Just In
- 30 min ago 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
- 1 hr ago కూతురికి రూ.2 కోట్ల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి.. ఫిదా చేస్తున్న వీడియో
- 2 hrs ago కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- 16 hrs ago 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
Don't Miss
- Sports చరిత్ర సృష్టించిన అక్షర్ & పంత్ క్రేజీ రికార్డు
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- News జగన్ కు వైఎస్ వివేకా భార్య లేఖ-అవినాష్, వైసీపీ అటాక్ పై-న్యాయంవైపు నిలబడాలని విన్నపం..!
- Finance Kotak Mahindra Bank: కొంపముంచిన కోటక్ మహీంద్రా బ్యాంక్.. భారీగా పడిపోయిన స్టాక్..!
- Technology ఆపిల్ తరహా డిజైన్తో నాయిస్ స్మార్ట్వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్తో విడుదల
- Movies Brahmamudi April 25th episode: కావ్యకు సవతి వచ్చినా ఫర్వాలేదా?.. నీవు నా మొగుడిని తగులుకుంటావా? అనామిక
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
కరోనా బాధితుల సహాయం కోసం మరో అడుగు ముందుకు వేసిన ఓలా
భారతదేశంలో కరోనా రోజు రోజుకు భయంకరంగా వ్యాప్తి చెందుతోంది. ఈ క్రమంలో ఈ మహమ్మారి భారీ నుండి ప్రజలను రక్షించడానికి భారత ప్రభుత్వం 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించింది. ఈ లాక్ డౌన్ కారణంగా భారతదేశంలో వాహన సేవలన్నీ నిలిపివేయబడ్డాయి. ఈ నేపథ్యంలో దూర ప్రాంతాలలో ఉండే ప్రజలు కూడా తమ ప్రాంతాలను వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది.
కరోనా వైరస్ ప్రజల జీవితాలను ప్రభావితం చేసింది. కరోనా వైరస్ కి వ్యతిరేకంగా పోరాడాటానికి చాలా మంది పారిశ్రామికవేత్తలు, ఆటోమొబైల్ కంపెనీలు మరియు ప్రముఖులు ప్రభుత్వంతో చేతులు కలిపారు. కరోనాపై పోరాటం కోసం భారీగా విరాళాలను కూడా అందించారు. అంతే కాకుండా కొన్ని ఆటో పరిశ్రమలు వైద్య పరికరాలను తయారుచేయడంలో నిమగ్నమై ఉన్నాయి.
భారతదేశపు అతిపెద్ద క్యాబ్ సర్వీస్ గా పేరెన్నిక గన్న సంస్థ ఓలా. కరోనా వైరస్ పై పోరాడుతున్న ప్రభుత్వాన్ని మద్దతుగా నిలబడింది. ఇటీవల ఓలా తమ డ్రైవర్లకు ఆర్థిక సహాయం కూడా అందించింది. ఇప్పుడు ఓలా ప్రభుత్వంతో చేతులు కలిపారు. క్యాబ్ సేవా సంస్థ ఓలా పిఎం కేర్స్ రూ. 5 కోట్లు విరాళాన్ని కూడా ప్రకటించింది.
MOST READ:లాక్డౌన్ లో కొడుకుని తీసుకురావడానికి 1400 కిలోమీటర్లు ప్రయాణించిన తల్లి
ఓలా కంపెనీ ఒక్క పిఎం సహాయనిధికి మాత్రమే కాకుండా, వివిధ రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 3 కోట్లు కూడా ఇచ్చింది. ఓలా గ్రూప్ సహ వ్యవస్థాపకుడు మరియు సిఇఒ భవేష్ అగర్వాల్ ఈ పరిస్థితిని సంక్షోభ సమయంగా అభివర్ణించారు.
ఆరోగ్య శాఖ నుండి అవసరమైన ప్రొవైడర్ల వరకు వందలాది మంది అధికారులు, న్యాయ శాఖ సిబ్బంది మరియు అనేక మంది పౌర సేవా కార్మికులు అందించే సేవలతో మేము సంతోషిస్తున్నాము అని ఆయన అన్నారు.
MOST READ:డ్యూయల్ ఛానల్ ఎబిఎస్తో కొత్త బిఎస్ 6 బజాజ్ పల్సర్ RS 200
లాక్ డౌన్ లో భాగంగా దేశ ప్రజలకు సహాయం చేస్తున్న ప్రజలందరూ తమ కర్తవ్యాన్ని నిలుపుకుంటున్నారు. ఓలా కఠినమైన సమయాల్లో ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని ఇంకా మా వర్గాలకు అన్ని విధాలుగా సహాయం చేయడానికి సిద్ధంగా కూడా సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు.
ఓలా కంపెనీ యొక్క సాంఘిక సంక్షేమ విభాగం ఓలా ఫౌండేషన్ ఇటీవల డ్రైవ్ ది డ్రైవర్ ఫండ్ అనే ప్రాజెక్ట్ కూడా ప్రారంభించింది. ఈ ఫండ్ నుండి వచ్చే నిధులు ఓలాలో పనిచేసే క్యాబ్, ఆటోరిక్షా మరియు టాక్సీ డ్రైవర్లకు ఉపయోగించబడతాయి.