క్యాబ్ డ్రైవింగ్ చేస్తూ నిద్రలోకి జారుకున్న డ్రైవర్, ప్యాసింజెర్ మహిళ ఏం చేసిందంటే.. ?
భారతదేశం అభివృద్ధి చెందుతున్న తరుణంలో టెక్నాలజీ కూడా అంతకంటే వేగంగా పరుగులు తీస్తోంది. అన్ని రంగాలలో టెక్నాలజీ ద్వారా ఆశించినదానికంటే ఎక్కువ డెవలెప్మెంట్ సాధిస్తున్నారు. ఇంక ప్రయాణానికి సంబంధించిన వాహనాలు ఎప్పుడు కావాలంటే అప్పుడు బుక్ చేసుకుని ఎంతదూరమైనా ప్రయాణించే సదుపాయం మనకు కల్పించబడింది.

ఇప్పుడు ఉబర్ వంటి యాప్ ల ద్వారా కార్లను బుక్ చేసుకుని సుదూర ప్రాంతాలకు వెళ్లే సదుపాయం కూడా ఉంటుంది. ఈ విధంగా ఉబర్ యాప్ ద్వారా ఒక కార్ బుక్ చేసుకున్న ఒక మహిళకు ఒక చేదు అనుభవం ఎదురయింది. దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం..

28 ఏళ్ల తేజస్విని అనే మహిళ ఆన్లైన్ యాప్ ద్వారా ఒక ఇంటర్సిటీ క్యాబ్ను బుక్ చేసుకుంది. ఈ క్యాబ్ పూణే నుండి ముంబై కి బయలు దేరింది. ఈ క్యాబ్ లో తేజస్విని మరియు డ్రైవర్ ఉన్నారు. సాధారణంగా పూణే నుంచి ముంబై చేరుకోవడానికి 3 గంటల సమయం పడుతుంది. డ్రైవర్ డ్రైవింగ్ చేస్తూ నిద్రలోకి జారుకున్నాడు.

డ్రైవింగ్ చేస్తూ నిద్రపోతున్న డ్రైవర్ ని తేజస్విని గుర్తించి వెంటనే క్యాబ్ ఆపమని చెప్పింది. క్యాబ్ ఆపిన తరువాత తేజస్విని స్వయంగా ఈ క్యాబ్ నడిపినట్లు ఆమె ట్విట్ చేసింది. ఆ క్యాబ్ డ్రైవర్ కో డ్రైవర్ సీట్లో కూర్చున్నాడు. తేజస్విని కార్ డైవింగ్ చేసింది.

ఈ విధంగా నిద్రిస్తున్న డ్రైవర్పై ఉబెర్ ఆగ్రహం వ్యక్తం చేసింది ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినందుకు ఉబెర్ సోషల్ నెట్వర్కింగ్ సైట్ ద్వారా క్షమాపణలు కోరింది.

డ్రైవింగ్ చేసేటప్పుడు డ్రైవర్ అప్రమత్తంగా ఉండకుండా నిద్రపోతే చాల జీవితాలు దెబ్బతినడం ఖాయం. కాబట్టి సరైన జాగ్రత్తలు తీసుకుని డ్రైవర్ డ్రైవింగ్ చేయాలి. అంతే కాకుండా వాహనాలలో ప్రయాణించే వ్యక్తులు డ్రైవర్ తో మాటాడుతూ ఉండటం వల్ల కూడా కొంత వరకు ఇటువంటి ప్రమాదాలను నిరోధించవచ్చు.


Click it and Unblock the Notifications








