Just In
- 12 hrs ago వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- 16 hrs ago ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- 18 hrs ago కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- 21 hrs ago 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
Don't Miss
- Sports చరిత్ర సృష్టించిన KL రాహుల్.. ధోనీ రికార్డు బ్రేక్
- News ఏపీలో తీవ్ర వడగాల్పులు: అప్రమత్తంగా ఉండక తప్పదు
- Movies Guppedantha Manasu April 20th: మహేంద్ర, అనుపమల కొడుకే మను.. దత్తత కన్ఫార్మ్.. జరక్కపోతే సూసైడే!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఉద్యోగుల కోసం గృహ నిర్మాణాలను చేపడుతున్న మారుతి సుజుకి; వివరాలు
భారతదేశంలో ప్రముఖ కార్ల తయారీదారుగా ప్రసిద్ధి చెందిన కొన్ని కంపెనీలలో మారుతి సుజుకి కూడా ఒకటి. మారుతి సుజుకి తమ ఉద్యోగుల సంక్షేమ పథకం కింద సంస్థ తన ఉద్యోగులకు గృహాలను నిర్మించింది. సంస్థ తన ఉద్యోగులకు సరసమైన, ఆధునిక గృహాలను అందించింది.
మారుతి సుజుకి పర్యావరణానికి హాని కలిగించకుండా ఈ ఇళ్లను డిజైన్ చేసింది. ఇది ఈ కొత్త ఇంటి యొక్క ప్రత్యేక లక్షణం. మారుతి సుజుకి ఈ గృహాలను హర్యానాలోని ధారుహెరాలోని తన ఉద్యోగులకు అప్పగించింది. ఈ అప్పగించే కార్యక్రమం (డిసెంబర్ 23) బుధవారం జరిగింది.
మారుతి సుజుకి తన ఉద్యోగుల కోసం 360 కి పైగా గృహాలను నిర్మిస్తోంది. ఇందులో భాగంగా మొదటి దశలో కొన్ని ఇళ్లను కంపెనీ యొక్క ఉద్యోగులకు అప్పగించారు. వీలైనంత త్వరగా మిగిలిన గృహాలను అప్పగించే ప్రక్రియ పురోగతిలో ఉంది.
MOST READ:నిజంగా ఈ బైకర్స్ అదృష్టవంతులే సుమీ.. ఎందుకో వీడియో చూడండి
మారుతి సుజుకి మొట్టమొదట 1989 లో తన ఉద్యోగుల కోసం ఒక హోసింగ్ ప్రాజెక్టును ప్రారంభించింది. ఆ సమయంలో సకర్పూర్ ప్రాంతంలో ఉద్యోగుల కోసం ఇళ్ళు నిర్మించారు. అప్పుడు 1994 లో, గురుగ్రామ్ లోని పాండ్సి ప్రాంతంలో రెండవసారి గృహాలను నిర్మించబడింది.
హర్యానాలోని ధారుహెరాలో మూడోసారి మారుతి సుజుకి ఎన్క్లేవ్ పేరుతో కొత్త ఇళ్ళు నిర్మిస్తున్నారు. ఈ కంపెనీ నిర్మించిన కొత్త గృహాలు తమ ఉద్యోగుల అవసరాలకు అనుగుణంగా నిర్మించబడ్డాయి. విశేషమేమిటంటే, ఈ ఇళ్లను మారుతి సుజుకి కంపెనీ నిర్వహిస్తుంది.
MOST READ:ఫ్యాన్సీ నెంబర్ కోసం 32 లక్షలు వేలం పాడాడు.. కానీ చివరికి ఏమైందంటే ?
ఈ గృహాలు హర్యానా రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం మరియు ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్మించబడ్డాయి. ప్రభుత్వ గృహనిర్మాణ పథకాలైన ప్రధాన్ మంత్రి ఆవాస్, దీన్ దయాల్ ఆవాస్ పథకాలు ఈ ఇళ్లకు వర్తిస్తాయి. ఇది మారుతి సుజుకి ఉద్యోగులకు సబ్సిడీ పొందటానికి వీలు కల్పిస్తుంది.
ప్రస్తుతం ఉన్న సిబ్బందికి ఇస్తున్న ఇళ్లతో మారుతి సుజుకి ఏమి చేస్తుందో తెలియదు. ఈ గృహాలు చూడటానికి చాలా లగ్జరీగా కనిపిస్తాయి. ఈ ఇళ్ళు పార్క్, ఎల్ఈడి స్ట్రీట్ లైటింగ్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, డ్రింకింగ్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ వంటి అన్ని వసతులు ఇందులో కల్పించబడ్డాయి.
ఏది ఏమైనా కంపెనీ తమ ఉద్యోగుల కోసం గృహాలను నిమించడం చాలా అరుదు. కంపెనీలు ఈ విధంగా నిర్మించడం వల్ల ఉద్యోగులకు చాలా అనుకూలంగా ఉంటుంది. దీని ప్రభుత్వాలు కూడా వీలైనంతవరకు సహకరించాలి. అప్పుడే ఇవన్నీ పూర్తిగా సాధ్యమవుతాయి.