కరోనా బాధితుల సహాయం కోసం మరో అడుగు ముందుకు వేసిన ఓలా
భారతదేశంలో కరోనా రోజు రోజుకు భయంకరంగా వ్యాప్తి చెందుతోంది. ఈ క్రమంలో ఈ మహమ్మారి భారీ నుండి ప్రజలను రక్షించడానికి భారత ప్రభుత్వం 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించింది. ఈ లాక్ డౌన్ కారణంగా భారతదేశంలో వాహన సేవలన్నీ నిలిపివేయబడ్డాయి. ఈ నేపథ్యంలో దూర ప్రాంతాలలో ఉండే ప్రజలు కూడా తమ ప్రాంతాలను వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది.

కరోనా వైరస్ ప్రజల జీవితాలను ప్రభావితం చేసింది. కరోనా వైరస్ కి వ్యతిరేకంగా పోరాడాటానికి చాలా మంది పారిశ్రామికవేత్తలు, ఆటోమొబైల్ కంపెనీలు మరియు ప్రముఖులు ప్రభుత్వంతో చేతులు కలిపారు. కరోనాపై పోరాటం కోసం భారీగా విరాళాలను కూడా అందించారు. అంతే కాకుండా కొన్ని ఆటో పరిశ్రమలు వైద్య పరికరాలను తయారుచేయడంలో నిమగ్నమై ఉన్నాయి.

భారతదేశపు అతిపెద్ద క్యాబ్ సర్వీస్ గా పేరెన్నిక గన్న సంస్థ ఓలా. కరోనా వైరస్ పై పోరాడుతున్న ప్రభుత్వాన్ని మద్దతుగా నిలబడింది. ఇటీవల ఓలా తమ డ్రైవర్లకు ఆర్థిక సహాయం కూడా అందించింది. ఇప్పుడు ఓలా ప్రభుత్వంతో చేతులు కలిపారు. క్యాబ్ సేవా సంస్థ ఓలా పిఎం కేర్స్ రూ. 5 కోట్లు విరాళాన్ని కూడా ప్రకటించింది.

ఓలా కంపెనీ ఒక్క పిఎం సహాయనిధికి మాత్రమే కాకుండా, వివిధ రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 3 కోట్లు కూడా ఇచ్చింది. ఓలా గ్రూప్ సహ వ్యవస్థాపకుడు మరియు సిఇఒ భవేష్ అగర్వాల్ ఈ పరిస్థితిని సంక్షోభ సమయంగా అభివర్ణించారు.

ఆరోగ్య శాఖ నుండి అవసరమైన ప్రొవైడర్ల వరకు వందలాది మంది అధికారులు, న్యాయ శాఖ సిబ్బంది మరియు అనేక మంది పౌర సేవా కార్మికులు అందించే సేవలతో మేము సంతోషిస్తున్నాము అని ఆయన అన్నారు.

లాక్ డౌన్ లో భాగంగా దేశ ప్రజలకు సహాయం చేస్తున్న ప్రజలందరూ తమ కర్తవ్యాన్ని నిలుపుకుంటున్నారు. ఓలా కఠినమైన సమయాల్లో ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని ఇంకా మా వర్గాలకు అన్ని విధాలుగా సహాయం చేయడానికి సిద్ధంగా కూడా సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు.

ఓలా కంపెనీ యొక్క సాంఘిక సంక్షేమ విభాగం ఓలా ఫౌండేషన్ ఇటీవల డ్రైవ్ ది డ్రైవర్ ఫండ్ అనే ప్రాజెక్ట్ కూడా ప్రారంభించింది. ఈ ఫండ్ నుండి వచ్చే నిధులు ఓలాలో పనిచేసే క్యాబ్, ఆటోరిక్షా మరియు టాక్సీ డ్రైవర్లకు ఉపయోగించబడతాయి.


Click it and Unblock the Notifications








