Just In
- 5 hrs ago 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- 5 hrs ago ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
- 7 hrs ago నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- 8 hrs ago సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
Don't Miss
- News కేసీఆర్కు మరో షాక్: బీఆర్ఎస్కు కడియం శ్రీహరి, కావ్య గుడ్బై, వరంగల్ కాంగ్రెస్ ఎంపీగా బరిలో
- Sports RR vs DC: రఫ్ఫాడించిన ఆవేశ్ ఖాన్.. ఓడిపోయే మ్యాచ్లో గెలిచిన రాజస్థాన్ రాయల్స్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Movies కరీనా కపూర్ పోలిటికల్ ఎంట్రీ!.. ఏ పార్టీలో చేరి.. ఎక్కడ నుంచి పోటీ అంటే?
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే ఉపయోగించాలంటున్న ప్రభుత్వం, ఎక్కడంటే.. ?
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల వాడకం వల్ల వాయు కాలుష్యం మరియు ముడి చమురు దిగుమతుల సమస్యలు కొంతవరకు పరిష్కరించబడతాయి. అన్ని రాష్ట్రాలలోనూ ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.
ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని పెంచడంలో ఒక్కకేంద్ర ప్రభుత్వం మాత్రమే కాకుండా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చురుకుగా పనిచేస్తున్నాయి. వీటిలో కేరళ ఒకటి. కేరళ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహన విధానాన్ని 2018 లో ప్రకటించారు. దీని ప్రకారం 2022 నాటికి 10 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు రోడ్డుపైకి వస్తాయని భావిస్తోంది.
ఈ ఏడాది చివరి నాటికి కేరళ ప్రభుత్వం 2 లక్షల ఎలక్ట్రిక్ బైక్లు, 50 వేల ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలు, 3000 ఎలక్ట్రిక్ బస్సులు, 100 ఎలక్ట్రిక్ ప్యాసింజర్ బోట్లను అంతే కాకుండా ఇతరత్రా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టటమే లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ నేపథ్యంలో భాగంగా వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి ప్రభుత్వ విభాగాలకు వాహనాల కొనుగోలు మరియు అద్దెకు ఇచ్చే పథకంలో కేరళ ప్రభుత్వం పెద్ద మార్పు చేసింది. ప్రభుత్వ విభాగాలలో పనిచేస్తున్న ఆఫీసర్స్ ఇప్పుడు ఉపయోగిస్తున్న అన్ని పెట్రోల్ మరియు డీజిల్ వాహనాలను మూసివేయాలని నిర్ణయించింది.
పెట్రోల్ మరియు డీజిల్ వాహనాలకు బదులుగా ఎలక్ట్రిక్ కార్లను ఉపయోగించాలని వారు యోచిస్తున్నారు. ఈ విషయాన్ని ఆర్థిక శాఖ మార్చి 7 న ప్రకటించింది. దీని ప్రకారం ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ అన్ని ప్రభుత్వ విభాగాలను ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే అద్దెకు ఇవ్వాలని కూడా ఆదేశించింది.
ఏప్రిల్ 1 నుండి పెట్రోల్, డీజిల్ వాహనాలకు బదులుగా ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించాలని రాష్ట్ర వివిధ శాఖల అధిపతులను ఆదేశించారు.
ఇప్పుడు వాహనాలను కొనడం కంటే లీజుకు తీసుకోవాలని నిర్ణయించారు. ఇందులో వచ్చే నష్టాలను తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇఇఎస్ఎల్ నుండి ఎలక్ట్రిక్ కార్లను అద్దెకు తీసుకోగలిగితే, ప్రభుత్వం ప్రతి 1,000 కార్లకు రూ .7.50 కోట్లు ఆదా చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ వాహనాలు పర్యావరణానికి కూడా చాలా అనుకూలమైనవి.
భారతదేశంలో ఢిల్లీతో సహా చాలా నగరాలు వాయు కాలుష్య సమస్యను ఎదుర్కొంటున్నాయి. వాయు కాలుష్యానికి ప్రధాన కారణం పెట్రోల్, డీజిల్ వాహనాలు. అంతే కాకుండా అదనంగా ముడి చమురు దిగుమతుల కోసం భారత్ ప్రతి ఏటా భారీగా ఖర్చు చేస్తోంది.
వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి మరియు ముడిచమురు దిగుమతులను తగ్గించడానికి భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహిస్తున్నారు. భారతదేశంలోని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనిని ప్రోత్సహిస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల వల్ల పర్యావరణం కాలుష్యం కాకుండా ఉంటుంది. ఎందుకంటే వీటికి కర్బనాల యొక్క వినియోగం ఉండదు కాబట్టి, భారతదేశం పర్యావరణ హితంగా ఉండటానికి ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
గమనిక: ఈ చిత్రాలు సూచన కోసం మాత్రమే.