Just In
- 1 hr ago వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- 2 hrs ago ఈ కార్లు కొనుగోలు చేసేవారికి శుభవార్త!.. మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్స్
- 3 hrs ago మండే వేసవిలో ట్రాఫిక్ పోలీసులకు చల్లచల్లని ఏసీ హెల్మెట్లు.. ఎక్కడో తెలుసా.??
- 6 hrs ago ఎన్నో అంచనాల మధ్య లాంచ్ అయిన క్లచ్లెస్ బైక్ TVS Jive.. ఎందుకు ఫెయిల్ అయింది.??
Don't Miss
- News Modi-Hanuman Chalia:హనుమాన్ ఛాలీసాపై ప్రధాని మోదీ వివాదాస్పద వ్యాఖ్యలు..!
- Movies Jai HanuMan హనుమాన్ జయంతి రోజున.. కళ్లు చెదిరేలా జై హనుమాన్ 3డీ పోస్టర్ రిలీజ్
- Finance Banking News: ప్రభుత్వ బ్యాంకులకు ఆ అధికారం లేదు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు..
- Sports IPL: నైట్ అంతా సిట్టింగ్ వేస్తే ఎలా గెలుస్తారు?- రైనా
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
డాట్సన్ కార్ల ఉత్పత్తిని నిలిపివేసిన నిస్సాన్
జపాన్ దిగ్గజ కార్ల తయారీ సంస్థ అయిన నిస్సాన్ కొన్ని సంవత్సరాల క్రితం తక్కువ ధర కలిగిన డాట్సన్ కార్లను విడుదల చేసింది. గో, గో ప్లస్, రెడిగో మరియు గో క్రాస్ మోడళ్లను రష్యన్, ఆఫ్రికన్ మరియు ఆగ్నేయాసియా మార్కెట్లలో డాట్సన్ పేరుతో విక్రయిస్తున్నారు.
ఈ డాట్సన్ కార్లు అతి తక్కువ ధరను కలిగి ఉన్నప్పటికీ ఇండియన్ మార్కెట్లో ఊహించిన విధంగా అమ్ముడు కాలేదు. కాబట్టి ఆదాయం తగ్గుముఖం పట్టింది. ఈ కారణంగా డాట్సన్ కార్లను పూర్తిగా నిలిపివేయాల్సి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఇండోనేసియాలో డాట్సన్ కార్లు మూసివేయబడుతున్నాయి.
ఒక్క ఇండోనేసియాలో మాత్రమే కాకుండా అదనంగా దాని రెండు తయారీ కర్మాగారాలను మూసివేసింది. నిస్సాన్ కార్లను అక్కడి కరావాంగ్ ప్లాంట్లో మరియు బుర్వకార్తాలోని తయారీ కర్మాగారంలో తయారు చేస్తారు. నిస్సాన్ ఈ రెండు ఉత్పత్తి కర్మాగారాలను మూసివేసింది. ఈ కారణంగా వేలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు.
ఈ విధంగా మూసివేసినప్పటికీ నిస్సాన్ కార్లను దిగుమతి చేసుకోవడం మరియు అమ్మడం కొనసాగిస్తోంది. ఎక్స్-ట్రయల్ మరియు సెరెనా మోడళ్లను జపాన్లోని నిస్సాన్ ఉత్పత్తి కర్మాగారం నుండి దిగుమతి చేసుకుని ఇండోనేషియాలో విక్రయిస్తున్నారు. నవార్ పికప్ ట్రక్ థాయిలాండ్ నుండి దిగుమతి అవుతుంది. నిస్సాన్ తన భాగస్వామి సంస్థ మిత్సుబిషి యొక్క ఉత్పత్తి కర్మాగారంలో లివోనియా ఎంపివిని ఉత్పత్తి చేయాలని యోచిస్తోంది.
నిస్సాన్ కిక్స్ ఎస్యువిని త్వరలో ఇండోనేషియాలో విడుదల చేయనున్నారు. ఈ మోడల్ను థాయిలాండ్కు దిగుమతి చేసుకుని విక్రయించే అవకాశాలు ఉన్నాయి. గత సంవత్సరం డాట్సన్ దాదాపు 7,000 యూనిట్లను విక్రయించినాట్లు ప్రకటించింది.
కంపెనీ ఊహించిన దానికంటే తక్కువ అమ్మకాలు చేపట్టడం వల్ల డాట్సన్ కార్ల అమ్మకాలను నిస్సాన్ పూర్తిగా నిలిపివేసింది. భారత్తో సహా 2022 నాటికి డాట్సన్ కార్లు ప్రపంచవ్యాప్తంగా మూసివేయబడతాయి.
భారతదేశంలో డాట్సన్ కార్ల అమ్మకాలు ఆశించిన స్థాయిలో లేవు. నిస్సాన్ ఈ విధమైన నిర్ణయం తీసుకోవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా 12,500 మంది ఉద్యోగాలు కోల్పోతారు.