వైద్య సదుపాయాల కోసం 500 క్యాబ్లను అందిస్తున్న ఓలా , ఎక్కడో తెలుసా..!

కరోనా వైరాస్ వ్యాప్తివల్ల భారతదేశం మొత్తం ఇప్పుడు లాక్ డౌన్ లో ఉంది. ఈ లాక్ డౌన్ కారణంగా రవాణా సదుపాయాలన్నీ నిలిపివేయడం జరిగింది. ఈ క్రమంలో విమానాలు, ట్రైన్లు మొదలైన వాటి సేవలు కూడా ఇప్పుడు పూర్తిగా నిలిపేయబడింది. ఈ విధంగా రవాణా సేవలు నిలిపివేయడం వల్ల అత్యవసర సమయంలో రోగులకు సహాయం చేయడానికి ఓలా 500 క్యాబ్లను ఉపయోగించనున్నట్లు ప్రకటించింది.

వైద్య సదుపాయాల కోసం 500 క్యాబ్లను అందిస్తున్న ఓలా , ఎక్కడో తెలుసా..!

500 ఓలా క్యాబ్‌లు కర్ణాటకలోని వివిధ జిల్లాలలో ఆరోగ్య కార్యకర్తల కొరకు, మందుల రవాణా కొరకు మరియు ఇతర అవసరమైన ఆరోగ్య పరికరాలను తీసుకెళ్లడానికి ఉపయోగించబడతాయి.

వైద్య సదుపాయాల కోసం 500 క్యాబ్లను అందిస్తున్న ఓలా , ఎక్కడో తెలుసా..!

కరోనా వైరస్ సంబంధిత కార్యకలాపాలను నిర్వహించడం కోసం, వైద్యులను రవాణా చేయడానికి ఓలా క్యాబ్స్ తన 500 వాహనాలను కర్ణాటక ప్రభుత్వానికి ఇచ్చింది. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి అయిన 'డాక్టర్ సిఎన్ అశ్వత్ నారాయణ్' దీనిని గురించి ట్వీట్‌లో తెలిపారు.

వైద్య సదుపాయాల కోసం 500 క్యాబ్లను అందిస్తున్న ఓలా , ఎక్కడో తెలుసా..!

ఓలా యొక్క సేవలు బెంగళూరు, మైసూర్, మంగుళూరు, హుబ్లి ధార్వాడ్ మరియు బెలగావి జిల్లాల్లో లభిస్తాయి, అంతే కాకుండా బట్టి ప్రభుత్వం ఈ ప్రాంతాలలో క్యాబ్‌లను వినియోగించబడుతుందని తెలిపారు. క్యాబ్‌లు ఆరోగ్య సంరక్షణ కార్మికులను, రవాణా మందులను మరియు ఇతర అవసరమైన ఆరోగ్య పరికరాలను రవాణా చేయడానికి ఉపయోగించబడతాయి. అత్యవసర పరిస్థితుల్లో కూడా క్యాబ్‌లు ఉపయోగించబడతాయి.

వైద్య సదుపాయాల కోసం 500 క్యాబ్లను అందిస్తున్న ఓలా , ఎక్కడో తెలుసా..!

ఇండియాలో లాక్ డౌన్ ప్రకటించిన తరువాత ఓలా క్యాబ్స్ తన సేవలను పూర్తిగా నిలిపివేసింది. లాక్ డౌన్ ముగిసే వరకు ఓలా ఎటువంటి సేవలను నిర్వహించదు. కానీ ప్రస్తుత పరిస్థితులకు అనుకూలంగా వైద్య సేవలకు ఉపయోగించడానికి మాత్రమే ఇప్పుడు ఇవి ఉపయోగించబడతాయని ప్రకటించారు.

వైద్య సదుపాయాల కోసం 500 క్యాబ్లను అందిస్తున్న ఓలా , ఎక్కడో తెలుసా..!

కొరోనా వైరస్ ప్రభావం వల్ల భారతదేశంలో ఇప్పటివరకు 29 మందికి పైగా మరణించినట్లు నివేదికలు ధ్రువీకరించాయి. అంతే కాకుండా 1070 మందికి పైగా వైరస్ పాజిటివ్ ఉన్నట్లు తెలిపారు. దీని ఫలితంగానే దేశం లాక్ డౌన్ లో ఉంచబడింది.

వైద్య సదుపాయాల కోసం 500 క్యాబ్లను అందిస్తున్న ఓలా , ఎక్కడో తెలుసా..!

ఈ లాక్ డౌన్ కారణంగా వలస కార్మికులు తమ ఇళ్లకు తిరిగి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నందున సామూహిక బహిష్కరణకు గురయ్యారు. ఈ కార్మికులకు ఆహారం, ఆశ్రయం కోసం రాష్ట్ర ప్రభుత్వాలు సదుపాయాలు కల్పిస్తున్నాయి.

వైద్య సదుపాయాల కోసం 500 క్యాబ్లను అందిస్తున్న ఓలా , ఎక్కడో తెలుసా..!

వలస కార్మికులకు గ్రేటర్ నోయిడాలో ఉన్న బుద్ధ ఇంటర్నేషనల్ సర్క్యూట్ (బిఐసి) కూడా ఇదే రీతిగాఉపయోగించబడుతుంది. ఆటో మొబైల్ తయారీ సంస్థలు కూడా మాస్క్ లు, గ్లౌజ్ లు మరియు వెంటిలేటర్లతో సహా అవసరమైన వైద్య పరికరాలను ఉత్పత్తి చేస్తున్నారు.

వైద్య సదుపాయాల కోసం 500 క్యాబ్లను అందిస్తున్న ఓలా , ఎక్కడో తెలుసా..!

ఏది ఏమైనా ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఓలా 500 క్యాబ్లను వైద్య సేవలకు ఉపయోగించడం అనేది హర్షించదగ్గ విషయం. ఇప్పటికే కరోనాకి వ్యతిరేఖంగా పోరాడుతున్న ప్రభుత్వం కోసం సినీ పరిశ్రమవారు, ఆటో మొబైల్ సంస్థలు చాలా మద్దతు తెలిపాయి. ఇప్పుడు ఓలా వైద్య సదుపాయాల కోసం కార్లను వినియోగిస్తూ తన మద్దతుని తెలిపింది.

More from DriveSpark

Article Published On: Tuesday, March 31, 2020, 16:43 [IST]
English summary
Coronavirus Pandemic: Ola Offers 500 Cabs To Transport Doctors In Karnataka. Read in TElugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+