ఫెస్టివెల్ సీజన్లో రికార్డ్ స్థాయిలో మెర్సిడెస్ బెంజ్ అమ్మకాలు

కోవిడ్-19 లాక్ డౌన్ లో ఆటో పరిశ్రమలు ఎక్కువ నష్టాలను చవిచూసినప్పటికీ కరోనా లాక్ డౌన్ దాదాపు అన్ని కంపెనీలు కొంచెం మెరుగైన పనితీరుని కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే జపనీస్ లగ్జరీ కార్ బ్రాండ్ మెర్సిడెస్ బెంజ్ కంపెనీ కూడా ఈ పండుగ సీజన్లో కంపెనీ మెరుగైన రికవరీ సాధించినట్లు ప్రకటించింది. నవరాత్రి మరియు దసరా వేడుకల సందర్భంగా మెర్సిడెస్ బెంజ్ 550 కార్లను పంపిణీ చేసినట్లు తెలిపింది.

ఫెస్టివెల్ సీజన్లో రికార్డ్ స్థాయిలో అమ్మకాలను సాధించిన మెర్సిడెస్ బెంజ్

ఇది కొత్త రికార్డు అని మెర్సిడెస్ బెంజ్ ఇండియా తెలిపింది. ఈ ఉత్సవాల్లో మెర్సిడెస్ బెంజ్ కార్లకు అత్యధిక డిమాండ్ ఢిల్లీ ఎన్‌సిఆర్, ముంబై, గుజరాత్ మరియు ఇతర ఉత్తర భారత మార్కెట్లలో కనిపించిందని కంపెనీ తెలిపింది.

ఫెస్టివెల్ సీజన్లో రికార్డ్ స్థాయిలో అమ్మకాలను సాధించిన మెర్సిడెస్ బెంజ్

కంపెనీ ఢిల్లీ ఎన్‌సిఆర్‌లో 175 కార్లను పంపిణీ చేయగా, మిగిలిన 375 కార్లు ముంబై, గుజరాత్ మరియు ఇతర మార్కెట్లలో అమ్ముడయ్యాయి. ఈ అమ్మకంలో అత్యంత ప్రాచుర్యం పొందిన మోడళ్లలో సి-క్లాస్ మరియు ఇ-క్లాస్ సెడాన్లు ఉన్నాయి.

ఫెస్టివెల్ సీజన్లో రికార్డ్ స్థాయిలో అమ్మకాలను సాధించిన మెర్సిడెస్ బెంజ్

ఇవి కాకుండా, ఇటీవల విడుదల చేసిన కంపెనీ కొత్త ఎస్‌యూవీ లైనప్ అయిన జిఎల్‌సి, జిఎల్‌ఇ మరియు జిఎల్‌ఎస్‌లను కూడా ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అమ్మకాల వృద్ధి పరిమితులు మరియు వారి పూర్తి సామర్థ్యానికి అనుగుణంగా కంపెనీ పనిచేయడం ప్రారంభించి కొన్ని ఆఫర్లను ప్రవేశపెట్టడం వల్ల ఇది జరిగిందని మెర్సిడెస్ బెంజ్ ఇండియా తెలిపింది.

ఫెస్టివెల్ సీజన్లో రికార్డ్ స్థాయిలో అమ్మకాలను సాధించిన మెర్సిడెస్ బెంజ్

ఏది ఏమైనా పండుగ సీజన్లో కొంత వరకు ఆర్థికపరమైన వెసులుబాటు కల్పించడం తో పాటు వినియోగదారులుకు ఇష్టమైన మోడల్స్ ప్రవేశపెట్టడం వల్ల ఇది సాధ్యమైంది. అంతే కాకుండా మెర్సిడెస్ ఉత్పత్తి పోర్ట్‌ఫోలియో మరియు విస్తృత శ్రేణి ఆర్థిక ఎంపికలు కూడా దీనికి చాలా వరకు దోహదపడ్డాయి.

ఫెస్టివెల్ సీజన్లో రికార్డ్ స్థాయిలో అమ్మకాలను సాధించిన మెర్సిడెస్ బెంజ్

దీని గురించి మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండి మరియు సిఇఒ మార్టిన్ ష్వెంక్ మాట్లాడుతూ, మా వినియోగదారుల అవసరాలను మేము దృష్టిలో ఉంచుకున్నాము. వినియోగదారులను ఉపయోగకరంగా ఉండటమే మా అన్ని కార్యక్రమాలలోని ఉద్దేశ్యం. వినియోగదారులు కూడా ఈ కార్యక్రమాలలో ఉన్నారు.

ఫెస్టివెల్ సీజన్లో రికార్డ్ స్థాయిలో అమ్మకాలను సాధించిన మెర్సిడెస్ బెంజ్

మెర్సిడెస్ బెంజ్ మెర్సిడెస్-ఎఎమ్‌జి జిఎల్‌సి 43 కూపేను 3 నవంబర్ 2020 న భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్లు కంపెనీ అధికారికంగా ధృవీకరించింది. ఈ వారం ప్రారంభంలో, జర్మన్ వాహన తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ భారతదేశంలో తయారు చేసిన జిఎల్‌సి 43 ఎఎమ్‌జి యొక్క మొదటి యూనిట్‌ను ప్రకటించింది. పండుగ సీజన్ ఆటో పరిశ్రమలకు నిజంగా చాలా కలిసి వచ్చిందనే చెప్పాలి.

More from DriveSpark

Article Published On: Tuesday, October 27, 2020, 9:34 [IST]
English summary
Mercedes-Benz India Sales Registers New Record This Festive Season. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+