Just In
- 5 hrs ago వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- 9 hrs ago ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- 11 hrs ago కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- 14 hrs ago 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
Don't Miss
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Movies Paarijatha Parvam Review సునీల్, చైతన్య రావు క్రైమ్ కామెడీ ఎలా ఉందంటే? పారిజాత పర్వం రివ్యూ
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
కరోనా ఎఫెక్ట్ : లాక్ డౌన్ సమయంలో టోల్ చార్జెస్ వసూలుకి బ్రేక్
ప్రపంచదేశాలు నేడు కరోనా వైరస్ గుప్పెట్లో నలిగి పోతున్నాయి. ఇటలీ, చైనా దేశాలలో చాల మంది ప్రజలు ఈ వైరస్ వల్ల ప్రాణాలు కోల్పోయారు. అంతే కాకుండా భారతదేశంలో కూడా ఈ వైరస్ వ్యాప్తి చాల ఎక్కువగానే ఉంది. ఈ వైరస్ వ్యాప్తిని నివారించడానికి భారత ప్రభుత్వం ఇటీవల కాలంలో జనతా కర్ఫ్యూ వంటి వాటిని కూడా నిర్వహించింది.
అంతే కాకుండా రోజు రోజుకి పెరుగుతున్న ఈ వైరస్ భాదితులను రక్షించడానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశాన్ని 21 రోజుల పాటు లాక్ డౌన్ విధించాలని సూచించారు. ఈ కారణంగా కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ లో ఉన్నాయి.
ఈ లాక్ డౌన్ వల్ల ప్రజలు బహిరంగ ప్రదేశాలలో తిరగకూడదని ఆంక్షలు విధించారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రజలు బయటకి రాకూడదని తెలిపారు. ఈ నేపథ్యంలో 21 రోజుల లాక్ డౌన్ సందర్బంగా భారతదేశంలో ఉన్న అన్ని హైవే టోల్ వసూలు నిలిపివేయబడింది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా దీనిని ప్రకటించింది.
ఎకనామిక్ టైమ్స్ ప్రకారం, అన్ని టోల్ బూత్లను మూసివేయడానికి రహదారి రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ బుధవారం అధికారులకు ఇచ్చిన తరువాత NHAI నుండి ఈ చర్య అమలులోకి వచ్చింది. దేశంలో లాక్ డౌన్ ముగిసే వరకు వచ్చే 21 రోజులు భారతదేశం అంతటా టోల్ వసూలు నిలిపివేయబడుతుంది.
రహదారి రవాణా రహదారుల మంత్రిత్వ శాఖకు ఎన్హెచ్ఏఐ మార్చి 25 న లేఖ రాసినట్లు నివేదిక పేర్కొంది. మార్చి 25 నుంచి అమల్లోకి వచ్చేలా అన్ని వాణిజ్య, ప్రైవేటు సంస్థలను 21 రోజుల పాటు మూసివేయాలని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశించినట్లు ఈ లేఖలో పేర్కొన్నారు.
భారతదేశంలో కోవిడ్ -19 వైరస్ వ్యాప్తిని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వ ప్రణాళికల్లో భాగంగా ఈ ఉత్తర్వు వచ్చింది. బస్సులు, రైళ్లు, క్యాబ్లు, విమానాలతో సహా అన్ని రవాణా మార్గాలను నిలిపివేసినట్లు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. అయితే అవసరమైన వస్తువుల రవాణా, లా అండ్ ఆర్డర్ సిబ్బంది, ప్రెస్ మరియు అత్యవసర సేవలకు మినహాయింపు ఇవ్వబడింది.
భారతదేశంలో కరోనావైరస్ వ్యాప్తి భారతదేశంలో మరియు అంతర్జాతీయంగా అనేక వ్యాపారాలను ప్రభావితం చేసింది. మార్చి 24 న టెలివిజన్ ప్రసంగం ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ భారతదేశాన్ని లాక్ డౌన్ లో ఉంచాలని ప్రకటించారు. లాక్ డౌన్ ప్రకటనకు ముందే చాలా ఆటోమొబైల్ కంపెనీల కార్యకలాపాలను నిరవధికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి.
ఆటోమొబైల్ కంపెనీలు తమ అమ్మకాలు మరియు సేవా కార్యకలాపాలను కూడా మూసివేసాయి. ఇది భారత మార్కెట్లో అమ్మకాలను ప్రభావితం చేసింది. ఏవైనా ముఖ్యమైన కారణాల వల్ల ప్రజలు తమ ఇళ్ల నుంచి బయటకు వెళ్లవద్దని ఆదేశించారు. అన్ని నగరాల్లోని ట్రాఫిక్ పోలీసులు ఈ ప్రాంతాలను పర్యవేక్షిస్తున్నారు.
డ్రైవ్స్పార్క్ తెలుగు అభిప్రాయం.. !
భారతదేశం మొత్తం నేడు లాక్ డౌన్ లో ఉంది. ఈ లాక్ డౌన్ లో భాగంగా 21 రోజులు అన్ని రవాణాలు నిలిపివేయబడ్డాయి. కోవిడ్ -19 వ్యాప్తి ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది ప్రజలను ప్రభావితం చేసింది. దేశంలో ప్రాణాంతక వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా ఉండటానికి భారత ప్రభుత్వం ఈ కఠినమైన చర్యలను తీసుకుంటోంది.
దేశ ప్రజల రక్షణ కోసం భారత ప్రభుత్వం ఇంతగా ఆలోచిస్తూ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నప్పుడు ప్రజలు కూడా దీనికి మద్దతు తెలిపి ఇంట్లోనే ఉంటూ ఈ భయంకరమైన వైరస్ నుంచి విముక్తి పొందాలి.