Just In
- 1 hr ago ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- 3 hrs ago కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- 7 hrs ago 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- 9 hrs ago కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
Don't Miss
- News పవన్ ను ఆడిస్తున్న చంద్రబాబు-పెళ్ళిళ్లే కాదు సీట్లూ నాలుగే- కాకినాడలో జగన్ కామెంట్స్..!
- Sports SRH playing XI: అతనిపై వేటు..ఢిల్లీతో ఆడే తుదిజట్టు ఇదే
- Technology Lava ProWatch లావా ప్రోవాచ్ డిజైన్, ధర వివరాలు లీక్.. ఫంక్షన్ కీ సహా కీలక హెల్త్ ట్రాకర్లు..!!
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Movies Tenent Review: మర్డర్ మిస్టరీ మెప్పించిందా? సత్యం రాజేష్కు హిట్ పడిందా? టెనెంట్ రివ్యూ
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
మారుతి సుజుకి నుంచి రానున్న కొత్త ఎస్-క్రాస్ ప్లస్ లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్
భారతదేశపు నెంబర్ వన్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా, దేశీయ విపణిలో విక్రయిస్తున్న ఎస్-క్రాస్ క్రాసోవర్ మోడల్లో కంపెనీ ఓ కొత్త స్పెషల్ ఎడిషన్ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఎస్-క్రాస్ 'ప్లస్' పేరిట ఓ లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్ను విడుదల చేయనున్నారు.
కొత్త మారుతి సుజుకి ఎస్-క్రాస్ ప్లస్ లిమిటెడ్ ఎడిషన్ అక్టోబర్ 11, 2020వ తేదీ నుండి అమ్మకం కానుంది. ఈ కొత్త ప్లస్ వేరియంట్ను స్టాండర్డ్ మోడల్ యొక్క సిగ్మా వేరియంట్ను ఆధారంగా చేసుకొని తయారు చేసే ఆస్కారం ఉంది. ఎస్-క్రాస్ ప్లస్ వేరియంట్లో 7 ఇంచ్ టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ను కలిగి ఉంటుంది, ఇది ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ప్లేను సపోర్ట్ చేస్తుంది.
స్టాండర్డ్ మోడల్ ఎస్-క్రాస్తో పోలిస్తే ఈ ప్లస్ వేరియంట్ను భిన్నంగా ఉంచేందుకు ఇందులో ఎక్స్టీరియర్ ట్రిమ్స్ను క్రోమ్తో ఫినిష్ చేసే అవకాశం ఉంది. ఇంకా ఇందులో కొన్ని సూక్ష్మమైన డిజైన్ మార్పులు కూడా ఉండొచ్చని అంచనా.
MOST READ:పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ కొత్త వీడియో.. చూసారా !
ఇంటీరియర్స్లో కాంట్రాస్ట్ స్టిచింగ్తో పాటు కొత్త అప్హోలెస్ట్రీ వంటి కొన్ని సూక్ష్మమైన మార్పులు ఉండొచ్చని తెలుస్తోంది. ఈ స్పెషల్ ఎడిషన్ మోడల్లో చేసిన అన్ని మార్పుల వివరాలు విడుదల సమయంలో తెలిసే అకాశం ఉంది.
మారుతి సుజుకి ఎస్-క్రాస్ ప్లస్ వేరియంట్లో కొద్దిపాటి కాస్మెటిక్ మార్పులు మరియు అదనపు ఫీచర్లు మినహా ఓవరాల్ డిజైన్ సిల్హౌట్ మాత్రం స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే ఉండే అవకాశం ఉంది.
కాగా, కొత్త 2020 మారుతి సుజుకి ఎస్-క్రాస్ మొత్తం నాలుగు వేరియంట్లలో లభిస్తుంది (సిగ్మా, డెల్టా, జీటా మరియు ఆల్ఫా). సిగ్మా వేరియంట్ మినహా మిగిలిన అన్ని వేరియంట్లు ఆప్షనల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో లభిస్తాయి. ప్రస్తుతం మార్కెట్లో వీటి ధరలు రూ.8.39 నుంచి రూ.12.39 లక్షల మధ్యలో ఉన్నాయి (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).
MOST READ:బ్రతుకు తెరువుకోసం కొన్న రిక్షా స్వాధీనం చేసుకున్న అధికారులు.. తర్వాత ఏం జరిగిందంటే ?
మారుతి సుజుకి ఎస్-క్రాస్ కారులో బిఎస్6 మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీతో (ఎస్హెచ్విఎస్) కూడిన 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 104 బిహెచ్పి పవర్ను మరియు 138 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది మరియు ఇది స్టాండర్డ్ ఫైవ్-స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్తో జతచేయబడుతుంది. కంపెనీ ఇందులో ఆప్షనల్ ఫోర్-స్పీడ్ టార్క్-కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్బాక్స్ను కూడా కలిగి ఉంటుంది.
కొత్త 2020 ఎస్-క్రాస్లో ఎల్ఈడి హెడ్ల్యాంప్స్, టెయిల్ లాంప్స్, డ్యూయెల్ టోన్ అల్లాయ్ వీల్స్, సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, మల్టిపుల్ ఎయిర్బ్యాగులు, ఏబిఎస్ విత్ ఇబిడి మరియు రియర్ పార్కింగ్ కెమెరా, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, కీలెస్ ఎంట్రీ మొదలైన ఫీచర్లు ఉన్నాయి.
MOST READ:ఆర్టిస్ట్ చేసిన బస్ నమూనాకు KSRTC ఫిదా, తర్వాత ఏం జరిగిందో తెలుసా?
ఎస్-క్రాస్ క్రాసోవర్ మొత్తం ఐదు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది (నెక్సా బ్లూ, కెఫిన్ బ్రౌన్, గ్రానైట్ గ్రే, పెరల్ ఆర్కిటిక్ వైట్ మరియు ప్రీమియం సిల్వర్). ఎస్-క్రాస్ క్రాసోవర్ మోడల్ను మారుతి సుజుకి బ్రాండ్ యొక్క ప్రీమియం నెక్సా డీలర్షిప్ల ద్వారా ప్రత్యేకంగా విక్రయిస్తున్నారు.
మారుతి సుజుకి ప్రకారం, కొత్త ఎస్-క్రాస్ క్రాసోవర్ మార్కెట్లో కియా సెల్టోస్, హ్యుందాయ్ క్రెటా మరియు నిస్సాన్ కిక్స్ వంటి మిడ్-సైజ్ ఎస్యూవీలతో పోటీ పడుతుంది.
మారుతి సుజుకి ఎస్-క్రాస్ ప్లస్ లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్పై డ్రైవ్స్పార్క్ అభిప్రాయం.
దేశంలో కొనసాగుతున్న పండుగ సీజన్ మార్కెట్ సెంటిమెంట్ను క్యాష్ చేసుకునేందుకు మారుతి సుజుకి ఇండియా ఓ కొత్త వేరియంట్ ఎస్-క్రాస్ మోడల్తో సిద్ధమవుతోంది. ఈ కొత్త వేరియంట్ ద్వారా కంపెనీ అమ్మకాలను పెంచుకోవాలని చూస్తోంది.
MOST READ:20 ఏళ్ళ బి.టెక్ అమ్మాయి ప్రాణం తీసిన గో-కార్టింగ్ సరదా.. ఎలాగో తెలుసా ?