కరోనా రోగుల కోసం ఎంజి హెక్టర్ అంబులెన్స్

భారతదేశంలో కరోనా మహమ్మారి రోజు ఎక్కువగా వ్యాపిస్తున్న కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ విధించబడింది. దేశంలో విధించబడిన లాక్ డౌన్ వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. అంతే కాకుండా దేశంలో ఆర్థిక వ్యవస్థ బాగా క్షీణీస్తోంది.

ఈ కారణంగా దేశవ్యాప్తంగా చాలామంది సినీ పరిశ్రమల వారు, ఆటో మొబైల్ కంపెనాలు ఎక్కువ సంఖ్యలో విరాళాలను ఇవ్వడం జరిగింది, మరియు చాల ఆటో కంపెనీలు అవసరమైన వైద్య పరికరాలను తయారుచేసి కరోనా నివారణలో భాగం పంచుకుంటున్నారు. ఇప్పుడు ఎంజి మోటార్ ఇండియా కంపెనీ ఒక అంబులెన్సును విరాళంగా ఇచ్చింది.

కరోనా రోగుల కోసం ఎంజి హెక్టర్ అంబులెన్స్

ఎంజి మోటార్ ఇండియా ఒక మాడిఫై చేయబడిన ఎంజి హెక్టర్‌ రోగుల ప్రాణాలను రక్షించే వైద్య పరికరాలను కలిగి ఉన్న అంబులెన్స్‌గా మార్చింది. దేనిని గుజరాత్‌లోని హలోల్‌లోని సిహెచ్‌సి ఆసుపత్రికి విరాళంగా ఇచ్చింది.

కరోనా రోగుల కోసం ఎంజి హెక్టర్ అంబులెన్స్

కరోనా వైరస్ మహమ్మారి వల్ల దేశంలో వాహనాల తయారీ నిలిపివేయబడింది. కానీ దేశంలోని కార్ల తయారీ సంస్థలు సాధ్యమైనంతవరకు ప్రభుత్వానికి సహకరించడానికి మరియు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. ఆ కార్ల తయారీదారులలో ఒకరు ఎంజి మోటార్ ఇండియా. ఎంజి మోటార్ కంపెనీ ఇప్పటికే కోవిడ్-19 సహాయక చర్యలకు సహాయపడటానికి అనేక కార్యక్రమాలను చేపట్టింది.

కరోనా రోగుల కోసం ఎంజి హెక్టర్ అంబులెన్స్

ఎంజి హెక్టర్ అంబులెన్స్‌ను ఎంజి మోటార్ ఇండియా గుజరాత్ వ్యవసాయ, పర్యావరణ, పంచాయతీ శాఖ సహాయ మంత్రి జయద్రత్‌సింగ్ పర్మార్ ద్వారా సిహెచ్‌సి హలోల్ ఆసుపత్రికి అందజేశారు.

కరోనా రోగుల కోసం ఎంజి హెక్టర్ అంబులెన్స్

ఈ మాడిఫై చేయబడిన ఎంజి హెక్టర్ అంబులెన్సులో ఆటో లోడింగ్ స్ట్రెచర్, సిలిండర్‌తో ఆక్సిజన్ సప్లై సిస్టం, ఐదు-పారామీటర్ మానిటర్‌, ఫైర్ ఎగ్సిస్ట్, సైరన్ మరియు యాంప్లిఫైయర్‌తో ఔట్ లైట్ బార్ వంటి ముఖ్యమైన వైద్య పరికరాలు ఇందులో ఉన్నాయి.

కరోనా రోగుల కోసం ఎంజి హెక్టర్ అంబులెన్స్

ఇందులో బ్యాటరీ మరియు సాకెట్లు మరియు అదనపు ఇంటీరియర్ లైటింగ్‌తో ఇన్వర్టర్. అటెండర్‌కు జంప్ సీటు కూడా ఉంది, ఇది హెక్టర్ యొక్క అసలు వెనుక సీటులో సగం ఖర్చులను ఆదా చేయడానికి పునర్నిర్మించబడింది.

కరోనా రోగుల కోసం ఎంజి హెక్టర్ అంబులెన్స్

కరోనా రోగుల చికిత్సలో కీలకమైన వెంటిలేటర్ల ఉత్పత్తికి సహాయపడటానికి ఎంజి మోటార్ ఇండియా ఇటీవల MAX వెంటిలేటర్‌తో తన భాగస్వామ్యాన్నికూడా ప్రకటించింది. కార్ల తయారీదారు గతంలో 100 హెక్టర్ ఎస్‌యూవీలను దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ సమయంలో అవసరమైన సేవలను అందించారు.

కరోనా రోగుల కోసం ఎంజి హెక్టర్ అంబులెన్స్

భారతదేశంలో లాక్ డౌన్ తరువాత, ఎంజి హెక్టర్ కంపెనీ జూన్ నాటికి మూడు వరుస హెక్టర్ ప్లస్‌ను ప్రారంభించటానికి సిద్దమైంది, మరియు పండుగ సీజన్ ప్రారంభానికి పూర్తి పరిమాణ ఎంజి గ్లోస్టర్ ట్రాక్‌లోకి రానున్నట్లు కూడా ధృవీకరించింది.

More from DriveSpark

Article Published On: Saturday, May 2, 2020, 13:57 [IST]
English summary
MG Donates Customized Hector ambulance for covid-19 patients in India. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+