డీలర్స్ వద్దకు రానున్న కొత్త బిఎస్ VI మహీంద్రా ఎక్స్యూవీ 500
భారతదేశంలో ప్రసిద్ధి చెందిన వాహనతయారీదారు అయిన మహీంద్రా ఇటీవల తన బిఎస్-6 ఎక్స్యు 500 ఎస్యూవీని భారతీయ మార్కెట్లో విడుదల చేసింది. కొత్త మహీంద్రా ఎక్స్యూవీ 500 ఎస్యూవీ యొక్క ప్రారంభ ధర భారతదేశంలో రూ. 3.20 లక్షలు. కొత్త ఎస్యూవీ గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

కొత్త మహీంద్రా ఎస్యూవీ దేశవ్యాప్తంగా డీలర్లకు రవాణా చేయబడుతున్నాయి. ఈ ఎస్యూవీ యూనిట్లు వచ్చే జూన్లో డీలర్షిప్కు వచ్చే అవకాశం ఉంది. మొదటి దశలో 55 కార్లను మాత్రమే కేటాయించారు. ఎక్స్యూవీ 500 ఉత్పత్తి త్వరలో తిరిగి ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. ఈ ఎస్యూవీని దశలవారీగా డీలర్లకు అందించాలని కంపెనీ భావిస్తోంది.

భారతీయ మార్కెట్లో మహీంద్రా ఇటీవల ఈ ఎస్యూవీ కోసం బుకింగ్ను అధికారికంగా ప్రారంభించింది. ఈ బిఎస్ 6 ఎక్స్యూవీ 500 ఎస్యూవీ రూ. 5 వేల ధరతో బుక్ చేసుకోవచ్చు.

కొత్త మహీంద్రా ఎక్స్యూవీ 500 ఎస్యూవీ నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. అవి డబ్ల్యూ 5, డబ్ల్యూ 7, డబ్ల్యూ 9, డబ్ల్యూ 11 (ఓ) అనే వేరియంట్లు. కొత్త మహీంద్రా ఎక్స్యూవీ 500 ఎస్యూవీ ధర రూ. 17.70 లక్షలు.

2020 మహీంద్రా ఎక్స్యూవీ 500 ఎస్యూవీ ఇంజన్ బిఎస్-6 ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా నవీకరించబడింది. కొత్త ఎక్స్యూవీ 500 ఎస్యూవీలో 2.2 లీటర్ ఎంహెచ్ఓసి డీజిల్ ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ 155 బిహెచ్పి పవర్ మరియు 360 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ సిక్స్-స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్తో అమర్చబడి ఉంటుంది.

2020 మహీంద్రా ఎక్స్యూవీ 500 ఎస్యూవీ డిజైన్లో ఎటువంటి మార్పులు లేవు. కొత్త ఎస్యూవీలో గ్రిల్ క్రోమ్, స్ప్లిట్ టెయిల్ లైట్లు, ఎల్ఈడీ డిఆర్ఎల్, ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్, ట్విన్ ఎగ్జాస్ట్, రియర్ స్పాయిలర్ మరియు స్టైలిష్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్ ఉన్నాయి. కాస్ట్లీ లెదర్, అప్హోల్స్టరీ, ఆపిల్ కార్ ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోలతో 2020 మహీంద్రా ఎక్స్యూవీ 500 ఎస్యూవీ లార్జ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి.

భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన ఎస్యూవీలలో కొత్త మహీంద్రా ఎక్స్యూవీ 500 ఒకటి. ఈ కొత్త ఎస్యూవీ ఇండియన్ మార్కెట్లో కియా సెల్లోస్, టాటా హారియర్, ఎంజి హెక్టర్, హ్యుందాయ్ క్రెటా, జీప్ కంపాస్ మరియు ఫాక్స్ వాగన్ టి-రాక్ ఎస్యూవీలకు ప్రత్యర్థిగా ఉంటుంది.


Click it and Unblock the Notifications








