Just In
- 5 hrs ago వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- 8 hrs ago ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- 10 hrs ago కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- 13 hrs ago 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
Don't Miss
- News సీఎం జగన్పై రాళ్లదాడి కేసులో బొండ ఉమ అరెస్ట్..?
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Movies Paarijatha Parvam Review సునీల్, చైతన్య రావు క్రైమ్ కామెడీ ఎలా ఉందంటే? పారిజాత పర్వం రివ్యూ
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
190 కిలోమీటర్లు కేవలం 1 గంట 50 నిముషాల్లో చేరుకున్న అంబులెన్సు డ్రైవర్
భారతదేశంలో అవయవ దాతల సంఖ్య పెరుగుతోంది. దీనికి నిదర్శనంగా ఇప్పుడు తమిళనాడులో జరిగిన ఒక సంఘటన మళ్ళీ నిరూపించబడింది. ప్రమాదంలో మరణించిన యువతి లివర్ మరొక వ్యక్తికి అంటుకుంది.
మనం బ్రతికున్నప్పుడే కాదు మనం చనిపోయిన తరువాత కూడా మన అవయవాలు ఇతరులకు ఉపయోగపడాలని చాల మంది ప్రజలు అవయవదాతలుగా మారుతున్నారు. ఇటీవల కాలంలో అవయవ దాతల సంఖ్య గణనీయంగా పెరుగుతూ ఉంది.
ఈ మధ్యకాలంలో చాల మంది కొన్ని ప్రమాదాలలో మరణించడం వల్ల వారి అవయవాలను ఇతరులకు ఉపయోగించుకుంటున్నారు. ఈ విధంగా ఉపయోగించడం వల్ల వ్యక్తి మరణించిన అతని అవయవాలు బ్రతికే ఉంటాయి. ఈ నేపధ్యలో ఇటీవల జరిగిన ఇలాంటి సంఘటన ఒకటి చూద్దాం..
ఇటీవల కాలంలో తమిళనాడులో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 25 ఏళ్ల యువతి చనిపోయింది. చనిపోయిన ఆ యువతి తల్లిదండ్రులు ఆమె అవయవాలను దానం చేయడానికి ముందుకు వచ్చారు.
తమిళనాడు తంజావూరులో చనిపోయిన యువతీ లివర్, మదురైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో వ్యక్తికి కాలేయ మార్పిడి అవసరం ఉంది. చనిపోయిన యువతి లివర్ను తంజావూరు నుంచి మదురైకి అంబులెన్స్లో రోడ్డు మార్గంలో రవాణా చేశారు.
సాధారణంగా ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో డ్రైవింగ్ చేయడం కష్టమైన పని అయినప్పటికీ అంబులెన్సు డ్రైవర్ సుబ్రమణియన్ చాలా నైపుణ్యంతో తాజావూరు నుంచి మధురైకి దాదాపు 190 కిలోమీటర్లు కేవలం 1 గంట 50 నిముషాలలో చేరుకొని విజవంతంగా లివర్ మార్పిడికి దోహదం చేసాడు.
190 కిలోమీటర్లు ప్రయాణించిన సరైన సమయానికి చేరుకున్న అంబులెన్సు డ్రైవర్ సుబ్రమణియన్ పలువురి ప్రశంసలు అందుకున్నాడు. దీని గురించి సుబ్రమణియన్ మాటాడుతూ ఈ విధంగా సహాయపడటానికి ప్రజల సహకారం మరియు ట్రాఫిక్ పోలీసుల సహకారం వల్ల మాత్రమే సాధ్యమైందని అన్నారు.
190 కిలోమీటర్లు ప్రయాణం గంటకు 140 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడం వల్ల సరైన సమయానికి గమ్యాన్ని చేరుకోగలిగానని చెప్పారు. అంతే కాకుండా సుబ్రమణియన్, "ప్రాణాలను కాపాడటానికి నేను అంబులెన్స్ను జాగ్రత్తగా నడుపుతున్నాను" అని అన్నారు. అంబులెన్సులు ఎందుకు వేగంగా కదులుతున్నాయో అర్థం చేసుకున్న ప్రజలు కూడా సహాయం చేశారన్నారు.
ఇటీవల కర్ణాటకలోని ఇద్దరు అంబులెన్స్ డ్రైవర్లు అంబులెన్స్లను వేగంగా నడపగలిగారు మరియు బాధితులకు సకాలంలో చికిత్స చేయగలిగారు. అంబులెన్స్లకు మార్గం చూపే ఎవరైనా మరొకరి జీవితాన్ని గడపగలుగుతున్నారు. ఇది ప్రశంసించాల్సిన విషయం.