2020 ఆటో ఎక్స్పోలో ఆవిష్కరించిన మారుతి సుజుకి జిమ్నీ
భారతదేశంలో 2020 ఆటో ఎక్స్పోలో మారుతి సుజుకి, జిమ్నీ సియెర్రా కారుని ఆవిష్కరించింది. ఈ సుజుకి జిమ్నీ గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందా!

జపాన్ తయారీదారు అయిన మారుతి సుజుకి తన జిమ్నీకారుని ఇండియన్ ఆటో ఎక్స్పోలో ప్రదర్శించింది. ఇది చూడటానికి ఆకర్షణీయంగా మాత్రమే కాకుండా ఎలాంటి ఉద్గార పరిస్థితులనైనా ఎదుర్కునే విధంగా తయారుచేయబడింది.

2018 గైకిండో ఇండోనేషియా ఇంటర్నేషనల్ ఆటో షో (జియాస్) లో సుజుకి అధికారులు కొత్త జిమ్మీని దేశీయ మార్కెట్ కోసం మరియు థాయ్లాండ్ వంటి ఆసియన్ మార్కెట్లకు ఎగుమతి చేయడానికి ఆవిష్కరించారు. 2018 లో ఆవిష్కరించిన ఈ సుజుకి జిమ్మీ ఇప్పుడు ఇండియన్ మార్కెట్ కోసం 2020 ఆటో ఎక్స్పోలో ఆవిష్కరించారు.

జపనీస్ బ్రాండ్ అయిన సుజుకి జిమ్నీ ప్రస్తుతం రెండు వేరియంట్లలో వస్తుంది. అవి ఒకటి 600 సిసి మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజిన్ కారు. రెండవది 1,500 సిసి కె 15 బి పెట్రోల్ మోటార్ ని పొందే సియెర్రా బ్యాడ్జ్ ట్రిమ్. ఇవి ఐదు-స్పీడ్ మాన్యువల్ మరియు నాలుగు-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లతో జతచేయబడతాయి.

సుజుకి జిమ్నీ సియెర్రాలో దృఢమైన బంపర్స్, క్లాడింగ్ వీల్ ఆర్చెస్ ఉంటాయి. ఇందులో టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం లేదు. కానీ దీనికి బదులుగా 2-DIN ఆడియో సిస్టం ఉంటుంది. మారుతి సుజుకి జిమ్నీ బిఎస్-6 ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది.

2020 ఆటో ఎక్స్పోలో ఈ సుజుకి జిమ్నీ ని ప్రవేశపెట్టినప్పటినుంచి దీని కోసం వాహనదారులు ఎంతో ఆసక్తిని కనపరుస్తున్నారు. ఈ కారు మార్కెట్లో గొప్ప సామర్త్యాన్ని కలిగి ఉంటుందని ఆశిస్తున్నారు.

2015 లో సుజుకి మోటార్ కార్పొరేషన్ ప్రెసిడెంట్ తోషిహిరో సుజుకి గురించి ఒక ప్రకటన చేసారు. కీ జిడోషా ఉత్పత్తులు (కీ కార్లు) మినహా, మిగిలిన అన్ని ఉత్పత్తులను ఇండియానా మార్కెట్ కోసం తెస్తామని వెల్లడించారు.

మారుతి సుజుకి జిమ్నీ కి సంబంధించి పూర్తి వివరాలు ప్రస్తుతం అందుబాటులో లేదు. జిమ్నీ ధరలు దీని ఇంజిన్ సామర్థ్యము మొదలైన వాటికి సంబంధించి కచ్చితమైన వివరణ ఇవ్వలేదు.


Click it and Unblock the Notifications








