లాక్‌డౌన్ నిబంధనలను సడలించిన కేరళ ప్రభుత్వం, ఇక్కడ కొత్త రూల్స్ ఎలా ఉన్నాయంటే..?

భారతదేశంలో కరోనా వైరస్ విస్తరించడం వల్ల భారత ప్రభుత్వం కరోనా నివారణలో భాగంగా లాక్ డౌన్ విధించారు. భారత్ లో కరోనా లాక్ డౌన్ వల్ల ఆర్థిక వ్యవస్థ బాగా క్షీణించింది. ఆర్థిక వ్యవస్థను సాధారణ స్థితికి తీసుకు రావడానికి మరియు కరోనా తక్కువగా ఉన్న ప్రాంతాలలో లాక్ డౌన్ ని పాక్షికంగా సడలించడం జరిగింది. భారతదేశంలో కేరళ జిల్లాలో లాక్ డౌన్ సడలింపులు గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

లాక్‌డౌన్ నిబంధనలను సడలించిన కేరళ ప్రభుత్వం, ఇక్కడ కొత్త రూల్స్ ఎలా ఉన్నాయంటే..?

కరోనా ప్రభావము వల్ల ప్రజా జీవితాలు చాలా దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఈ కారణంగా ప్రజా జీవితాలను సాధారణ స్థితికి తీసుకురావడం ప్రారంభించే ప్రయత్నంలో, కొన్ని ఆంక్షలతో ఉన్నప్పటికీ, చాలా జిల్లాల్లో ప్రైవేట్ వాహనాలను నడపవచ్చని కేరళ ప్రభుత్వం ప్రకటించింది.

లాక్‌డౌన్ నిబంధనలను సడలించిన కేరళ ప్రభుత్వం, ఇక్కడ కొత్త రూల్స్ ఎలా ఉన్నాయంటే..?

రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ -19 వైరస్‌ కలిగి ఉన్న14 జిల్లాలను రెడ్, ఆరెంజ్-ఎ, ఆరెంజ్-బి, గ్రీన్ అనే నాలుగు జోన్‌లుగా కలర్ కోడెడ్ చేసింది. వైరస్ యొక్క సాంద్రతను ఈ విధంగా చేశారు.

MOST READ: ట్రక్ డ్రైవర్లకు గుడ్ న్యూస్ చెప్పిన NHAI, అదేంటో ఇప్పుడే చూడండి

లాక్‌డౌన్ నిబంధనలను సడలించిన కేరళ ప్రభుత్వం, ఇక్కడ కొత్త రూల్స్ ఎలా ఉన్నాయంటే..?

ప్రభుత్వం ప్రకటించిన రెడ్ జోన్ విభాగంలో కాసరగోడ్, కన్నూర్, కోజికోడ్ మరియు మలప్పురం ఉన్నాయి. ఈ అన్ని రెడ్ జోన్లలో మే 3 వరకు పూర్తి లాక్ డౌన్ అమలులో ఉంటుంది. ఎంట్రీ మరియు ఎగ్జిట్ యొక్క రెండు పాయింట్లు అవసరమైన మరియు వైద్య సేవలకు మాత్రమే తెరిచి ఉంటాయి.

లాక్‌డౌన్ నిబంధనలను సడలించిన కేరళ ప్రభుత్వం, ఇక్కడ కొత్త రూల్స్ ఎలా ఉన్నాయంటే..?

ఆరెంజ్-ఎ జోన్ మరియు ఆరెంజ్-బి జోన్లలో వరుసగా పతనమిట్ట, ఎర్నాకులం & కొల్లం, మరియు అలప్పుజ, తిరువనంతపురం, పాలక్కాడ్, త్రిస్సూర్ మరియు వయనాడ్ జిల్లాలు ఉన్నాయి. ఇక్కడ లాక్ డౌన్ ఏప్రిల్ 24 వరకు అమలులో ఉంటుంది. ఏప్రిల్ 24 తర్వాత కొన్ని నియమాలు సడలించబడతాయి.

MOST READ: త్వరలో లాంచ్ కానున్న బిఎస్ 6 సుజుకి వి-స్ట్రోమ్ 650 XT బైక్, ఇదే

లాక్‌డౌన్ నిబంధనలను సడలించిన కేరళ ప్రభుత్వం, ఇక్కడ కొత్త రూల్స్ ఎలా ఉన్నాయంటే..?

