Just In
- 17 hrs ago వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- 17 hrs ago వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- 18 hrs ago 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- 19 hrs ago 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
Don't Miss
- News రాహుల్ సహా నేడు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్న కీలక నేతలు వీరే..
- Movies Brahmamudi April 26th episode: నా కూతురుకు అడ్డుకొనే పరిస్థితి రానివ్వను.. కనకం ఫైర్
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
లెక్సస్ ఇండియా వినియోగదారులకి గుడ్ న్యూస్, అదేంటో తెలుసా..?
కరోనా మహమ్మారి ప్రపంచదేశాలన్నింటిని పట్టి పీడిస్తోంది. ఈ వైరస్ నివారణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కఠినమైన చర్యలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వానికి మద్దతుగా చాలా ఆటో పరిశ్రమలు ప్రభుత్వంతో చేతులు కలిపాయి. అంతే కాకుండా చాలా కంపెనీలు తమ వినియోగదారులకు అనేక విధాలుగా సహాయం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో లెక్సస్ కంపెనీ కూడా ఒక అడుగు ముందుకు వేసింది.
లెక్సస్ ఇండియా విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం తమ వినియోగదారుల వాహనాల యొక్క వారంటీని పొడిగించడమే కాకుండా సర్వీస్ టైం ని కూడా పొడిగించినట్లు తెలిపింది. కరోనా లాక్ డౌన్ కారణంగా సర్వీస్ చేయలేని వినియోగదారులకు ఇది ప్రయోజనం చేకూరుస్తుంది. అదనంగా వారంటీ వ్యవధిని కూడా పొడిగించబడింది.
లెక్సస్ ఇండియా యొక్క సర్వీస్ టైమ్ ని మే 31 వరకు పొడిగిస్తామని ప్రకటించింది. అంతే కాకుండా లాక్ డౌన్ సమయంలో గడువు ముగిసే కస్టమర్ల కోసం ఈ వ్యవధి వచ్చే నెల చివరి వరకు పొడిగించబడుతుంది.
MOST READ:కొత్త డిజైన్తో రానున్న టయోటా యారిస్ క్రాస్ ఎస్యువి
ఈ కాలంలో వినియోగదారులకు సర్వీస్ చేయాలని డీలర్లను లెక్సస్ కోరారు. ఇతర కంపెనీల మాదిరిగానే లెక్సస్ కూడా తన వినియోగదారులకు సహాయం చేస్తోంది. మిగతా కంపెనీలు కూడా తమ డీలర్లకు పరిహారం చెల్లించాయి.
లెక్సస్ ఇండియా దీనికి సంబంధించిన ఈ సమాచారాన్ని తన అధికారిక వెబ్సైట్లో విడుదల చేసింది. వినియోగదారులు తమ సమీప డీలర్లను సందర్శించడం ద్వారా దీని గురించి సమాచారం పొందవచ్చు. సంక్షోభం సంభవించినప్పుడు లెక్సస్ తన వినియోగదారులకు అన్ని విధాలుగా సహాయం చేయనున్నట్లు ప్రకటించింది.
MOST READ:భారత ప్రభుత్వానికి మద్దతుగా టాటా మోటార్స్, ఏం చేసిందంటే ?
కంపెనీ వినియోగదారులకు తమ మొదటి ప్రాధాన్యత ఇస్తామని తెలిపింది. ప్రస్తుతానికి వినియోగదారులకు అవసరమైన అన్ని సహాయ సహకారాలను అందిస్తామని కంపెనీ ప్రకటించింది. కోవిడ్ -19 విషయంలో అన్ని కార్ల కంపెనీలు తమ వినియోగదారులకు సహాయం చేయడానికి ముందుకు వస్తున్నాయి.
లెక్సస్ ఇండియా ఈ ఏడాది ప్రారంభంలో భారత్ లెక్సస్ ఎల్సి 500 హెచ్ కారును ఆవిష్కరించింది. ఇది కంపెనీ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనం. లెక్సస్ సంస్థ ఇప్పుడు హైబ్రిడ్ వాహనాల ఉత్పత్తిపై దృష్టి పెట్టింది.
MOST READ:లారా దత్త రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ నడపడం చూసారా ?
కరోనా కారణంగా ప్రస్తుతం వాహనాల ఉత్పత్తి నిలిపివేయబడింది. ఉత్పత్తిని ప్రారంభించడానికి కంపెనీలకు పాక్షికంగా అనుమతి ఉంది. లాక్ డౌన్ పూర్తిగా తొలగించబడిన తరువాత వాహనాల ఉత్పత్తి తిరిగి ప్రారంభిస్తామని కూడా తెలిపింది. కరోనా వైరస్ రోజు రోజుకి విస్తరిస్తున్న కారణంగా బహుశా ఈ లాక్ డౌన్ ఇంకా కొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉన్నట్లు మనకు కనిపిస్తోంది.