. మరి 2021లో అవి తొలగిపోయేనా..?

కస్టమర్లను ఆకర్షించేందుకు ఆటోమొబైల్ కంపెనీలు కూడా ప్రోత్సాహకర ఆఫర్లను ప్రకటించాయి. పండుగ సీజన్ సెంటిమెంట్ జోరందుకోవటంతో మార్కెట్లో వాహనాల అమ్మకాలు కూడా పెరిగాయి. కొత్త మోడళ్లు రావటం మొదలు పెట్టాయి. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా వాహనాలను అందించేందుకు కంపెనీలు తమ ఉత్పత్తి సామర్థ్యాలను కూడా పూర్తిస్థాయికి పెంచాయి.

2020లో అన్నీ కష్టాలు, నష్టాలే.. మరి 2021లో అవి తొలగిపోయేనా..?

గత 2020 సంవత్సరంలో అనేక ఒడిదుడుకులను చూసిన భారత ఆటోమొబైల్ పరిశ్రమ, ఇప్పుడిప్పుడే తిరిగి యధాస్థాయికి చేరుకుంటోంది. అయితే, కోవిడ్-19 ఇంకా వ్యాక్సీన్ అందుబాటులోకి రాకపోవటం, మరోవైపు సెకండ్ వేవ్ ప్రమాదం పొంచి ఉండటం వంటి పరిస్థితుల నేపథ్యంలో, 2021లో భారత ఆటోమొబైల్ పరిశ్రమకు ఎలా ఉండబోతోందనే అంశంపై ఆసక్తి నెలకొని ఉంది.

More from DriveSpark

Article Published On: Wednesday, December 30, 2020, 13:23 [IST]
English summary
Indian Auto Industry Highs And Lows In 2020. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+