37 సంవత్సరాల క్రితం ఇందిరాగాంధీ అందజేసిన మొదటి మారుతి 800 కారు ఇదే, చూసారా..!
భారత మార్కెట్లో మారుతి సుజుకి మంచి అమ్మకాలను చేపడుతోంది. మారుతి సుజుకి కంపెనీ యొక్క మారుతి 800 దేశంలో అత్యధికంగా అమ్ముడైన కారు. అంతే కాదు భారత మార్కెట్ ఐకానిక్ కారుగా పరిగణించబడుతుంది. ఈ మారుతి 800 కారు యొక్క మొదటి 'కీ' ని భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 37 సంవత్సరాల క్రితం అందజేశారు.

మారుతి 800 ను 37 సంవత్సరాల క్రితం భారత మార్కెట్లో ప్రవేశపెట్టారు, ఆ తర్వాత 2010 వరకు దేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా ఇది కీర్తి పొందింది. 2010 తర్వాత ఈ కారుని నిలిపివేసినప్పటికీ దీని ఆధారంగా కొత్త అవతారాలు పుట్టుకొచ్చాయి. ఇప్పటికీ కంపెనీ ఈ మోడల్ను మారుతి ఆల్టో పేరుతో అమ్మడం కొనసాగిస్తోంది మరియు ప్రతి నెల దాని అమ్మకాలు బాగా కొనసాగుతున్నాయి.

మారుతి 800 యొక్క మొదటి యూనిట్ను మాజీ ప్రధాని ఇందిరా గాంధీ దేశ రాజధాని నగరం ఢిల్లీ చెందిన హర్పాల్ సింగ్కు అందజేశారు. అతను ఈ కారును 2010 వరకు అలాగే ఉంచాడు, ఆ తరువాత అది తొమ్మిది సంవత్సరాలుగా నిరుపయోగంగా పడిఉంది. తరువాత కాలంలో ఇది మళ్ళీ పునరుద్ధరించబడింది.

గత సంవత్సరం మారుతి సుజుకి యొక్క అధీకృత డీలర్షిప్లో ఇది గుర్తించబడింది. అయితే, హర్పాల్ సింగ్ కుటుంబం ఈ కారును ఎందుకు విడిచిపెట్టిందో దానికి సంబంధించిన ఖచ్చితమైన వివరాలు తెలియవు. పునరుద్ధరణ సమయంలో, పాత భాగాల కారణంగా ఇందులో చాలా సమస్యలు ఉన్నాయి.

ప్రస్తుతం, మారుతి 800 ఆల్టోగా కొత్త రూపంలో అమ్ముడవుతోంది. మారుతి ఆల్టో దేశం యొక్క ఎంట్రీ లెవెల్ హ్యాచ్బ్యాక్ మరియు గత రెండు దశాబ్దాలుగా ఇది దేశీయ మార్కెట్లో అమ్మబడుతోంది. ఇది ప్రతి సంవత్సరం మంచి అమ్మకాలను చేపడుతోంది. అంతే కాకుండా ఇది మనషి అమ్మకాలను సాధిస్తున్న వాహనాల జాబితాలో ఒకటిగా ఉంది.

ఇప్పటివరకు, మారుతి సుజుకి తన ఆల్టో కారుని దాదాపు 40 లక్షల యూనిట్లను విక్రయించింది. మారుతి ఆల్టో ఇప్పటికీ మొదటిసారి కారు కొనుగోలు చేసే వాహనదారుల యొక్క మొదటి ఎంపిక అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. గత 20 ఏళ్లలో కంపెనీ ఈ కారుకు అనేక నవీకరణలను ఇచ్చింది మరియు అనేక ఫీచర్లు మరియు పరికరాలు ఇవ్వబడ్డాయి. దీనితో పాటు అనేక సేఫ్టీ ఫీచర్స్ కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి.

ఈ కారు గత 16 సంవత్సరాలుగా భారతదేశంలో నెంబర్ వన్ కారుగా నిలిచింది. ఇది 2000 లో ప్రారంభించబడి 2004 లో అంటే నాలుగు సంవత్సరాలలోనే మొదటి స్థానంలో నిలిచింది. నాలుగు సంవత్సరాల తరువాత, ఈ కారు 2008 లో 1 మిలియన్ యూనిట్ల మార్కును దాటింది.

మారుతి ఆల్టో దేశంలో మొట్టమొదటి బిఎస్ 6 ఎంట్రీ లెవల్ కారు మరియు ఇది లీటరుకు 22.05 కిమీ మైలేజీని ఇస్తుంది. ఇది సిఎన్జి ఆప్షన్లో కూడా లభిస్తుంది. CNG అప్సన్ ఇది 31.56 కిమీ మైలేజీని ఇస్తుంది. మారుతి ఆల్టో అరేనాను సేల్స్ నెట్వర్క్ ద్వారా 2,390 డీలర్షిప్ల ద్వారా విక్రయిస్తున్నారు. ఏది ఏమైనా మారుతి సుజుకి 800 ఒకప్పుడు సంచలనం సృష్టించిన కారు అని చెప్పవచ్చు.


Click it and Unblock the Notifications