Just In
- 4 hrs ago త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- 7 hrs ago హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- 8 hrs ago JNCAP క్రాష్ టెస్ట్లో అదరగొట్టిన స్విఫ్ట్.. స్కోర్ ఎంతో తెలుసా?
- 8 hrs ago కొత్త మారుతి స్విఫ్ట్ బుకింగ్ ప్రైస్ ఎంతో తెలుసా? ఇక్కడ చూడండి!
Don't Miss
- Sports DC vs SRH:ట్రావిస్ హెడ్, షెహ్బాజ్ అహ్మద్ విధ్వంసం.. ఢిల్లీ ముందు భారీ లక్ష్యం
- News సుమలత దెబ్బకు మాజీ సీఎం హడల్, ఇంతవరకు ప్రచారం చెయ్యలేదు, అసలు మ్యాటర్ !
- Technology Whatsapp File Sharing Feature వాట్సాప్లో కొత్త ఫీచర్.. సులభంగా ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు..!
- Lifestyle మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
- Movies పిఠాపురంలో బెట్టింగుల జోరు.. పవన్ కల్యాణ్పై కాయ్ రాజా కాయ్.. కోట్లలో పందాలు!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
కార్ల అమ్మకాలలో కొత్త రికార్డు సృష్టించిన జమ్మూ కాశ్మీర్
భారతదేశంలో కరోనా వైరస్ ప్రభావం వల్ల 21 రోజులు లాక్ డౌన్ ప్రకటించింది. ఈ కారణంగా ఆటో పరిశ్రమలు మూతపడ్డాయి. ఈ కారణంగా ఉత్పత్తులు ఆగిపోయాయి. అంతే కాకుండా లాక్ డౌన్ ప్రభావం వల్ల పూర్తి వాహన సేవలు నిలిపివేయబడ్డాయి. కాబట్టి దేశంలో వాహన అమ్మకాలు కూడా చాల వరకు తగ్గిపోయాయి. అయితే జమ్మూ కాశ్మీర్ లో మాత్రం కార్ల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. భారత్ మొత్తం లాక్ డౌన్ లో ఉన్నప్పటికీ జమ్మూ కాశ్మీర్ లో మాత్రం ఇన్ని కార్లు ఎలా అమ్ముడయ్యాయి అనే దాని గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం.. !
జమ్మూ కాశ్మీర్ లో దేశంలోనే అత్యధిక కార్ల అమ్మకాలు జరిగాయి. 2019-20 ఆర్థిక సంవత్సరంలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో కార్ల అమ్మకాలు దాదాపు 53.4% పెరిగాయి. 2020 హోండా సిటీ కారు క్రాష్ టెస్ట్లో ఏకంగా 5 స్టార్ సాధించింది.
ఢిల్లీలో కార్ల అమ్మకాలు మాత్రం 43.6% తగ్గాయి. నివేదికల ప్రకారం కేంద్ర భూభాగమైన జమ్మూ కాశ్మీర్ ఇతర రాష్ట్రాల కంటే కార్ల అమ్మకాలు మెరుగ్గా ఉన్నాయి. లాక్ డౌన్ కారణంగా మార్చి నెలలో అమ్మకాలు బాగా తగ్గాయి. 2019-20 ఆర్థిక సంవత్సరం దేశ ఆటో మొబైల్ పరిశ్రమకు చాలా కష్టాలను తెచ్చిపెట్టింది.
ఇప్పుడు కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా ఆటో ఉత్పత్తులు ఆగిపోయాయి. దేశంలోని చాలా ఆటోమొబైల్ కంపెనీలు చైనా మరియు దక్షిణ కొరియా నుండి 10% ముడి పదార్థాలను దిగుమతి చేసుకుంటాయి. చైనా మరియు దక్షిణ కొరియాలో ఉత్పత్తి ఆగిపోయినప్పటి నుండి భారతదేశ ఆటో మొబైల్ పరిశ్రమ ముడి పదార్థాల సరఫరాపై ప్రభావం చూపింది.
ఇదే సమయంలో భారతదేశంలో బిఎస్ 6 కాలుష్య నిబంధనలు 2020 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చాయి. కానీ భారతదేశంలోని ఆటోమొబైల్ కంపెనీలు బిఎస్ 4 వాహనాల అమ్మకం నుండి సుమారు 10,000 కోట్ల రూపాయలు నష్టపోయే అవకాశం కూడా ఉంది. కానీ సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం లాక్ డౌన్ ముగిసిన తర్వాత బిఎస్ 4 వాహనాల అమ్మకలకు అదనంగా 10 రోజులు గడువు కూడా ఇచ్చింది.
అయితే మిగిలిన వాహనాలను విక్రయించడానికి ఎక్కువ సమయం ఇవ్వాలని ఆటో మొబైల్ కంపెనీలు భావిస్తున్నాయి. ఈ నెల చివరి వరకు బిఎస్ 4 వాహనాలను అమ్మలేమని ఆటోమొబైల్ డీలర్లు తెలిపారు. ఎందుకంటే ఈ నెల 14 న లాక్ డౌన్ ముగియనుంది. కానీ ఈ కరోనా వైరస్ మరింత ఎక్కువగా వ్యాపించడం వల్ల ఈ లాక్ డౌన్ మరింత పొడిగించే అవకాశం కూడా ఉంది.