Just In
- 3 hrs ago 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- 4 hrs ago ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
- 5 hrs ago నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- 6 hrs ago సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
Don't Miss
- News బీఆర్ఎస్కు భారీ షాక్: ఎంపీ కే కేశవరావు, మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్లోకి
- Sports RR vs DC: రియాన్ పరాగ్ విధ్వంసం.. 6 బంతుల్లో 5 బౌండరీలు!
- Movies కరీనా కపూర్ పోలిటికల్ ఎంట్రీ!.. ఏ పార్టీలో చేరి.. ఎక్కడ నుంచి పోటీ అంటే?
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
రాపిడ్ రెస్పాన్స్ మొబైల్ లాబొరేటరీ ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం, ఎందుకంటే ?
భారతదేశంలో కరోనా వైరస్ రోజు రోజుకి ఎక్కువవుతున్న కారణంగా ప్రతిరోజూ నిర్వహించే పరీక్షల సంఖ్యను మరింత పెంచే ప్రయత్నంలో మరియు దేశంలోని ప్రతి మూలన పరీక్షలు జరిగేలా చూసేందుకు, కేంద్ర ప్రభుత్వం దేశం యొక్క మొట్టమొదటి మొబైల్ టెస్టింగ్ ల్యాబరేటరీ ప్రారంభించింది.
మొబైల్ టెస్టింగ్ లాబొరేటరీ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ ఢిల్లీ నుండి ప్రారంభం చేసారు. రాపిడ్ రెస్పాన్స్ మొబైల్ లాబొరేటరీ బయోటెక్నాలజీ విభాగం, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, వైజాగ్ ఆధారిత ఆంధ్రప్రదేశ్ మెడ్టెక్ జోన్ - వైద్య పరికరాల దేశీయ తయారీని ప్రోత్సహించే సంస్థల మధ్య సహకారం యొక్క ఫలితంగా ఇది ప్రారంభమయింది.
ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ లాబొరేటరీ కేవలం ఎనిమిది రోజులలో నిర్మించబడింది. ఈ లాబొరేటరీ ఒక్క కోవిడ్ -19 వైరస్ టెస్ట్ మాత్రమే కాకుండా టిబి మరియు హెచ్ఐవి పరీక్షలు చేయటానికి ఇది అమర్చబడింది. కోవిడ్-19 పరిస్థితి పూర్తిగా రూపు మాపిన తరువాత ఇతర వ్యాధులు మరియు వైరస్ టెస్ట్ కోసం పరీక్షించడానికి మొబైల్ యూనిట్ను ఉపయోగించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
MOST READ:ఇండియాలో కార్ కేర్ ప్రొడక్ట్ లాంచ్ చేసిన టర్టల్ వాక్స్
ఈ మొబైల్ లాబొరేటరీ 200 ఇతర పరీక్షలతో పాటు, ఒకేసారి 60 కోవిడ్ -19 పరీక్షలను నిర్వహించగలదు. ఎనిమిది గంటల వ్యవధిలో దాని ఉత్పత్తి సామర్థ్యాన్ని 500 పరీక్షలకు రెట్టింపు చేసే రెండు సెట్ల యంత్రాలు కూడా ఇందులో నిక్షిప్తమై ఉన్నాయి.
నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లాబొరేటరీస్ (ఎన్ఎబిఎల్) ధ్రువీకరణ ప్రకారం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం రాపిడ్ రెస్పాన్స్ మొబైల్ లాబొరేటరీని ఉత్పత్తి చేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
MOST READ:RTO వాహన రిజిస్ట్రేషన్లను రీస్టార్ట్, ఎక్కడో తెలుసా !
డాక్టర్ హర్ష్ వర్ధన్ దీని గురించి మాట్లాడుతూ మొత్తం 50 మొబైల్ లాబొరేటరీ సదుపాయాలు తయారు చేయబడతాయి మరియు కోవిడ్-19 పరీక్ష మరియు చికిత్సలను వేగవంతం చేయడానికి దేశంలోని మారుమూల ప్రాంతాలలో ఈ వెహికల్స్ ఉపయోగించబడతాయి.
ఈ వాహనాలు ఒక్క వైద్య పరీక్షలకు మాత్రమే కాకుండా వస్తువుల రైళ్లలో ఎక్కించటానికి బలంగా కూడా నిర్మించబడింది. తద్వారా ఇది దేశవ్యాప్తంగా ఎక్కడైనా ఉపయోగించబడుతుంది. ఈ విధంగా ఉపయోగించడానికి ఈ వాహనం దృఢంగా తయారుచేయబడింది.
MOST READ:కొత్తగా కనిపిస్తున్న మూడు కార్లు కలయికతో తయారయిన కొత్త కారు
రాపిడ్ రెస్పాన్స్ మొబైల్ లాబొరేటరీ గురించి డ్రైవ్స్పార్క్ ఆలోచనలు :
కరోనా వైరస్ నివారణకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన మంచి చొరవ. ఇప్పుడు దేశానికి మెరుగైన, సమర్థవంతమైన టెస్టులు చాలా అవసరం. ఈ పరీక్షలు రాపిడ్ రెస్పాన్స్ మొబైల్ లాబొరేటరీ సహాయపడుతుందని భావిస్తున్నారు.