భారత్లో నిలిపివేయబడిన బిఎస్ 4 టాటా హెక్సా, ఎందుకో తెలుసా !
భారతదేశంలో ప్రసిద్ధి చెందిన టాటా మోటార్స్ హెక్సా బిఎస్ 4 కారును నిలిపివేసింది. టాటా హెక్సా కారు బుకింగ్ను కంపెనీ తన అధికారిక వెబ్సైట్లో నిలిపివేసింది. రాబోయే రోజుల్లో టాటా హెక్సా బిఎస్ 6 వెర్షన్ విడుదల కానుంది. దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం.

టాటా హెక్సా బిఎస్ 6 కారు లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది ప్రస్తుతానికి కొత్త కారు విడుదల కొంత సందేహంగా ఉందని కంపెనీ తెలిపింది. భారతదేశంలో ప్రస్తుత పరిస్థితి సాధారణమయ్యే వరకు కంపెనీ ఏ కార్లను విడుదల చేసే అవకాశం లేదు.

కొత్త టాటా హెక్సాకు 2.2 లీటర్ వారియర్ బిఎస్ 6 డీజిల్ ఇంజన్ అమర్చబడుతుంది. ఈ ఇంజన్ రెండు ట్యూన్లలో లభిస్తుంది మరియు 150 బిహెచ్పి పవర్ వద్ద 320 ఎన్ఎమ్ టార్క్, 154 బిహెచ్పి పవర్ మరియు 400 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

హెక్సా బిఎస్ 6 కారు 5 స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్ లేదా 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్బాక్స్ కి జత చేయబడి ఉంటుంది. హెక్సా ఆల్ వీల్ డ్రైవ్ హెక్సా సఫారి వెర్షన్లో అందించబడుతుంది.

హెక్సా సఫారి వెర్షన్ కారుని ఢిల్లీలో జరిగిన 2020 ఆటో ఎక్స్పోలో ప్రదర్శించారు. హెక్సా సఫారి వెర్షన్లో చిన్న సౌందర్య మార్పులు చేయబడ్డాయి. మార్కెట్లో ఉన్న టాటా హెక్సా బిఎస్ 4 కారులో మాన్యువల్ గేర్బాక్స్ యొక్క 7 మోడళ్లు మరియు ఆటోమేటిక్ గేర్బాక్స్ యొక్క రెండు మోడళ్లు ఉన్నాయి.

టాటా హెక్సా బిఎస్ 4 ప్రారంభ ధర రూ. 13.25 లక్షలు (ఎక్స్ షోరూమ్). హెక్సా బిఎస్ 6 ధర మునుపటికనే రూ. 50 వేల రూపాయలు అధికంగా ఉంటుంది. లాక్ డౌన్ మినహాయింపు తర్వాత టాటా మోటార్స్ గ్రీన్ మరియు ఆరెంజ్ జోన్లలో తన షోరూమ్లలోకి తీసుకు రానుంది.

టాటా మోటార్స్ తన పంత్ నగర్ మరియు సనంద్ తయారీ కర్మాగారాలను తిరిగి ప్రారంభించింది. అయితే లక్నో, జంషెడ్పూర్ యూనిట్ల ప్రారంభానికి సంబంధించి కంపెనీ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.


Click it and Unblock the Notifications








