Just In
- 1 hr ago త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- 4 hrs ago హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- 6 hrs ago JNCAP క్రాష్ టెస్ట్లో అదరగొట్టిన స్విఫ్ట్.. స్కోర్ ఎంతో తెలుసా?
- 6 hrs ago కొత్త మారుతి స్విఫ్ట్ బుకింగ్ ప్రైస్ ఎంతో తెలుసా? ఇక్కడ చూడండి!
Don't Miss
- Movies పిఠాపురంలో బెట్టింగుల జోరు.. పవన్ కల్యాణ్పై కాయ్ రాజా కాయ్.. కోట్లలో పందాలు!
- News వాళ్ళను తిడుతూనే.. వైఎస్ జగన్, భారతి వద్ద కోట్లలో వైఎస్ షర్మిలమ్మ అప్పులచిట్టా ఇదే!!
- Sports SRH vs RCB ఉప్పల్ మ్యాచ్కు భారీ అడ్డంకి..!
- Lifestyle నిమ్మరసంతో ఇన్ని ప్రయోజనాలాా..? కిడ్నీలో రాళ్లు కూడా మాయం, ఇంకా ఎన్నో..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
కరోనా నివారణలో భాగంగా ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన మహీంద్రా
భారతదేశంలో ప్రసిద్ధి చెందిన ఆటో దిగ్గజం మహీంద్రా & మహీంద్రా దేశంలో COVID-19 కి వ్యతిరేకంగా పోరాటానికి మద్దతు ఇస్తున్న కామపెనీలలో ముందున్న వారిలో ఒకరు. కరోనా లాక్ డౌన్ ప్రారంభమైనప్పటి నుండి కరోనా వైరస్ మహమ్మారిపై పోరాడటానికి మహీంద్రా కేంద్ర మరియు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు అన్ని రకాలుగా మద్దతు ఇస్తుంది.
దేశవ్యాప్తంగా వెంటిలేటర్లు మరియు ఇతర పిపిఇ పరికరాల ఉత్పత్తి మరియు పంపిణీని పెంచడానికి సంస్థ వివిధ ఇతర సంస్థలతో కలిసి పనిచేస్తోంది. మహీంద్రా కంపెనీ ఫేస్ మాస్క్లు, ఫేస్ షీల్డ్స్ మరియు ఏరోసోల్ బాక్స్ల వంటి వాటిని వైద్య నిపుణులు మరియు ఆరోగ్య సంరక్షణ అధికారులకు పంపిణీ చేస్తోంది. మహీంద్రా కూడా పేదవారికి వివిధ ప్రదేశాలలో నిరాశ్రయులకు మరియు వలస కూలీలకు ఫుడ్ ప్యాకెట్లను కూడా విరాళంగా ఇచ్చారు.
మహీంద్రా కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ పవన్ గోయెంకా ఇటీవల తన సహచరుల కృషికి ఫలితంగా వారిని మహీంద్రా యొక్క COVID-19 యోధులు అని పిలిచారు. గత మూడు నెలల్లో 4 లక్షల ఫేస్ షీల్డ్స్, 12 లక్షల ఫేస్ మాస్క్లు మరియు 600 కి పైగా ఏరోసోల్ బాక్సులతో పాటు, అవసరమైన వారికి 2.5 లక్షల భోజనం పంపిణీ చేయగలిగింది.
MOST READ:డామినార్ 250 బైక్ టివిసి విడుదల చేసిన బజాజ్ ఆటో
ఇటీవల మహీంద్రా 12 మొబైల్ అంబులెన్స్లను మహారాష్ట్రలోని ముంబై నగరంలో కరోనా బాధితుల సేవలకు అందించింది. COVID-19 రోగులు చికిత్స మరియు వైద్య సదుపాయాలను వేగంగా పొందగలిగేలా కొత్త మహీంద్రా సుప్రో అంబులెన్స్లను రాష్ట్రంలో పంపిణీ చేసింది. ఈ ఆంబులెన్సుల ద్వారా వేగవంతమైన వైద్య సేవలు అందించగలుగుతున్నారు.
ఈ అంబులెన్స్లను ఆదిత్య ఠాక్రేకు అందజేశారు. మహీంద్రా భారత మార్కెట్లో సుప్రో అంబులెన్స్ను లాంచ్ చేయడానికి కూడా ముందడుగు వేసింది. మొదటి బ్యాచ్ అంబులెన్సులను మహారాష్ట్రలో ఇప్పటికే పంపిణీ చేయడం జరిగింది.
MOST READ:భారత్ & చైనా వివాదం : ఆలస్యమైన హైమా బర్డ్ ఎలక్ట్రిక్ వెహికల్ లాంచ్
మహీంద్రా కంపెనీకి సంబంధించిన ఇతర నివేదికల ప్రకారం మహీంద్రా ఎక్స్యువి 500, స్కార్పియో మరియు థార్ ఎస్యూవీల విడుదల తేదీలను ధృవీకరించింది. కొత్త తరం థార్ ఈ ఏడాది చివర్లో లాంచ్ అవుతుందని, తరువాత తరం ఎక్స్యూవీ 500, స్కార్పియో వంటివి వచ్చే ఆర్థిక సంవత్సరంలో విక్రయించబడే అవకాశం ఉందని కంపెనీ తెలిపింది.
కొత్త మహీంద్రా థార్ కరోనా లాక్ డౌన్ ముగిసిన వెంటనే అమ్మకాలు జరపనున్నట్లు భావించవచ్చు. ఏదేమైనా COVID-19 మహమ్మారి మరియు పొడిగించిన లాక్ డౌన్ నిబంధనల మధ్య మహీంద్రా టెస్ట్ తరువాతి తేదీకి వాయిదా వేయాలని నిర్ణయించుకుంది.
MOST READ:హ్యుందాయ్ కంపెనీ ఫస్ట్ మినీ ఎలక్ట్రిక్ బస్
డ్రైవ్స్పార్క్ అభిప్రాయం:
దేశంలో కరోనా మహమ్మారిపై పోరాడటానికి కేంద్ర మరియు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు మద్దతు ఇవ్వడంలో మహీంద్రా కంపెనీ చాలా కృషి చేస్తోంది. ఈ కంపెనీ పేస్ మాస్కులు, పేస్ షీల్డ్ లు వంటి వాటిని అందించడమే కాకుండా వైద్య సేవలను మరింత త్వరితగతిన జరపడానికి మహీంద్రా అంబులెన్సులు కూడా అందించింది. ఏది ఏమైనా కరోనా మహమ్మారి సమయంలో మహీంద్రా కంపెనీ తన మద్దతు తెలిపి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు అండగా నిలిచింది.