Just In
- 12 hrs ago గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- 13 hrs ago 5 రూపాయల గొడవ.. చిర్రెత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రయాణికుడు.. అసలేం జరిగిందంటే.!!
- 15 hrs ago జనాలు ఎక్కువగా కొంటున్న టాప్-3 SUVలు ఇవే.. జాబితాలో లేని టాటా కార్లు!!
- 18 hrs ago జాన్ అబ్రహం మనసుదోచిన కొత్త బైక్ ఇదే!.. మీరూ చూడండి
Don't Miss
- Movies Karthika Deepam 2 నా బిడ్డకు దూరంగా ఉండు.. కార్తీక్కు దీప షాక్
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
రెండేళ్ల గరిష్టానికి పెరిగిన పెట్రోల్ ధర; లీటర్ ధర రూ.90
దేశంలో పెట్రోల్, డీజిల్ ఇంధన ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. గడచిన ఆదివారం లీటరు పెట్రోల్పై 28 పైసలు మరియు లీటరు డీజిల్పై 29 పైసల చొప్పున ధరలు పెరిగాయి. అంతర్జాతీయ చమురు ధరలను ధృవీకరించిన తరువాత దేశంలో వరుసగా ధరలను పెంచడం ఇది ఐదవసారి.
తాజా ధరల సవరింపుతో ముంబైలో పెట్రోల్ ధర లీటరుకు 90 రూపాయలను చేరుకోగా, డీజిల్ ధరలు లీటరుకు 80 రూపాయలకు చేరుకున్నాయి. సెప్టెంబర్ 2018 నుండి దేశంలో అత్యధిక ఇంధన ధర ఇది. ముంబైలో ఇప్పుడు ఇంధన ధరలు లీటరు పెట్రోల్కు రూ.89.78 నుండి రూ.90.05కి పెరగగా, డీజిల్ ధరలు లీటరుకు రూ.79.93 నుండి 80.23కి పెరిగాయి.
దేశ రాజధాని ఢిల్లీలో కూడా వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. పెట్రోల్ ధర లీటరుకు సుమారు రూ.28 పైసలు పెరగగా, పెట్రోల్ ధరలు రూ.30 పైసలు చొప్పున పెరిగాయి. దీంతో ప్రస్తుతం ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ.83.13 నుంచి రూ.83.41కు పెరగగా, డీజిల్ ధరలు లీటరుకు రూ.73.32 నుంచి రూ.73.61కి పెరిగాయి.
MOST READ:మీకు తెలుసా.. లంబోర్ఘిని ఉరుస్ డ్రైవింగ్ చేస్తూ కనిపించిన తమిళ్ తలైవా రజినీకాంత్
గడచిన నెల చివరి నుండి భారతదేశంలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు స్థిరంగా పెరుగుతూ వస్తున్నాయి. నవంబర్ 20 నుండి ఇంధన ధరలను పెంచడం ఇది వరుసగా 14వసారి. దేశంలోని ప్రధాన చమురు కంపెనీలు రెండు నెలల విరామం తరువాత నవంబర్ 20వ తేదీ నుండి రోజువారీగా ఇంధన ధరలను సవరిస్తూ వస్తున్నాయి.
నవంబర్ 20కి ముందు, సెప్టెంబర్ 22 నుండి పెట్రోల్ ధరలు స్థిరంగా ఉండగా, చివరిసారిగా డీజిల్ ధరలను అక్టోబర్ 2వ తేదీన పెంచడం జరిగింది. ప్రధాన చమురు కంపెనీలైన భారత్ పెట్రోలియం కార్పొరేషన్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్లు అంతర్జాతీయ ధరలు మరియు విదేశీ మారకపు రేట్ల ఆధారంగా ప్రతిరోజూ ఇంధన ధరలను సవరిస్తూ ఉంటారు.
MOST READ:దుర్భర స్థితిలో పడిఉన్న ఖరీదైన లగ్జరీ కార్స్.. ఎక్కడో తెలుసా ?
అయితే, దేశంలో కోరనా మహమ్మారి సమయంలో చమురు కంపెనీలు రోజువారీ పెట్రోల్ మరియు డీజిల్ ధరల సవరణలను నిలిపివేసాయి. పెట్రోల్ మరియు డీజిల్ ధరల సవరణపై వరుసగా 58 రోజుల మరియు 48 రోజుల విరామం ఏర్పడింది. అంతకు ముందు మార్చి 17 నుండి జూన్ 6 వరకు పెట్రోల్ మరియు డీజిల్ ధరలపై యథాతథ స్థితిని కొనసాగించడం, తరువాత జూన్ 30 నుండి ఆగస్టు 15 వరకు కొనసాగించడం జరిగింది.
దేశంలో విపరీతంగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై డ్రైవ్స్పార్క్ అభిప్రాయం.
భారతదేశ వ్యాప్తంగా పెట్రోల్ మరియు డీజిల్ ధరలను వరుసగా 5వసారి పెంచారు. ఈ ధరల పెంపు రెండేళ్ల గరిష్టానికి చేరుకున్నాయి. అయితే, వివిధ రాష్ట్రాల్లోని స్థానికి పన్నుల కారణంగా ఆయా రాష్ట్రాల్లో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు మారుతూ ఉంటాయి - మీ నగరంలో ఇంధన ధరలను ఇక్కడ తెలుసుకోండి.
MOST READ:కొత్త విమానంలో ప్రయాణించిన భారత రాష్ట్రపతి ; ఇంతకీ ఈ విమానం ప్రత్యేకత ఏంటో తెలుసా