Just In
- 13 hrs ago 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- 14 hrs ago ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
- 15 hrs ago నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- 16 hrs ago సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
Don't Miss
- News అయ్యయ్యో.. అపర చాణిక్యుడు కేసీఆర్ అస్తిత్వ పోరాటం!!
- Sports రోహిత్ శర్మ ప్లేస్లో..!!
- Movies Tillu Square Twitter Review: టిల్లు స్క్వేర్కు అలాంటి టాక్.. అదొక్కటే మైనస్.. ఇంతకీ హిట్టేనా అంటే!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
లాక్డౌన్ నిబంధనలను సడలించిన కేరళ ప్రభుత్వం, ఇక్కడ కొత్త రూల్స్ ఎలా ఉన్నాయంటే..?
భారతదేశంలో కరోనా వైరస్ విస్తరించడం వల్ల భారత ప్రభుత్వం కరోనా నివారణలో భాగంగా లాక్ డౌన్ విధించారు. భారత్ లో కరోనా లాక్ డౌన్ వల్ల ఆర్థిక వ్యవస్థ బాగా క్షీణించింది. ఆర్థిక వ్యవస్థను సాధారణ స్థితికి తీసుకు రావడానికి మరియు కరోనా తక్కువగా ఉన్న ప్రాంతాలలో లాక్ డౌన్ ని పాక్షికంగా సడలించడం జరిగింది. భారతదేశంలో కేరళ జిల్లాలో లాక్ డౌన్ సడలింపులు గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.
కరోనా ప్రభావము వల్ల ప్రజా జీవితాలు చాలా దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఈ కారణంగా ప్రజా జీవితాలను సాధారణ స్థితికి తీసుకురావడం ప్రారంభించే ప్రయత్నంలో, కొన్ని ఆంక్షలతో ఉన్నప్పటికీ, చాలా జిల్లాల్లో ప్రైవేట్ వాహనాలను నడపవచ్చని కేరళ ప్రభుత్వం ప్రకటించింది.
రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ -19 వైరస్ కలిగి ఉన్న14 జిల్లాలను రెడ్, ఆరెంజ్-ఎ, ఆరెంజ్-బి, గ్రీన్ అనే నాలుగు జోన్లుగా కలర్ కోడెడ్ చేసింది. వైరస్ యొక్క సాంద్రతను ఈ విధంగా చేశారు.
MOST READ: ట్రక్ డ్రైవర్లకు గుడ్ న్యూస్ చెప్పిన NHAI, అదేంటో ఇప్పుడే చూడండి
ప్రభుత్వం ప్రకటించిన రెడ్ జోన్ విభాగంలో కాసరగోడ్, కన్నూర్, కోజికోడ్ మరియు మలప్పురం ఉన్నాయి. ఈ అన్ని రెడ్ జోన్లలో మే 3 వరకు పూర్తి లాక్ డౌన్ అమలులో ఉంటుంది. ఎంట్రీ మరియు ఎగ్జిట్ యొక్క రెండు పాయింట్లు అవసరమైన మరియు వైద్య సేవలకు మాత్రమే తెరిచి ఉంటాయి.
ఆరెంజ్-ఎ జోన్ మరియు ఆరెంజ్-బి జోన్లలో వరుసగా పతనమిట్ట, ఎర్నాకులం & కొల్లం, మరియు అలప్పుజ, తిరువనంతపురం, పాలక్కాడ్, త్రిస్సూర్ మరియు వయనాడ్ జిల్లాలు ఉన్నాయి. ఇక్కడ లాక్ డౌన్ ఏప్రిల్ 24 వరకు అమలులో ఉంటుంది. ఏప్రిల్ 24 తర్వాత కొన్ని నియమాలు సడలించబడతాయి.
MOST READ: త్వరలో లాంచ్ కానున్న బిఎస్ 6 సుజుకి వి-స్ట్రోమ్ 650 XT బైక్, ఇదే
గ్రీన్ జోన్లో కొట్టాయం మరియు ఇడుక్కి ఉన్నాయి. ఇక్కడ ఏప్రిల్ 20 వరకు పూర్తి లాక్ డౌన్ అమలులో ఉంటుంది, ఆ తర్వాత కొన్ని నియమాలు సడలించబడతాయి. ఏదేమైనా అన్ని మండలాలలోనూ పెద్ద సమావేశాలు, విద్యా సంస్థలు, మతపరమైన కార్యక్రమాలు, వేడుకలు మరియు ఏ జిల్లా వెలుపల ప్రయాణించడం లాక్ డౌన్ నియమాలను సడలించిన తర్వాత కూడా అనుమతించబడదు.
రవాణా మంత్రిత్వ శాఖ ప్రైవేట్ వాహనాల కోసం బేసి మరియు సరి అనే కొత్త పథకాన్ని ప్రకటించింది. ఇది సంబంధిత లాక్ డౌన్ లను ఎత్తివేసిన తరువాత అమలులోకి వస్తుంది. బేసి సంఖ్య కలిగిన వాహనాలను సోమ, బుధ, శుక్రవారాల్లో మాత్రమే అనుమతిస్తారు. సరి సంఖ్యలతో కూడిన వాహనాలను మంగళ, గురు, శనివారాల్లో మాత్రమే అనుమతిస్తారు.
MOST READ:కరోనా లాక్డౌన్ వల్ల సైకిల్ పై స్వగ్రామం చేరిన కార్మికులు, ఎక్కడో తెలుసా..?
అవసరమైన సేవలు ఉపయోగించే వాహనాలు మాత్రమే ఆదివారాలలో, సరి లేదా బేసి సంఖ్యలతో సంబంధం లేకుండా అనుమతించబడతాయి. సోలో లేదా డిపెండెంట్లతో ప్రయాణించే మహిళలకు ఈ నిబంధనల నుండి మినహాయింపు ఉంటుంది. మరియు డ్రైవర్తో సహా ముగ్గురు వ్యక్తులను మాత్రమే కార్లలో అనుమతించబడతారు.
ఈ వ్యవస్థ వాహనాల సంఖ్యను 40 శాతం వరకు తగ్గిస్తుందని మరియు ట్రాఫిక్ను సులభతరం చేస్తుందని, పూర్తి లాక్ నుండి ‘సాధారణ స్థితికి' తేలికగా మారడానికి వీలు కల్పిస్తుందని కేరళ పోలీసులు చెబుతున్నారు.
MOST READ:ప్రసిద్ధ భారతీయుల యొక్క మొదటి కార్లు చూసారా..?
కేరళలో దాదాపు 461 మందికి కోవిడ్ -19 బారిన పడ్డారు, మరియు ప్రభుత్వం వేగంగా చర్య తీసుకోవడం మరియు రాష్ట్ర పౌరుల సహకారంతో కరోనాని కొంతవరకు అదుపులోకి తీసుకురావడం జరిగింది.
లాక్ డౌన్ నిబంధనలను సడలించడం అనేది అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చేయాల్సి ఉంటుంది, చివరికి - వ్యక్తిగత పరిస్థితులను బట్టి. కోవిడ్ -19 వైరస్ కొన్ని మండలాల్లోనే ఉందని కేరళ ప్రభుత్వం తెలిపింది. త్వరలోనే మొత్తం రాష్ట్రం అంతటా లాక్ డౌన్ సడలింపు ఖచ్చితంగా ఉంటుందని నిబంధనలను సడలించడానికి ప్రణాళిక కూడా వేసిందని తెలిపారు.