మహీంద్రా సుప్రో అంబులెన్స్ : ధర & ఇతర వివరాలు
దేశీయ మార్కెట్లో ప్రసిద్ధి చెందిన మహీంద్రా కంపెనీ బిఎస్ 6 సుప్రో అంబులెన్స్ను భారత మార్కెట్లో విడుదల చేసింది. కొత్త మహీంద్రా సుప్రో అంబులెన్స్ను ఎల్ఎక్స్, జెడ్ఎక్స్ అనే రెండు వేరియంట్లలో అందిస్తున్నారు. దీని ధర రూ. 6.94 లక్షలు (ఎక్స్-షోరూమ్,ముంబై).

మహీంద్రా అంబులెన్స్ మహీంద్రా బ్రాండ్ యొక్క వాణిజ్య వాహన శ్రేణి నుండి బిఎస్-6 కంప్లైంట్ సుప్రో వ్యాన్ ఆధారంగా రూపొందించబడింది. సుప్రో ఇప్పుడు మంచి బాడీ స్టైల్ మరియు ఇంజిన్ ఎంపికలను కలిగి ఉంది. ఇది ప్రస్తుతం వివిధ అవసరాలకు ఉపయోగపడుతుంది.

మహీంద్రా సుప్రో అంబులెన్స్ యొక్క మొదటి బ్యాచ్ మహారాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవల కరోనా నివారణలో భాగంగా అందించడం జరిగింది. ఇది కరోనా నివారణకు ప్రత్యేకంగా తయారు చేయబడింది. కోవిడ్-19 మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడటానికి రాష్ట్రంలో అంబులెన్స్ల అవసరాన్ని తీర్చడానికి ఉత్పత్తిని వేగవంతం చేయాలని ప్రభుత్వం మహీంద్రాను అభ్యర్థించింది.

మహీంద్రా సుప్రో అంబులెన్స్ అన్ని అవసరమైన వైద్య పరికరాలతో వస్తుంది. ఇందులో ఫోల్డబుల్ స్ట్రెచర్, మెడికల్ కిట్ బాక్స్, ఆక్సిజన్ సిలిండర్, ఫ్లేమ్-రెసిస్టెంట్ ఇంటీరియర్స్, ఇంటర్నల్ లైటింగ్ వంటివి ఇందులో ఉన్నాయి. సుప్రో అంబులెన్స్ యొక్క వెలుపలి భాగంలో ఏఐఎస్ 125 సర్టిఫైడ్ రెట్రో-రిఫ్లెక్టివ్ డెకాల్స్, ఫ్రాస్ట్డ్ విండోస్, సైరన్ మరియు బెకన్ లైట్ వంటివి ఉన్నాయి.

మహీంద్రా సుప్రో అంబులెన్స్ రెండు సిలిండర్ల బిఎస్ 6-డీజిల్ ఇంజిన్తో పనిచేస్తుంది. ఇది 47 బిహెచ్పి మరియు 100 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. సుప్రో అంబులెన్స్ 3798 మిమీ పొడవు, 1540 మిమీ వెడల్పు మరియు 1922 మిమీ ఎత్తును కలిగి ఉంటుంది. ఇది ట్రాఫిక్ మరియు భారతీయ రహదారి పరిస్థితులకు అనుకూలంగా తయారుచేయబడి ఉంటుంది.

ఎం అండ్ ఎం లిమిటెడ్, ఆటోమోటివ్ డివిజన్ సిఇఒ వీజయ్ నక్రా మాట్లాడుతూ, శ్రద్ధగల మరియు బాధ్యతాయుతమైన కార్పొరేట్ సంస్థగా మహీంద్రా వారి జీవితాలలో సానుకూల మార్పులను కలిగించడం ద్వారా ప్రజలను ఎదగాలని కోరుకుంటుంది. ప్రజలను సురక్షితంగా తరలించడానికి వైద్య సంరక్షకులకు మద్దతుగా సుప్రో అంబులెన్స్ ప్రారంభించడం ఈ విధానానికి స్పష్టమైన సాక్ష్యం.

అంతే కాకుండా మహీంద్రా కంపెనీ ఫేస్ షీల్డ్స్, వెంటిలేటర్లు మరియు శానిటైజర్ల తయారీతో కరోనా నివారణలో భాగంగా కంపెనీ మరో అడుగు ముందుకు వేసింది. మహారాష్ట్ర ప్రభుత్వం మహమ్మారిపై పోరాడటానికి వారు చేసిన ప్రయత్నాలలో భాగస్వామ్యం కావడం మాకు చాలా ఆనందంగా ఉంది. మొదటి బ్యాచ్ 12 వాహనాలను రికార్డు సమయంలో ఉత్పత్తి చేసి ఇప్పటికే వారికి పంపిణీ చేయడం జరిగింది.

అనేక ఇతర ప్రభుత్వ సంస్థలు, ఎన్జిఓలు మరియు కార్పొరేట్లు కూడా సుప్రో అంబులెన్స్ను సేకరించడానికి చురుకైన ఆసక్తిని కనబరిచాయి. అందువల్ల పెరుగుతున్న ఈ డిమాండ్ను జోడించే సామర్థ్యాన్ని మేము త్వరగా పెంచుతున్నాము. ఇది అవసరమైన అన్ని పరికరాలతో అమర్చబడి త్వరలో తయారుచేసి అందించడానికి కావలసిన అన్ని ఏర్పాట్లను చేస్తామన్నారు.

మహీంద్రా సుప్రో అంబులెన్స్ గురించి డ్రైవ్స్పార్క్ అభిప్రాయం :
దేశంలో కరోనా మహమ్మారిపై పోరాడటానికి చాలా కంపెనీలు ముందడుగు వేసాయి. ఈ విధంగా మద్దతు అందించే విషయంలో మహీంద్రా ముందు వరుసలో ఉంది. సుప్రో అంబులెన్స్ పరిచయం అనేది మహీంద్రా కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడానికి వేసిన మరో ముందడుగు అనే చెప్పాలి.


Click it and Unblock the Notifications








