కరోనా ఎఫెక్ట్ : భారీ నష్టాల్లో మహీంద్రా

దేశీయ మార్కెట్లో ప్రసిద్ధి చెందిన వాహన తయారీ సంస్థ మహీంద్రా వెహికల్ మానుఫ్యాక్చరర్స్ లిమిటెడ్ ఈ ఏడాది నాలుగో త్రైమాసికంలో దాదాపు 3,255 కోట్ల రూపాయల ఆర్థిక నష్టాన్ని నమోదు చేసింది. గత ఏడాది ఇదే సమయంలో బ్రాండ్ యొక్క ఆర్ధికవ్యవస్థ రూ. 969 కోట్ల లాభాలను నమోదు చేసింది.

కరోనా ఎఫెక్ట్ : భారీ నష్టాల్లో మహీంద్రా కంపెనీ

2020 ఆర్థిక సంవత్సరం కంపెనీ మొత్తం ఆదాయం కూడా 35 శాతం వరకు క్షీణించింది. ఇది 2019 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలోని 13,808 కోట్ల రూపాయల నుండి 9,005 కోట్లకు పడిపోయింది.

కరోనా ఎఫెక్ట్ : భారీ నష్టాల్లో మహీంద్రా కంపెనీ

2020 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో మహీంద్రా & మహీంద్రా యొక్క నష్టాలు రూ. 2,502.42 కోట్లు. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో కంపెనీ 849 కోట్ల రూపాయల లాభాలను నమోదు చేసినట్లు కూడా కంపెనీ ప్రస్తావించింది.

కరోనా ఎఫెక్ట్ : భారీ నష్టాల్లో మహీంద్రా కంపెనీ

మహీంద్రా కార్ల తయారీ కార్యకలాపాల వల్ల 2020 జనవరి మరియు మార్చి మధ్య మొత్తం ఆదాయం 9,458.43 కోట్ల రూపాయలుగా నమోదు చేశాయి. అంతే కాకుండా మహీంద్రా 2020 జనవరి మరియు మార్చి మధ్య కార్ల అమ్మకాలలో 47 శాతం క్షీణించింది. ఈ సమయంలో కార్ల అమ్మకాలు 86,351 యూనిట్లుగా ఉన్నాయి.

కరోనా ఎఫెక్ట్ : భారీ నష్టాల్లో మహీంద్రా కంపెనీ

మహీంద్రా యొక్క ఎగుమతులు కూడా ఈ సమయంలో 57 శాతం తగ్గాయి. 2020 జనవరి, మార్చి మధ్య మహీంద్రా వాహనాల ఎగుమతులు 13,541 యూనిట్ల నుంచి 5,700 కు తగ్గాయి. కానీ ట్రాక్టర్ అమ్మకాలు మాత్రం ఇదే కాలంలో 0.45 శాతం స్వల్ప వృద్ధిని నమోదు చేయగలిగాయి.

కరోనా ఎఫెక్ట్ : భారీ నష్టాల్లో మహీంద్రా కంపెనీ

మహీంద్రా మరియు మహీంద్రా కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ పవన్ గోయెంకా మాట్లాడుతూ పరిశ్రమలో నా 41 సంవత్సరాలలో, గత 3 నెలల్లో జరిగిన తగ్గుదల మునుపెన్నడూ చూడలేదని తెలిపాడు. కరోనా వైరస్ ప్రభావం వల్ల సంస్థ యొక్క పనితీరును బాగా తగ్గిపోయింది. ఈ తగ్గుదలకు కరోనా లాక్ డౌన్ కూడా ప్రధాన కారణం అయిందన్నారు.

కరోనా ఎఫెక్ట్ : భారీ నష్టాల్లో మహీంద్రా కంపెనీ

మహీంద్రా ఆర్థిక ఫలితాల గురించి డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం :

కరోనా వైరస్ మరియు భారత్ లాక్ డౌన్ మహీంద్రా & మహీంద్రా కంపెనీపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఇది 2020 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో కంపెనీకి భారీ నష్టాన్ని కలిగించింది. మహీంద్రా కంపెనీ పొందిన ఆర్ధిక నష్టాన్ని తిరిగి పొందటానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది.

More from DriveSpark

Article Published On: Saturday, June 13, 2020, 15:10 [IST]
English summary
COVID-19 Pandemic: Mahindra Registers A Loss Worth Rs 3,255 Crore In Q4 Of FY2020. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+