Just In
- 9 hrs ago
కారులో ఉన్న పాడిల్ షిఫ్ట్ ఫీచర్ యొక్క ప్రయోజనాలు
- 21 hrs ago
భారత్లో ఫేమ్ స్కీమ్స్ కింద స్థాపించబడిన EV ఛార్జింగ్ స్టేషన్లు
- 21 hrs ago
టాటా టిగోర్ ఈవి ఫేస్లిఫ్ట్ వివరాలు వెల్లడి; ఎక్స్ ప్రెస్-టి పేరుతో త్వరలోనే లాంచ్!
- 24 hrs ago
హైదరాబాద్లో విడుదల కానున్న బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ - డీటేల్స్
Don't Miss
- Movies
Rang De Total Collections: నితిన్కు రెండో షాక్.. 24.50 కోట్ల టార్గెట్.. చివరకు వచ్చింది ఎంతంటే!
- Sports
మంచి గిఫ్ట్తో బెన్స్టోక్స్కు రాజస్థాన్ రాయల్స్ వీడ్కోలు..!
- News
కరోనా టీకానే వివేక్ను బలి తీసుకుంది.. నటుడు మన్సూర్ అలీ ఖాన్ ఆరోపణలు
- Finance
జీరో బ్యాలెన్స్ ఖాతాల్లో ట్రాన్సాక్షన్స్ ఛార్జీలపై ఎస్బీఐ వడ్డీ రేటు, ఫ్రీ ట్రాన్సాక్షన్స్
- Lifestyle
ఈ వారం 18వ తేదీ నుండి ఏప్రిల్ 24వ తేదీ వరకు మీ రాశిఫలాలు...
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రెండేళ్ల గరిష్టానికి పెరిగిన పెట్రోల్ ధర; లీటర్ ధర రూ.90
దేశంలో పెట్రోల్, డీజిల్ ఇంధన ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. గడచిన ఆదివారం లీటరు పెట్రోల్పై 28 పైసలు మరియు లీటరు డీజిల్పై 29 పైసల చొప్పున ధరలు పెరిగాయి. అంతర్జాతీయ చమురు ధరలను ధృవీకరించిన తరువాత దేశంలో వరుసగా ధరలను పెంచడం ఇది ఐదవసారి.

తాజా ధరల సవరింపుతో ముంబైలో పెట్రోల్ ధర లీటరుకు 90 రూపాయలను చేరుకోగా, డీజిల్ ధరలు లీటరుకు 80 రూపాయలకు చేరుకున్నాయి. సెప్టెంబర్ 2018 నుండి దేశంలో అత్యధిక ఇంధన ధర ఇది. ముంబైలో ఇప్పుడు ఇంధన ధరలు లీటరు పెట్రోల్కు రూ.89.78 నుండి రూ.90.05కి పెరగగా, డీజిల్ ధరలు లీటరుకు రూ.79.93 నుండి 80.23కి పెరిగాయి.

దేశ రాజధాని ఢిల్లీలో కూడా వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. పెట్రోల్ ధర లీటరుకు సుమారు రూ.28 పైసలు పెరగగా, పెట్రోల్ ధరలు రూ.30 పైసలు చొప్పున పెరిగాయి. దీంతో ప్రస్తుతం ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ.83.13 నుంచి రూ.83.41కు పెరగగా, డీజిల్ ధరలు లీటరుకు రూ.73.32 నుంచి రూ.73.61కి పెరిగాయి.
MOST READ:మీకు తెలుసా.. లంబోర్ఘిని ఉరుస్ డ్రైవింగ్ చేస్తూ కనిపించిన తమిళ్ తలైవా రజినీకాంత్

గడచిన నెల చివరి నుండి భారతదేశంలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు స్థిరంగా పెరుగుతూ వస్తున్నాయి. నవంబర్ 20 నుండి ఇంధన ధరలను పెంచడం ఇది వరుసగా 14వసారి. దేశంలోని ప్రధాన చమురు కంపెనీలు రెండు నెలల విరామం తరువాత నవంబర్ 20వ తేదీ నుండి రోజువారీగా ఇంధన ధరలను సవరిస్తూ వస్తున్నాయి.

నవంబర్ 20కి ముందు, సెప్టెంబర్ 22 నుండి పెట్రోల్ ధరలు స్థిరంగా ఉండగా, చివరిసారిగా డీజిల్ ధరలను అక్టోబర్ 2వ తేదీన పెంచడం జరిగింది. ప్రధాన చమురు కంపెనీలైన భారత్ పెట్రోలియం కార్పొరేషన్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్లు అంతర్జాతీయ ధరలు మరియు విదేశీ మారకపు రేట్ల ఆధారంగా ప్రతిరోజూ ఇంధన ధరలను సవరిస్తూ ఉంటారు.
MOST READ:దుర్భర స్థితిలో పడిఉన్న ఖరీదైన లగ్జరీ కార్స్.. ఎక్కడో తెలుసా ?

అయితే, దేశంలో కోరనా మహమ్మారి సమయంలో చమురు కంపెనీలు రోజువారీ పెట్రోల్ మరియు డీజిల్ ధరల సవరణలను నిలిపివేసాయి. పెట్రోల్ మరియు డీజిల్ ధరల సవరణపై వరుసగా 58 రోజుల మరియు 48 రోజుల విరామం ఏర్పడింది. అంతకు ముందు మార్చి 17 నుండి జూన్ 6 వరకు పెట్రోల్ మరియు డీజిల్ ధరలపై యథాతథ స్థితిని కొనసాగించడం, తరువాత జూన్ 30 నుండి ఆగస్టు 15 వరకు కొనసాగించడం జరిగింది.

దేశంలో విపరీతంగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై డ్రైవ్స్పార్క్ అభిప్రాయం.
భారతదేశ వ్యాప్తంగా పెట్రోల్ మరియు డీజిల్ ధరలను వరుసగా 5వసారి పెంచారు. ఈ ధరల పెంపు రెండేళ్ల గరిష్టానికి చేరుకున్నాయి. అయితే, వివిధ రాష్ట్రాల్లోని స్థానికి పన్నుల కారణంగా ఆయా రాష్ట్రాల్లో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు మారుతూ ఉంటాయి - మీ నగరంలో ఇంధన ధరలను ఇక్కడ తెలుసుకోండి.
MOST READ:కొత్త విమానంలో ప్రయాణించిన భారత రాష్ట్రపతి ; ఇంతకీ ఈ విమానం ప్రత్యేకత ఏంటో తెలుసా