ఇండియాలో కార్ కేర్ ప్రొడక్ట్ లాంచ్ చేసిన టర్టల్ వాక్స్
కరోనా వైరస్ భారతదేశంలోనే కాకుండా మొత్తం ప్రపంచంలోనే భయానక వాతావరణాన్ని ఏర్పరిచింది. ఈ మహమ్మారి వల్ల అనేకమంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు అంతే కాకుండా ఎంతోమంది ప్రజలు ఈ వైరస్ భారిన పడ్డారు. కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ ప్రజల ద్వారా మాత్రమే కాకుండా వాహనాల ద్వారా కూడా వ్యాపిస్తుంది.

కరోనా వైరస్ ఎక్కువగా వ్యాపిస్తున్న తరుణంలో వాహనాలు నిరంతరం స్క్రబ్బింగ్ అవుతాయి. ఈ నేపథ్యంలో చికాగోకు చెందిన కార్ కేర్ ప్రొడక్ట్ తయారీ సంస్థ టర్టల్ వాక్స్ దేశీయ మార్కెట్లో తన వ్యాపారాన్ని ప్రారంభించి, అనేక ఉత్పత్తులను ప్రారంభించింది.

పెయింట్ వర్క్, వీల్, టైర్, అప్హోల్స్టరీ మరియు ప్లాస్టిక్లను రక్షించడానికి టర్టల్ వాక్స్ తన ఉత్పత్తులను విడుదల చేసింది. అదనంగా ద్విచక్ర వాహనాలు మరియు ఫోర్ వీలర్ ఉపరితలాలను రక్షించడానికి కంపెనీ తమ కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టింది.

చికాగోకు చెందిన ఈ సంస్థను ఒకే కుటుంబం నిర్వహిస్తుంది. టర్టల్ కార్ కేర్ దాదాపు 75 సంవత్సరాలుగా ఇలాంటి ఉత్పత్తులను మార్కెట్లో ఆవిష్కరించి విడుదల చేస్తోంది. దీనివల్ల ప్రజలు తమ వాహనాలను జాగ్రత్తగా చూసుకోవచ్చు. దీని వల్ల వైరస్ సంక్రమణ కొంత వరకు నివారించవచ్చు.

టర్టల్ వాక్స్ 1944 లో బెన్ హిర్ష్ స్థాపించారు. అతను ప్రపంచంలో మొట్టమొదటి లిక్విడ్ ఆటో పాలిష్ అయిన ప్లాస్టన్ను కనుగొన్నాడు. 1946 లో ప్లాస్టన్ పేరు టర్టల్ వాక్స్ గా మార్చబడింది.

ఈ ప్రతిష్టాత్మక బ్రాండెడ్ ఉత్పత్తులు ఇప్పుడు ప్రపంచంలోని 120 కి పైగా దేశాలలో అమ్ముడవుతున్నాయి. ఈ సమాచారాన్ని బెన్ హిర్ష్ మనవడు మరియు టర్టల్ వాక్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డెన్నిస్ జాన్ హీలీ తెలిపాడు.

దీని గురించి మాట్లాడుతూ భారతదేశంలో మా వ్యాపారాన్ని ప్రారంభించడం మన చరిత్రలో కొత్త అధ్యాయాన్ని ఇస్తుందని అన్నారు. భారతదేశంలో మా వ్యాపారం గురించి మేము ఆశ్చర్యపోయాము. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మరియు విభిన్న ఆటోమోటివ్ మార్కెట్లలో భారతదేశం ఒకటి అని ఆయన అన్నారు. ఈ టర్టల్ వాక్స్ ఉత్పత్తులు వాహనాలకు చాలా ఉపయోగపడతాయి. భర్తహదేశంలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో టర్టల్ వాక్స్ చాలా అవసరం. ఎందుకంటే కరోనా మహమ్మారి నుంచి కొంతవరకు బయటపడే అవకాశం కూడా ఉంది.


Click it and Unblock the Notifications








