రాంగ్లర్ జీపులో కనిపించిన ఇద్దరు బాలీవుడ్ స్టార్స్
సాధారంగా సినీతారలు మరియు సెలబ్రెటీస్ చాలా ఖరీదైన వాహనాలలో తిరగటం మనం చూస్తూనే ఉంటాము. ఇప్పుడు అదే విధంగా ప్రముఖ బాలి వుడ్ స్టార్స్ సైఫ్ అలీ ఖాన్ మరియు కరీనా కపూర్ ఇద్దరు కూడా ఖరీదైన రాంగ్లర్ అన్లిమిటెడ్ జీప్ లో కనిపించారు. దీని గురించి మరింత సమాచారం తెలుసుకుందాం!

బాలీవుడ్ తారలైన సైఫ్ అలీ ఖాన్ మరియు కరీనా కపూర్ ఖాన్ ఇద్దరు ఖరీదైన వాహనాల్లో ఒకటైన రాంగ్లర్ అన్లిమిటెడ్ జీప్ లో తిరుగుతున్నట్లు గుర్తించారు. ఇది ప్రపంచంలోనే అత్యంత హార్డ్కోర్ ఆఫ్-రోడింగ్ వాహనాల్లో ఇది ఒకటి.

కొత్త తరం రాంగ్లర్ గత ఆగస్టులో ఇండియాకి వచ్చింది. దీని ధర దాదాపు రూ. 63.94 లక్షల వద్ద (ఎక్స్-షోరూమ్) లభిస్తుంది. ఈ 5 డోర్ల రాంగ్లర్ అన్లిమిటెడ్ వేరియంట్ను పూర్తిగా నిర్మించిన సిబియు మోడల్లో అందిస్తున్నారు.

ఈ రాంగ్లర్ అన్లిమిటెడ్ ఎస్యూవీలో హైలెట్స్ ని మనం గమనించినట్లయితే ఇందులో ఐకానిక్ 7 స్లాట్ గ్రిల్స్ ఉంటాయి. ఇరువైపులా ఎల్ఈడీ యూనిట్లతో క్లాసిక్ రౌండ్ హెడ్ల్యాంప్లని కలిగి ఉంటుంది. అంతే కాకుండా ఇది బచ్ బాక్సీ సిల్హౌట్ ని ప్రదర్శిస్తుంది.

రాంగ్లర్ యొక్క స్పాట్ లైట్ 8.4 అంగుళాల టచ్ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో వంటి ఫంక్షన్లను కూడా కలిగి ఉంటుంది. క్యాబిన్ ప్రీమియం లెదర్ అప్హోల్స్టరీ మరియు సాఫ్ట్-టచ్ లెదర్ మరియు కాంట్రాస్ట్ స్టిచ్చింగ్ డాష్ బోర్డుని పొందుతుంది.

కరీనా కపూర్, అమీర్ ఖాన్ తో కలిసి నటించిన లాల్ సింగ్ చద్దాలో కనిపించనుంది. ఇది అమెరికన్ కామెడీ డ్రామా ఫారెస్ట్ గంప్ యొక్క ఇండియన్ అడాప్టెన్ మూవీ. ఇది హిందీ భాషల్లో పెద్ద హిట్ సాధించింది. దీనితో పాటు కరణ్ జోహార్ యొక్క మల్టీస్టారర్ హిస్టారికల్ డ్రామాలో జహానారా బేగం పాత్రలో నటిస్తుంది.

మరోవైపు సైఫ్ అలీ ఖాన్ జనవరి 31 న విడుదల కానున్న కామెడీ ఎంటర్టైనర్ జవానీ జానెమాన్ లో టబు మరియు కొత్తగా వచ్చిన అలయ ఎఫ్ సరసన కనిపించనున్నారు. ఇదే కాకుండా ఇంకా రెండు చిత్రాలు దిల్ బెచారా మరియు భూత్ పోలీస్ వంటివి వాటిలో కూడా నటిస్తున్నారు.
Image Courtesy: Free Press Journal


Click it and Unblock the Notifications








