అకడమిక్ సిలబస్ లో చేరనున్న ట్రాఫిక్ సేఫ్టీ రూల్స్ ; ఎక్కడో తెలుసా ?
భారతదేశంలో రోజు రోజుకి పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించడంలో భాగంగా రాజస్థాన్ ప్రభత్వం మోటారు ట్రాఫిక్ చట్టం 2019ను అమలు చేసింది. మోటారు ట్రాఫిక్ చట్టం 2019 ప్రకారం ట్రాఫిక్ ఉల్లంఘనలకు జరిమానా పెంపును రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ స్వాగతించారు.

వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలంటే జరిమానాలు పెంచాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. జరిమానాలు పెంచినట్లయితే ఖచ్చితంగా రోడ్డు నియమాలను పాటించే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఈ విధంగా మేలు చేయడం జరిగింది.

రాజస్థాన్ ప్రభుత్వ ఉన్నతాధికారుల సంభాషణలో పాల్గొన్న ముఖ్యమంత్రులు రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో రహదారి భద్రత అమలయ్యేలా చూడనున్నారు. చిన్న వయస్సు నుండే పిల్లలకు ట్రాఫిక్ నిబంధనల గురించి అవగాహన కల్పిస్తామని కూడా చెప్పారు.

పాల ఉత్పత్తిదారులకు 15 వేల హెల్మెట్లను పంపిణీ చేయడానికి పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం చర్యలు తీసుకుంది. జిల్లా స్థాయిలో స్వచ్ఛంద సంస్థల సహకారంతో రహదారి భద్రతా కార్యకలాపాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ముఖ్యమంత్రులు సూచించారు.

జిల్లా కేంద్రాల్లో డ్రైవింగ్ శిక్షణా సంస్థలను ప్రారంభిస్తామని చెప్పారు. అధిక-నాణ్యత గల హెల్మెట్లు ప్రమాదం జరిగినప్పుడు ప్రమాద రేటును దదౌ 50% వరకు తగ్గించే అవకాశం ఉంటుంది.

రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య గురించి రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు, కావున వాటిని ప్రభుత్వాలు తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారు. రోడ్డు ప్రమాదాలను 50% తగ్గించడానికి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

రోడ్డు ప్రమాదాలను తగ్గించాలని రవాణా శాఖ నిర్ణయించినట్లు రాజస్థాన్ రవాణా మంత్రి ప్రతాప్ సింగ్ ఖాచారివాస్ తెలిపారు. ప్రమాదాల నుండి ప్రజలను రక్షించడానికి రాష్ట్రంలో 2019 మోటారు వాహన చట్టం అమలుచేయబడుతోంది. రోడ్డుపై ప్రయాణించే వాహనదారులు కచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ పాటించినట్లయితే రోడ్డు ప్రమాదాలను దాదాపు తగ్గించవచ్చు.


Click it and Unblock the Notifications








