ఆటో ఎక్స్పో 2020: ఎస్-క్రాస్ పెట్రోల్ వెర్షన్ ని ఆవిష్కరించిన మారుతి సుజుకి
ఇండియన్ మార్కెట్లో మారుతి సుజుకి వాహనాలకు మంచి డిమాండ్ ఉంది. మారుతి సుజుకి ఒక్క ఇండియాలో మాత్రమే కాదు దక్షిణ ఆసియాలోనే ప్రసిద్ధి చెందిన వాహన తయారీదారు. మారుతి సుజుకి 2020 ఆటో ఎక్స్పోలో సుజుకి ఎస్- క్రాస్ పెట్రోల్ వెర్షన్ ని ఆవిష్కరించింది. దీని గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం!

మారుతి సుజుకి ఎస్-క్రాస్ పెట్రోల్ ఆటో ఎక్స్పో 2020 లో ప్రదర్శించబడింది. సాధారణంగా మారుతీ బ్రాండ్ నుంచి ఫేస్ లిఫ్ట్ మరియు కొత్త 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ రెండింటినీ పొందిన వాటిలో వితారా బ్రెజ్జా మొదటిదైతే ఎస్-క్రాస్ రెండవ మోడల్.

ఆటో ఎక్స్పో 2020 లో ఆవిష్కరించిన తరువాత మార్చి 2020 నాటికి ఎస్-క్రాస్ మారుతి యొక్క నెక్సా షోరూమ్లకు చేరుకోవడానికి షెడ్యూల్ చేస్తున్నది. ఇది కె 15 బి పెట్రోల్ ఇంజిన్ను కూడా పొందుతుంది.

మారుతి సుజుకి విటారా బ్రెజ్జా పెట్రోల్ మాదిరిగా, ఎస్-క్రాస్ 1.5-లీటర్, నాలుగు సిలిండర్ల పెట్రోల్ ఇంజిన్ని కలిగి ఉంటుంది. ఇది 105 హెచ్పి మరియు 138 ఎన్ఎమ్ టార్క్ ని పొందుతుంది. ఇది 5- స్పీడ్ మాన్యువల్ మరియు 4- స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్బాక్స్ ఎంపికలను కూడా కలిగి ఉంటుంది.

విటారా బ్రెజ్జా కాంపాక్ట్ ఎస్యువి మాదిరిగా కాకుండా, ఎస్-క్రాస్ సౌందర్య నవీకరణతో రాదు. ఎందుకంటే మూడు సంవత్సరాల క్రితమే దీనిని నవీనీకరించడం జరిగింది. కావున ఇది మునుపటిలాగే ఉండే అవకాశం ఉంటుంది.

ఇది స్టాండర్డ్ డిజైన్ ని కలిగి ఉంటుంది. మరియు కూపే లాంటి స్టైలింగ్ తో ఉంటుంది. మారుతి ఎస్-క్రాస్ ఎస్యూవీ మధ్యతరహా విభాగంలో మంచి పోటీదారుగా ఉంది. ఇది వినియోగదారులను బాగా ఆకర్షించే విధంగా ఉండటమే కాకుండా ప్రయాణికులకు చాల అనుకూలంగా కూడా ఉంటుంది.

మారుతీ ఎస్-క్రాస్ మునుపటి మోడల్ కంటే కొంత తక్కువ ధరను కలిగి ఉండే అవకాశం ఉంది. అంటే కాకుండా ఇది బిఎస్-6 ఉద్గారా నిబంధనలకు అనుగుణంగా తయారుచేయబడి ఉంటుంది.


Click it and Unblock the Notifications








