Just In
- 50 min ago క్రాష్ టెస్ట్లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- 4 hrs ago వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- 5 hrs ago ఈ కార్లు కొనుగోలు చేసేవారికి శుభవార్త!.. మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్స్
- 6 hrs ago మండే వేసవిలో ట్రాఫిక్ పోలీసులకు చల్లచల్లని ఏసీ హెల్మెట్లు.. ఎక్కడో తెలుసా.??
Don't Miss
- Sports India squad for T20 World Cup: ఏడుగురు స్పెషలిస్ట్ బ్యాటర్లు.. తెలుగోడికి నో ఛాన్స్!
- News విశాఖలో కూటమికి బిగ్ షాక్.. వైసీపీలో చేరిన కీలక నేత
- Technology స్మార్ట్వాచ్ సెగ్మెంట్లోకి ప్రముఖ సంస్థ.. 8 రోజుల బ్యాటరీ లైఫ్, హెల్త్ ట్రాకర్లతో ProWatch విడుదల..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Movies Jai HanuMan హనుమాన్ జయంతి రోజున.. కళ్లు చెదిరేలా జై హనుమాన్ 3డీ పోస్టర్ రిలీజ్
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
బ్రేకింగ్ న్యూస్.. ఉబర్ సేవలు ఇకపై వీరికి మాత్రమే
భారతదేశంలో కరోనా ఎక్కువగా విస్తరిస్తున్న కారణంగా భారత ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించబడింది. ప్రస్తుతం ఇండియాలో లాక్ డౌన్ రెండవ దశ అమలులో ఉంది. ఇది 2020 మే 03 వరకు రెండవ దశ లాక్ డౌన్ ఉంటుంది. బహుశా కరోనా ఎక్కువగా ఉన్న రాష్ట్రాలలో మే 03 తర్వాత కూడా లాక్ డౌన్ కొనసాగించే సూచనలు కనిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో చాలా ఆటో సంస్థలు ప్రభుత్వానికి మద్దతుగా చెస్థులు కలిపాయి. ఇందులో భాగంగా ప్రజలకు తమ సేవలను అందిస్తున్నాయి. ఈ లాక్ డౌన్ లో రాత్రి పగలు ఎక్కువగా శ్రమిస్తున్న ఆరోగ్య కార్యకర్తలకు ఉబర్ తన సేవలను అందించడానికి ముందుకు వచ్చింది.
ఉబర్ మెడికల్ సర్వీస్ ద్వారా అత్యవసర సేవలను అందించడానికి మహారాష్ట్ర ప్రభుత్వానికి రూ. 1 కోట్ల ఉచిత సేవలను అందించనుంది. కరోనాకు చికిత్స చేస్తున్న వైద్యులు, ఆరోగ్య సిబ్బంది మరియు ప్రభుత్వ అధికారులకు ఉబర్ ఈ ఉచిత సేవను అందించనుంది.
అంతే కాకుండా ఉబర్ ఇతర అవసరమైన వస్తువులను సరఫరా చేయనున్నట్లు కూడా ప్రకటించింది. ఆరోగ్య సేవల్లో ఉపయోగం కోసం ఈ ఉబర్ వాహనాలు ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి. డ్రైవర్ మరియు ప్రయాణీకుల మధ్య అంతరాన్ని తగ్గించడానికి ఉబర్ మెడిక్ టాక్సీ కారు పైకప్పు నుండి నేల వరకు ప్లాస్టిక్ షీట్లను ఏర్పాటు చేసింది.
MOST READ:భారత్ లో ప్రారంభం కానున్న నెక్జు మొబిలిటీ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్స్
దీని గురించి ఉబెర్ సీఈఓ దారా ఖోస్రోషాహి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్త ఉబర్ వాహనాలు దాదాపు 10 మిలియన్ ఉచిత రైడ్లు మరియు ఫుడ్ డెలివరీ చేయడానికి తమ సేవలను అందిస్తోంది.
డ్రైవర్లకు భద్రతను అందించడానికి భద్రతా విధానాలలో కూడా శిక్షణ పొందుతారు మరియు ప్రతి ట్రిప్ మధ్య కార్లను స్వైప్ చేయడానికి శానిటైజర్లు మరియు క్రిమిసంహారక మందులు అందించనున్నారు.
MOST READ:లారా దత్త రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ నడపడం చూసారా ?
లాక్ డౌన్ సమయంలో ఉబర్ తన డ్రైవర్లు మరియు క్యాబ్ భాగస్వాములకు సహాయం చేయడానికి డ్రైవర్ కేర్ ఫండ్ను సృష్టించింది. ఈ ఫండ్ ద్వారా కంపెనీ దేశంలోని 55,000 మంది ఉబెర్ డ్రైవర్లకు దాదాపు రూ. 20 కోట్లు కేటాయించనుంది.
ఈ నిధిని రూ. 50 కోట్లకు పెంచాలని ఉబర్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ వారం చివరి నాటికి రూ. 20 కోట్లు సమీకరించనున్నట్లు ఉబర్ సెంట్రల్ ఆపరేషన్స్ హెడ్ పవన్ వైష్ తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని డబ్బును సమీకరిస్తామని కూడా చెప్పారు.
MOST READ:గుడ్ న్యూస్.. త్వరలో లాంచ్ కానున్న ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ బైక్
దేశవ్యాప్తంగా అమలులో ఉన్న లాక్ డౌన్ నుంచి ఆరోగ్య సంరక్షణ, బ్యాంకింగ్ మరియు మీడియా వంటి అవసరమైన సేవలకు మినహాయింపు ఇస్తుంది. ఓలా మరియు ఉబర్ సేవలను రద్దు చేశాయి, కాబట్టి ఈ సంస్థల ఆదాయం నిలిచిపోయింది. కాకపోతే ఈ సేవలు ఆరోగ్య కార్యకర్తల కోసం మరియు అత్యవసర సమయాల్లో రోగులను తరలించడానికి కూడా ఉబర్ తమ సేవలను కొనసాగిస్తోంది.