గ్రీన్ జోన్‌లో కొట్టాయం మరియు ఇడుక్కి ఉన్నాయి. ఇక్కడ ఏప్రిల్ 20 వరకు పూర్తి లాక్ డౌన్ అమలులో ఉంటుంది, ఆ తర్వాత కొన్ని నియమాలు సడలించబడతాయి. ఏదేమైనా అన్ని మండలాలలోనూ పెద్ద సమావేశాలు, విద్యా సంస్థలు, మతపరమైన కార్యక్రమాలు, వేడుకలు మరియు ఏ జిల్లా వెలుపల ప్రయాణించడం లాక్ డౌన్ నియమాలను సడలించిన తర్వాత కూడా అనుమతించబడదు.

లాక్‌డౌన్ నిబంధనలను సడలించిన కేరళ ప్రభుత్వం, ఇక్కడ కొత్త రూల్స్ ఎలా ఉన్నాయంటే..?

రవాణా మంత్రిత్వ శాఖ ప్రైవేట్ వాహనాల కోసం బేసి మరియు సరి అనే కొత్త పథకాన్ని ప్రకటించింది. ఇది సంబంధిత లాక్ డౌన్ లను ఎత్తివేసిన తరువాత అమలులోకి వస్తుంది. బేసి సంఖ్య కలిగిన వాహనాలను సోమ, బుధ, శుక్రవారాల్లో మాత్రమే అనుమతిస్తారు. సరి సంఖ్యలతో కూడిన వాహనాలను మంగళ, గురు, శనివారాల్లో మాత్రమే అనుమతిస్తారు.

MOST READ:కరోనా లాక్‌డౌన్ వల్ల సైకిల్ పై స్వగ్రామం చేరిన కార్మికులు, ఎక్కడో తెలుసా..?

లాక్‌డౌన్ నిబంధనలను సడలించిన కేరళ ప్రభుత్వం, ఇక్కడ కొత్త రూల్స్ ఎలా ఉన్నాయంటే..?

అవసరమైన సేవలు ఉపయోగించే వాహనాలు మాత్రమే ఆదివారాలలో, సరి లేదా బేసి సంఖ్యలతో సంబంధం లేకుండా అనుమతించబడతాయి. సోలో లేదా డిపెండెంట్లతో ప్రయాణించే మహిళలకు ఈ నిబంధనల నుండి మినహాయింపు ఉంటుంది. మరియు డ్రైవర్‌తో సహా ముగ్గురు వ్యక్తులను మాత్రమే కార్లలో అనుమతించబడతారు.

లాక్‌డౌన్ నిబంధనలను సడలించిన కేరళ ప్రభుత్వం, ఇక్కడ కొత్త రూల్స్ ఎలా ఉన్నాయంటే..?

ఈ వ్యవస్థ వాహనాల సంఖ్యను 40 శాతం వరకు తగ్గిస్తుందని మరియు ట్రాఫిక్‌ను సులభతరం చేస్తుందని, పూర్తి లాక్ నుండి ‘సాధారణ స్థితికి' తేలికగా మారడానికి వీలు కల్పిస్తుందని కేరళ పోలీసులు చెబుతున్నారు.

MOST READ:ప్రసిద్ధ భారతీయుల యొక్క మొదటి కార్లు చూసారా..?

లాక్‌డౌన్ నిబంధనలను సడలించిన కేరళ ప్రభుత్వం, ఇక్కడ కొత్త రూల్స్ ఎలా ఉన్నాయంటే..?

కేరళలో దాదాపు 461 మందికి కోవిడ్ -19 బారిన పడ్డారు, మరియు ప్రభుత్వం వేగంగా చర్య తీసుకోవడం మరియు రాష్ట్ర పౌరుల సహకారంతో కరోనాని కొంతవరకు అదుపులోకి తీసుకురావడం జరిగింది.

లాక్‌డౌన్ నిబంధనలను సడలించిన కేరళ ప్రభుత్వం, ఇక్కడ కొత్త రూల్స్ ఎలా ఉన్నాయంటే..?

లాక్ డౌన్ నిబంధనలను సడలించడం అనేది అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చేయాల్సి ఉంటుంది, చివరికి - వ్యక్తిగత పరిస్థితులను బట్టి. కోవిడ్ -19 వైరస్ కొన్ని మండలాల్లోనే ఉందని కేరళ ప్రభుత్వం తెలిపింది. త్వరలోనే మొత్తం రాష్ట్రం అంతటా లాక్ డౌన్ సడలింపు ఖచ్చితంగా ఉంటుందని నిబంధనలను సడలించడానికి ప్రణాళిక కూడా వేసిందని తెలిపారు.

Most Read Articles

English summary
Kerala Government Relaxes Lock Down Rules: Implements Odd-Even Scheme Across Districts. Read in Telugu.
Story first published: Monday, April 20, 2020, 18:04 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X